Movie News

ఛార్మి దిగి రాక తప్పట్లే..

‘లైగర్’ సినిమా విడుదలై తొమ్మిది నెలలు కావస్తోంది. కానీ ఆ సినిమా నష్టాల తాలూకు గొడవ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘లైగర్’ వల్ల మరీ దారుణంగా దెబ్బ తిన్న బయ్యర్లు, ఎగ్జిబిటర్లు.. ఆ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిన కొన్ని రోజులకే తమకు నష్ట పరిహారం ఇవ్వాలని నిర్మాతలు పూరి జగన్నాథ్, ఛార్మిలను కోరడం.. వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో ధర్నాకు సిద్ధపడటం.. ఇంతలో పూరి వార్నింగ్ ఇచ్చిన ఆడియో ఒకటి వైరల్ కావడం.. తర్వాత ఆయన కేసుల వరకు వెళ్లడం.. ఈ తతంగం అంతా తెలిసిందే.

మధ్యలో కొన్ని నెలల పాటు ఈ వ్యవహారంలో ఏ అప్‌డేట్స్ లేవు. కానీ కొన్ని రోజుల కిందట లైగర్ బయ్యర్లు, ఎగ్జిబిటర్లు నిరాహార దీక్షలకు కూర్చోవడం సంచలనం రేపింది. రోజు రోజుకూ ఈ వ్యవహారం తీవ్రత పెరుగుతున్న సంకేతాలు కనిపించాయి. కానీ పూరి, ఛార్మిల నుంచి మాత్రం ఏ స్పందనా కనిపించలేదు. ఐతే ఈ వ్యవహారంలో సునీల్ నారంగ్ తరహా పెద్ద స్థాయి వ్యక్తులు.. అలాగే ఫిలిం ఛాంబర్ జోక్యం చేసుకోవడంతో పూరి, ఛార్మి దిగి రాక తప్పలేదు.

బాధితులకు నష్టపరిహారం చెల్లించాల్సిందే అని మెజారిటీ అభిప్రాయ పడ్డ నేపథ్యంలో పూరి, ఛార్మి సెటిల్మెంట్‌కు రెడీ అయినట్లు తెలుస్తోంది. బయ్యర్లకు న్యాయం చేస్తామని.. త్వరలోనే వారికి నష్టపరిహారం చెల్లిస్తామని తాజాగా ఛార్మి.. ఫిలిం ఛాంబర్‌కు తాజాగా మెయిల్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో బాధిత బయ్యర్లు, ఎగ్జిబిటర్లు నిరాహార దీక్షను విరమించారు. పూరి, ఛార్మి తమకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్న బాధితులు.. దీక్షకు దిగిన కొందరు పంపిణీదారుల ఆరోగ్యం దెబ్బ తిందని.. వారి శ్రేయస్సును కూడా దృష్టిలో ఉంచుకుని దీక్షను విరమిస్తున్నట్లు తెలిపారు. మరి ఈ వ్యవహారానికి పూరి, ఛార్మి ఎలా ముగింపు పలుకుతారో చూడాలి.

This post was last modified on May 19, 2023 10:16 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హైద‌రాబాదీలు… 100 కోట్ల విల్లా కొంటారా?

ఇప్పుడు మ‌ధ్య త‌ర‌గ‌తి వాళ్లు సైతం కోటి.. అంత‌కంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వ‌చ్చేశాయి. ధ‌ర‌లు అంత‌గా…

2 hours ago

కీరవాణి అది తప్పని ఋజువు చేయాలి

సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…

3 hours ago

తిరస్కరించిన సినిమాకు హడావిడి ఎందుకయ్యా

ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…

6 hours ago

అప్పులు కట్టుకుంటున్న మంచు లక్ష్మీ

టాలీవుడ్లో ఘ‌న చ‌రిత్ర ఉన్న బేన‌ర్లో ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ ఒక‌టి. ఈ బేన‌ర్ మీద ప‌దుల సంఖ్య‌లో సినిమాలు తీశారు…

6 hours ago

రెండో పెళ్లి మీద హీరోయిన్ ఆసక్తి

‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…

9 hours ago

మరోసారి కన్నీరు పెట్టిన ఎర్రబెల్లి

ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…

10 hours ago