ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు రిలీజవ్వడానికి కొన్ని నెలల ముందు నుంచే చిరంజీవి, బాలకృష్ణ అభిమానుల మధ్య చిచ్చు రేగిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాల్లో దేనిది ఆధిపత్యం అనే విషయంలో సోషల్ మీడియా వేదికగా నెలల తరబడి కొట్టుకున్నారు. ఇక రిలీజ్ తర్వాత అయితే ఆ వార్ పీక్స్కు చేరింది.
చివరికి చూస్తే వసూళ్ల పరంగా ‘వీరసింహారెడ్డి’ మీద ‘వాల్తేరు వీరయ్య’ స్పష్టమైన పైచేయి సాధించింది. ఆ సమయంలో చిరు అభిమానులు కాలర్ ఎగరేస్తే.. బాలయ్య ఫ్యాన్స్ కొంచెం వెనక్కి తగ్గారు. ఐతే ఆ గొడవ ఎప్పుడో సద్దుమణిగిందిలే అనుకుంటే.. ఇప్పుడు మళ్లీ కొత్త రచ్చ మొదలవడం చర్చనీయాంశం అయింది. ‘వీరసింహారెడ్డి’ వంద రోజుల ప్రదర్శన పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ సిటీలో వెలసిన పోస్టర్లు ఈ రచ్చకు కారణం అయ్యాయి. ఈ పోస్టర్ మీద ‘100 డేస్ విత్ సింగిల్ హ్యాండ్’ అని వేయడం దుమారం రేపింది.
‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో చిరంజీవే లీడ్ హీరో అయినా.. రవితేజ ముఖ్య పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో దాన్ని మల్టీస్టారర్గా పేర్కొంటూ.. ఆ సక్సెస్ క్రెడిట్ను రవితేజకు కూడా షేర్ చేస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్. చిరు.. రవితేజ సపోర్ట్తోనే బిగ్ హిట్ కొట్టాడని.. కానీ బాలయ్య సోలోగా ‘వీరసింహారెడ్డి’ని సక్సెస్ చేశాడని.. అందుకే ఆయనే గ్రేట్ అనే రకంగా ఫీలవుతున్నారు.
ఈ ఉద్దేశంతోనే ఇలా పోస్టర్లు వేశారు. ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలను నిర్మించింది ఒకే నిర్మాణ సంస్థ.. మైత్రీ మూవీ మేకర్స్. వాళ్లు రిలీజ్ టైంలో ఈ గొడవలు తగ్గించేందుకు చేయాల్సిందంతా చేశారు. అయినా ఫ్యాన్స్ తగ్గలేదు. ఇప్పుడు మైత్రీ వారు ఇన్కమ్ ట్యాక్స్ గొడవల్లో ఉండగా.. బాలయ్య అభిమానులే చొరవ తీసుకుని ఇలా పోస్టర్లు వేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ పోస్టర్లను సిటీలో చిరు ఫ్యాన్స్ అక్కడక్కడా చించి పడేస్తుండటం గమనార్హం.
This post was last modified on April 19, 2023 5:59 pm
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…