ఈ ఏడాది జనవరి 26న రిలీజైన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ సినిమా పఠాన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రకంపనలు రేపిందో తెలిసిందే. హిందీ సినిమాలకు కొవిడ్ తర్వాత వంద కోట్ల వసూళ్లు కూడా చాలా కష్టమైపోతున్న సమయంలో పఠాన్ మాత్రం ఏకంగా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో ఔరా అనిపించింది.
ఇలాంటి మెగా హిట్ తర్వాత షారుఖ్ నటిస్తున్న సినిమా కావడం, పైగా సౌత్ ఇండియన్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తుండటంతో జవాన్ మూవీ మీద భారీ అంచనాలే ఉన్నాయి. కమర్షియల్ సినిమాలు తీయడంలో నిపుణుడైన దర్శకుడితో షారుఖ్ జత కడితే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం ఉంటుందో అంచనా వేయొచ్చు. ఆ విధ్వంసాన్ని జూన్ 2నే చూడొచ్చని ఆశపడ్డారు అభిమానులు. కానీ ఆ డేట్కి సినమా రావడం లేదు.
షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడంతో జవాన్ సినిమాను వాయిదా వేశారు. కొత్త డేట్ కోసం అందరూ ఎదురు చూస్తుండగా.. ఆ కబురు ఈ రోజు చెప్పేశారు. ముందు అనుకున్న దాని కంటే 3 నెలలు ఆలస్యంగా సెప్టెంబరు 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్తో ఈ విషయాన్ని వెల్లడించారు.
సెప్టెంబరు 28న సలార్ లాంటి భారీ చిత్రం విడుదల కానుండగా.. అంతకు మూడు వారాల ముందే షారుఖ్ తన సినిమాను థియేటర్లలో దించలేకపోతున్నాడు. ఈ సినిమాకు మంచి టాక్ వస్తే మూడు వారాలు చాలు వసూళ్ల మోత మోగించుకోవడానికి. జవాన్ మూవీలో షారుఖ్ సరసన నయనతార కథానాయికగా నటిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రంతోనే సంగీత దర్శకుడిగా బాలీవుడ్లోకి అడుగు పెడుతున్నాడు. ఈ చిత్రాన్ని షారుఖ్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…