‘బాహుబలి’ ఒక్క సినిమాగా మొదలై రెండుగా మారడం.. రెండు భాగాలూ అద్భుత ఫలితాన్ని అందుకుని ఆదాయాన్ని రెట్టింపు చేయడంతో చాలామందికి ఈ 2 పార్ట్ మూవీస్ మీద ఆసక్తి పెరిగిపోయింది. పుష్ప సినిమాను కూడా ఇలాగే ఒక సినిమాగా మొదలుపెట్టి రెండుగా మార్చారు. అక్కడ కూడా బాగానే వర్కవుట్ అయింది. కేజీఎఫ్ సినిమాను ముందు నుంచే రెండు భాగాలుగా ప్లాన్ చేశారు. రిజల్ట్ గురించి తెలిసిందే.
దీంతో కొత్తగా ఏ పెద్ద సినిమా మొదలైనా.. రెండు భాగాల చర్చ వస్తోంది. కానీ ఇలా ట్రై చేసి దెబ్బ తిన్న సినిమాలు కూడా లేకపోలేదు. ‘యన్.టి.ఆర్’ సినిమాను రెండు భాగాలు చేస్తే మొదటి భాగమే తేడా కొట్టేసి రెండో దాన్ని అస్సలు పట్టించుకోలేదు. కన్నడలో ‘కబ్జ’ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ కొత్త సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారనే వార్త హాట్ టాపిక్గా మారింది.
ఆల్రెడీ ప్రశాంత్ నీల్తో ప్రభాస్ చేస్తున్న ‘సలార్’ను రెండు భాగాలుగా తీసుకురానున్న విషయం ఖరారైంది. కాగా మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘రాజా డీలక్స్’ (వర్కింగ్ టైటిల్)ను కూడా 2 పార్ట్స్గా తెస్తారనే ప్రచారం జరుగుతోంది. అసలు మారుతితో ప్రభాస్ సినిమా అంటేనే అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మారుతి ఉన్న ఫాంలో తనతో సినిమా వద్దే వద్దని ఫ్యాన్స్ నానా గొడవ చేశారు. కానీ ప్రభాస్ అదేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు.
ఐతే ఇప్పుడు ఈ సినిమాను రెండు భాగాలుగా అంటే అభిమానులు కచ్చితంగా గొడవ చేస్తారు. ఐతే ఈ ప్రచారం ఎలా మొదలైందో ఏమో కానీ.. ఈ వార్త నిజం కాదన్నది చిత్ర వర్గాల సమాచారం. ఈ కథను కొనసాగించే ఛాన్స్ ఉన్నప్పటికీ.. రెండు భాగాలు అన్నది ఖాయం కాదట. సినిమా పూర్తి చేసి రెండో భాగం తీసేందుకు హింట్ మాత్రం ఇస్తారని.. రిజల్ట్ను, ప్రభాస్ వీలును బట్టి కథను రెడీ చేసుకుని ఇంకో సినిమా చేస్తారే తప్ప.. ఇప్పుడే సినిమాను రెండు భాగాలుగా చేయాలన్న నిర్ణయం ఏమీ జరగలేదని సమాచారం.
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…