Movie News

అల్లు శిరీష్ చెప్పినా.. జనం నమ్మట్లేదు

మెగా ఫ్యామిలీలో అనుకున్నంతగా సక్సెస్ కానీ హీరోల్లో అల్లు శిరీష్ ఒకడు. ఉన్నంతలో అల్లు అరవింద్ అండ్ కో తన కోసం మంచి ప్రాజెక్టులే సెట్ చేస్తున్నా.. అతను కోరుకున్న సక్సెస్ మాత్రం రావట్లేదు. ‘శ్రీరస్తు శుభమస్తు’ మినహాయిస్తే శిరీష్ కెరీర్లో పెద్ద హిట్ లేదు. తన చివరి సినిమా ‘ఊర్వశివో రాక్షసివో’ మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత స్థాయిలో వసూళ్లు కూడా రాబట్టలేక యావరేజ్ మూవీగా నిలిచింది.

ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న శిరీష్, ఇప్పుడు ‘బడ్డీ’ అనే కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న విషయం వెల్లడైంది. ఈ సినిమా ప్రి లుక్ చూడగానే ఇది తమిళ చిత్రం ‘టెడ్డీ’కి రీమేక్ అన్న నిర్ణయానికి వచ్చేశారు జనాలు. కానీ ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ.. ఇది రీమేక్ కాదని శిరీష్ స్పష్టం చేశాడు. కానీ అతను ఆ మాట అన్నా కూడా జనాలకు ఇది రీమేక్ కాదన్న నమ్మకం కలగట్లేదు.

‘టెడ్డీ’ సినిమాలో మాదిరే ఇందులోనూ ఒక టెడ్డీ బేర్‌ది ముఖ్య పాత్ర అనే విషయం పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. పైగా ఈ పోస్టర్ కూడా.. ‘టెడ్డీ’ ప్రోమోలకు చాలా దగ్గరగా ఉంది. అన్నింటికీ మించి ‘టెడ్డీ’ సినిమాను నిర్మించిన తమిళ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ పేరు ‘బడ్డీ’ పోస్టర్ మీదా ఉంది. అలాంటపుడు ఇది రీమేక్ కాదని ఎలా అనుకుంటాం? గీతా ఆర్ట్స్ వాళ్లు రీమేక్‌ల విషయంలో కొంచెం తెలివిగానే అడుగులు వేస్తుంటారు.

‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాను స్ట్రెయిట్ మూవీలాగే ప్రమోట్ చేశారు. ఎక్కడా రీమేక్ అన్న ప్రస్తావనే రాలేదు. మాతృకతో పోలిస్తే కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల రైటింగ్ క్రెడిట్ కూడా ఒరిజినల్ రైటర్‌కు ఇవ్వలేదు. ఇప్పుడు ‘టెడ్డీ’ విషయంలో అదే శైలిని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. రీమేక్ అంటే జనాల్లో ఆసక్తి తగ్గిపోతోంది కాబట్టే ఈ పద్ధతిని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. సామ్ ఆంటోన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 

This post was last modified on May 31, 2023 6:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

57 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago