Movie News

ఛార్మి దిగి రాక తప్పట్లే..

‘లైగర్’ సినిమా విడుదలై తొమ్మిది నెలలు కావస్తోంది. కానీ ఆ సినిమా నష్టాల తాలూకు గొడవ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘లైగర్’ వల్ల మరీ దారుణంగా దెబ్బ తిన్న బయ్యర్లు, ఎగ్జిబిటర్లు.. ఆ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిన కొన్ని రోజులకే తమకు నష్ట పరిహారం ఇవ్వాలని నిర్మాతలు పూరి జగన్నాథ్, ఛార్మిలను కోరడం.. వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో ధర్నాకు సిద్ధపడటం.. ఇంతలో పూరి వార్నింగ్ ఇచ్చిన ఆడియో ఒకటి వైరల్ కావడం.. తర్వాత ఆయన కేసుల వరకు వెళ్లడం.. ఈ తతంగం అంతా తెలిసిందే.

మధ్యలో కొన్ని నెలల పాటు ఈ వ్యవహారంలో ఏ అప్‌డేట్స్ లేవు. కానీ కొన్ని రోజుల కిందట లైగర్ బయ్యర్లు, ఎగ్జిబిటర్లు నిరాహార దీక్షలకు కూర్చోవడం సంచలనం రేపింది. రోజు రోజుకూ ఈ వ్యవహారం తీవ్రత పెరుగుతున్న సంకేతాలు కనిపించాయి. కానీ పూరి, ఛార్మిల నుంచి మాత్రం ఏ స్పందనా కనిపించలేదు. ఐతే ఈ వ్యవహారంలో సునీల్ నారంగ్ తరహా పెద్ద స్థాయి వ్యక్తులు.. అలాగే ఫిలిం ఛాంబర్ జోక్యం చేసుకోవడంతో పూరి, ఛార్మి దిగి రాక తప్పలేదు.

బాధితులకు నష్టపరిహారం చెల్లించాల్సిందే అని మెజారిటీ అభిప్రాయ పడ్డ నేపథ్యంలో పూరి, ఛార్మి సెటిల్మెంట్‌కు రెడీ అయినట్లు తెలుస్తోంది. బయ్యర్లకు న్యాయం చేస్తామని.. త్వరలోనే వారికి నష్టపరిహారం చెల్లిస్తామని తాజాగా ఛార్మి.. ఫిలిం ఛాంబర్‌కు తాజాగా మెయిల్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో బాధిత బయ్యర్లు, ఎగ్జిబిటర్లు నిరాహార దీక్షను విరమించారు. పూరి, ఛార్మి తమకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్న బాధితులు.. దీక్షకు దిగిన కొందరు పంపిణీదారుల ఆరోగ్యం దెబ్బ తిందని.. వారి శ్రేయస్సును కూడా దృష్టిలో ఉంచుకుని దీక్షను విరమిస్తున్నట్లు తెలిపారు. మరి ఈ వ్యవహారానికి పూరి, ఛార్మి ఎలా ముగింపు పలుకుతారో చూడాలి.

This post was last modified on May 19, 2023 10:16 am

Share

Recent Posts

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

59 minutes ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

1 hour ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

1 hour ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

2 hours ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

3 hours ago

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

4 hours ago