ఏ స్టార్ హీరో లేనంత బిజీగా వరస సినిమాలతో తలమునకలై ఉన్న ప్రభాస్ ఇంకా అనౌన్స్ చేయనివి, గతంలో కమిట్ మెంట్స్ ఇచ్చినవి కొన్నున్నాయి. అందులో మైత్రి మూవీ మేకర్స్ ప్యాన్ ఇండియా మూవీ ప్రధానమైంది. మొన్న ఏడాదే పఠాన్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ కాంబినేషన్ లో ఇది ప్లాన్ చేసుకున్నారు. ఆ మేరకు 75 కోట్ల పారితోషికం మాట్లాడుకుని అడ్వాన్స్ కూడా ఇచ్చారట. అయితే అతను వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కాబోతున్న ఫైటర్ తాలూకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేయాలి. హెవీ బడ్జెట్ మూవీ కావడంతో నెలల తరబడి సమయం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది .
ఇదంతా ఒక ఎత్తయితే టైగర్ వర్సస్ పఠాన్ స్క్రిప్ట్ ఏడాది పైగానే టైం డిమాండ్ చేస్తోంది. ఇది 2024లో ప్రారంభించి ఆపై ఏడాది విడుదల ప్లాన్ చేసుకోవాలి. అంటే ప్రభాస్ తో చేయాలని సిద్దార్థ్ ఆనంద్ కున్నా కనీసం కథ కూడా రెడీ చేయలేని పరిస్థితి నెలకొంది. అందుకే వార్ 2 చేతులారా అయాన్ ముఖర్జీకి వదులుకోవాల్సి వచ్చింది. ఈ కారణంగానే అడ్వాన్స్ ని సిద్దార్థ్ మైత్రి నిర్మాతలకు వెనక్కు ఇచ్చేసినట్టు ముంబై టాక్. భవిష్యత్తులో మళ్ళీ కాంబినేషన్ సెట్ చేసుకునేలా ఓ మాట అనుకుని డ్రాప్ అయ్యారట. మొత్తానికి క్రేజీ కాంబో అలా మిస్ అవుతోంది
ఒకపక్క పుష్ప 2 షూటింగ్ ఒత్తిడి, ఖుషి తాలూకు వ్యవహారాలు, ఇటీవలే జరిగిన ఐడి దాడుల తాలూకు తలనెప్పులు ఇలా నవీన్ రవిశంకర్ ల మీదున్న ప్రెజర్ అంతా ఇంతా కాదు. ఈ కారణంగానే గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్న వీరసింహారెడ్డి శతదినోత్సవాన్ని రద్దు చేసుకున్నారు. మళ్ళీ చేస్తారో లేదో తెలియదు. ఒకవేళ మళ్ళీ అనుకున్నా వాల్తేరు వీరయ్యకు కూడా చేయాల్సి ఉంటుంది. సో దాదాపు రెండూ డ్రాపే. ఇక ప్రభాస్ ఆది పురుష్ ప్రమోషన్లు స్టార్ట్ చేయబోతున్నాడు. సలార్ బాలన్స్ జూన్ ఆఖరులో స్టార్ట్ అవుతుంది. ప్రాజెక్ట్ కె, మారుతీ మూవీ సమాంతరంగా జరుగుతాయి
This post was last modified on May 7, 2023 6:59 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…