దేశ మొదటి పౌరుడిగా వ్యవహరించే రాష్ట్రపతి పాల్గొనే ప్రోగ్రాం అంటే అందుకు తీసుకునే చర్యలు ఎంత భారీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది.. రాష్ట్రపతి పాల్గొన్న సమావేశంలో కరెంటు పోవటమే ఒక సంచలనం అయితే.. కరెంటుపోయిన తర్వాత తిరిగి వచ్చేందుకు ఏకంగా 9 నిమిషాల పాటు కరెంటు లేక చీకట్లలో ఉండిపోయిన వైనం షాకింగ్ గా మారింది. ఒడిశాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం తెలిస్తే.. నోట మాట రాదంతే.
దేశంలో అత్యుత్తమ స్థానంలో ఉండే రాష్ట్రపతి పాల్గొనే ప్రోగ్రాం అంటే ముందస్తు జాగ్రత్తలు ఒక రేంజ్ లో ఉంటాయి. అలాంటిది కరెంటు పోయి.. తొమ్మిది నిమిషాల పాటురాకపోవటం.. ఆమె పాల్గొన్న ఆవరణ మొత్తం చీకట్లు అలుముకోవటం.. అయినప్పటికీ తన ప్రసంగాన్ని ఆపేయకుండా ఆమె కొనసాగించిన తీరు ఒక ఎత్తు అయితే.. ఈ సందర్భానికి తగినట్లుగా ఆమె చేసిన వ్యాఖ్యలు అందరిని ఆకర్షిస్తున్నాయి.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాలోని బరిపద లోని రామచంద్ర భంజదేవ్ వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఆమె ప్రసంగిస్తున్న వేళ కరెంటు పోయింది. కరెంటు పోతే.. దాని స్థానంలో జనరేటర్ ఉంచినా.. ప్రయోజనం లేకుండాపోయింది. జనరేటర్ పని చేయకపోవటం.. కరెంటు లేకపోవటం కారణంగా ఆమె స్పీచ్ ఇస్తున్న ఆడిటోరియంలో చీకట్లు చిమ్ముకున్నాయి.
అయినప్పటికీ రాష్ట్రపతి తన స్పీచ్ ఆపలేదు. చీకటి వెలుగులను సమానంగా చూడాలన్న విషయాన్ని తాజా ఘటన నుంచి నేర్చుకోవాలంటూ ఓర్పుగా చెప్పిన ఆమె మాటలు ఆసక్తికరంగా మారాయి. ఆ సమయంలోనూ ఎలాంటి చిరాకును ప్రదర్శించని ఆమె.. చిరునవ్వుతోనే తన ప్రసంగాన్నికంటిన్యూ చేశారు. రాష్ట్రపతి పాల్గొన్న కార్యక్రమంలో తొమ్మిది నిమిషాలు పాటు కరెంటు పోవటం.. ఆ సందర్భంలో అసహనానికి గురి కాకుండా వ్యవహరించటం.. కమ్ముకున్న చీకట్ల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాన్ని విద్యార్థులకు తన చేతల్లో చూపించిన రాష్ట్రపతి మాటలకు ఫిదా కావాల్సిందే. అదే సమయంలో.. బ్యాకప్ ప్లాన్ లేని అధికారులపై కఠిన చర్యలు తప్పనిసరి.
This post was last modified on May 7, 2023 12:01 pm
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…