మరో ఆరు మాసాల్లో ఎన్నికలకు రెడీ అవుతున్న తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారే అవకాశం కనిపిస్తోందా? కీలక నేతలకు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పలుకుతోందా? అంటే.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి ఔననే అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా వివిధ పార్టీలకు దూరంగా ఉన్న నాయకులు.. అధికార పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న నాయకులు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ప్రస్తుతం బీజేపీలో ఉన్న వివేక్, ఈటల రాజేందర్రెడ్డి, త్రిశంకు స్వర్గంలో ఉన్న విశ్వేశ్వర రెడ్డి, పొంగులే టి శ్రీనివాస్రెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్ లోకి రావాలని రేవంత్ ఆహ్వానించారు. అంతేకాదు.. వివేక్, ఈటల, కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు క్షణికావేశంలో బీజేపీలో చేరారని, బీజేపీ సిద్దాంతంతో సంబంధంలేనివాళ్ళు కొందరు బీజేపీని నమ్మి ఆ పార్టీలో చేరారన్నారు.
సీఎం కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ చేయాలనుకునే వాళ్ళు కాంగ్రెస్లోకి రావాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తాను నాయకుడ్ని కాదని, సోనియా, ఖర్గేలే నాయకులన్నారు. తన వల్ల ఇబ్బంది అవుతుంది అనుకుంటే… ఒక మెట్టు కాదు పది మెట్లు దిగడానికి తాను సిద్ధమన్నారు. అయితే.. రేవంత్ మాట ఎలా ఉన్నా.. ఇప్పటికిప్పుడు ఈ ఉద్ధండ నేతలుగా పరిగణిస్తున్నవారు వస్తే.. కాంగ్రెస్ పార్టీకి ఒనగూరే ప్రయోజనం కన్నా.. అంతర్గత కుమ్ములాటలు మరింత పెరుగుతాయని అంటున్నారు పరిశీలకులు.
పైగా వారంతా కూడా అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పదవులు కోరుకుంటున్నారు. వీరిని ఆహ్వానించడం ద్వారాకాంగ్రెస్లో ఉన్న మెజారిటీ పాత నాయకులు వ్యతిరేకంగా స్పందించే అవకాశం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికే ఉన్నవారు పదవుల కోసం తన్నుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో వారిని ఆహ్వానించడం ద్వారా కొత్త కుంపట్లు కొని తెచ్చుకున్నట్టే అవుతుందని అంటున్నారు.
This post was last modified on May 19, 2023 8:41 am
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…