ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు రిలీజవ్వడానికి కొన్ని నెలల ముందు నుంచే చిరంజీవి, బాలకృష్ణ అభిమానుల మధ్య చిచ్చు రేగిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాల్లో దేనిది ఆధిపత్యం అనే విషయంలో సోషల్ మీడియా వేదికగా నెలల తరబడి కొట్టుకున్నారు. ఇక రిలీజ్ తర్వాత అయితే ఆ వార్ పీక్స్కు చేరింది.
చివరికి చూస్తే వసూళ్ల పరంగా ‘వీరసింహారెడ్డి’ మీద ‘వాల్తేరు వీరయ్య’ స్పష్టమైన పైచేయి సాధించింది. ఆ సమయంలో చిరు అభిమానులు కాలర్ ఎగరేస్తే.. బాలయ్య ఫ్యాన్స్ కొంచెం వెనక్కి తగ్గారు. ఐతే ఆ గొడవ ఎప్పుడో సద్దుమణిగిందిలే అనుకుంటే.. ఇప్పుడు మళ్లీ కొత్త రచ్చ మొదలవడం చర్చనీయాంశం అయింది. ‘వీరసింహారెడ్డి’ వంద రోజుల ప్రదర్శన పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ సిటీలో వెలసిన పోస్టర్లు ఈ రచ్చకు కారణం అయ్యాయి. ఈ పోస్టర్ మీద ‘100 డేస్ విత్ సింగిల్ హ్యాండ్’ అని వేయడం దుమారం రేపింది.
‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో చిరంజీవే లీడ్ హీరో అయినా.. రవితేజ ముఖ్య పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో దాన్ని మల్టీస్టారర్గా పేర్కొంటూ.. ఆ సక్సెస్ క్రెడిట్ను రవితేజకు కూడా షేర్ చేస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్. చిరు.. రవితేజ సపోర్ట్తోనే బిగ్ హిట్ కొట్టాడని.. కానీ బాలయ్య సోలోగా ‘వీరసింహారెడ్డి’ని సక్సెస్ చేశాడని.. అందుకే ఆయనే గ్రేట్ అనే రకంగా ఫీలవుతున్నారు.
ఈ ఉద్దేశంతోనే ఇలా పోస్టర్లు వేశారు. ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలను నిర్మించింది ఒకే నిర్మాణ సంస్థ.. మైత్రీ మూవీ మేకర్స్. వాళ్లు రిలీజ్ టైంలో ఈ గొడవలు తగ్గించేందుకు చేయాల్సిందంతా చేశారు. అయినా ఫ్యాన్స్ తగ్గలేదు. ఇప్పుడు మైత్రీ వారు ఇన్కమ్ ట్యాక్స్ గొడవల్లో ఉండగా.. బాలయ్య అభిమానులే చొరవ తీసుకుని ఇలా పోస్టర్లు వేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ పోస్టర్లను సిటీలో చిరు ఫ్యాన్స్ అక్కడక్కడా చించి పడేస్తుండటం గమనార్హం.
This post was last modified on April 19, 2023 5:59 pm
2026 వేసవి వృథా అయిపోతోందని బయ్యర్ వర్గాలు తెగ ఆందోళన చెందుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా యునానిమస్ బ్లాక్…
ఏడాదికి ఒక సినిమా విడుదల చేయడమే మహా కష్టమైపోతున్న ట్రెండ్ లో కేవలం వారం గ్యాప్ లో రెండు రిలీజులు…
టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు పలు జాగ్రత్తలు చెప్పారు. వైసీపీని గొడ్డలి పార్టీగా అభివర్ణించిన ఆయన..…
ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లోనే విధులు నిర్వర్తించిన సీనియర్ పోలీసు అధికారి సీవీ…
కేరళ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ కలిసి నటించడం అంటే కేవలం మలయాళ అభిమానులకే కాదు…
కండల వీరుడు సల్మాన్ ఖాన్, దర్శకుడు వంశీ పైడిపల్లి కలయికలో నిర్మాత దిల్ రాజు తీస్తున్న భారీ చిత్రం ఇటీవలే…