మెగా ఫ్యామిలీలో అనుకున్నంతగా సక్సెస్ కానీ హీరోల్లో అల్లు శిరీష్ ఒకడు. ఉన్నంతలో అల్లు అరవింద్ అండ్ కో తన కోసం మంచి ప్రాజెక్టులే సెట్ చేస్తున్నా.. అతను కోరుకున్న సక్సెస్ మాత్రం రావట్లేదు. ‘శ్రీరస్తు శుభమస్తు’ మినహాయిస్తే శిరీష్ కెరీర్లో పెద్ద హిట్ లేదు. తన చివరి సినిమా ‘ఊర్వశివో రాక్షసివో’ మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత స్థాయిలో వసూళ్లు కూడా రాబట్టలేక యావరేజ్ మూవీగా నిలిచింది.
ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న శిరీష్, ఇప్పుడు ‘బడ్డీ’ అనే కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న విషయం వెల్లడైంది. ఈ సినిమా ప్రి లుక్ చూడగానే ఇది తమిళ చిత్రం ‘టెడ్డీ’కి రీమేక్ అన్న నిర్ణయానికి వచ్చేశారు జనాలు. కానీ ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ.. ఇది రీమేక్ కాదని శిరీష్ స్పష్టం చేశాడు. కానీ అతను ఆ మాట అన్నా కూడా జనాలకు ఇది రీమేక్ కాదన్న నమ్మకం కలగట్లేదు.
‘టెడ్డీ’ సినిమాలో మాదిరే ఇందులోనూ ఒక టెడ్డీ బేర్ది ముఖ్య పాత్ర అనే విషయం పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. పైగా ఈ పోస్టర్ కూడా.. ‘టెడ్డీ’ ప్రోమోలకు చాలా దగ్గరగా ఉంది. అన్నింటికీ మించి ‘టెడ్డీ’ సినిమాను నిర్మించిన తమిళ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ పేరు ‘బడ్డీ’ పోస్టర్ మీదా ఉంది. అలాంటపుడు ఇది రీమేక్ కాదని ఎలా అనుకుంటాం? గీతా ఆర్ట్స్ వాళ్లు రీమేక్ల విషయంలో కొంచెం తెలివిగానే అడుగులు వేస్తుంటారు.
‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాను స్ట్రెయిట్ మూవీలాగే ప్రమోట్ చేశారు. ఎక్కడా రీమేక్ అన్న ప్రస్తావనే రాలేదు. మాతృకతో పోలిస్తే కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల రైటింగ్ క్రెడిట్ కూడా ఒరిజినల్ రైటర్కు ఇవ్వలేదు. ఇప్పుడు ‘టెడ్డీ’ విషయంలో అదే శైలిని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. రీమేక్ అంటే జనాల్లో ఆసక్తి తగ్గిపోతోంది కాబట్టే ఈ పద్ధతిని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. సామ్ ఆంటోన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
This post was last modified on May 31, 2023 6:24 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…