వెండి తెర మీద వర్షం పాటలుచూస్తున్నప్పుడు కలిగే కిక్కు అంతా ఇంతా అన్నట్లు ఉంది. చూసే వారికి బాగానే ఉన్నా.. దాన్ని రియల్ గా చేసే వారికి ఉండే కష్టాలు అన్ని ఇన్ని కావు. అందునా రొమాంటిక్ మూడ్ లో సాగే.. వర్షం పాటను పూర్తిచేసే వేళలో హీరోయిన్స్ కు ఎదురయ్యే ఇబ్బందులు అన్నిఇన్ని కావు. తాజాగా అవెంత కష్టంగా ఉంటాయన్న విషయాన్ని సీనియర్ నటి శోభన తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా వెల్లడించారు.
నాగార్జున మొదటి సినిమా ‘విక్రమ్’.. శోభన తెలుగు తెరకు పరిచయమైంది. అప్పటి అగ్రహీరోలతో వరుస పెట్టి సినిమాలుచేసిన ఆమె.. తమిళ.. మలయాళ..హిందీ సినిమాల్లోనూ తన ముద్రను వేసింది. నటిగానే కాదు.. క్లాసికల్ డ్యాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన సినిమా కెరీర్ కు సంబంధించిన ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. ఈ సందర్భంగా సినిమా కష్టాలు ఎంతలా ఉంటాయో చెప్పిన తీరు చదివాక.. ఆశ్చర్యపోవాల్సిందే.
రజనీకాంత్ తో తాను శివ.. దళపతి సినిమాల్ని చేశానని.. శివ మూవీ షూట్ లో తనకు ఎదురైన ఒక అనుభవాన్ని చెప్పుకొచ్చారు. “ఆ రోజు షూట్ లో వర్షం పాటను షూట్ చేయటానికి సెట్ వేశారు. నాకు తప్పించి అందరికి ఆ విషయం తెలుసు. శరీరం కనిపించేలా ఉన్న ఒక తెల్ల చీరను ఇచ్చి కట్టుకోమన్నారు. చీర చూస్తే చాలా పల్చగా ఉంది. లోపల ఏదైనా వేసుకోవటానికి వీలుగా ఇంటికి వెళ్లి వస్తానని చెప్పా. ఇంటికి వెళ్లి వచ్చేంత టైం లేదు. దీంతో ఏంచేయాలో తోచలేదు. షూట్ కు రమ్మంటున్నారు. దీంతో.. ఏం చేయాలో తోచక.. అక్కడే ఉన్న ఒక టేబుల్ కవర్ ను ఒంటికి చుట్టుకొని దాని మీద చీర కట్టుకొని షూట్ కు రెఢీ అయ్యా” అని తనకు ఎదురైన ఒక అనుభవాన్ని చెప్పుకొచ్చారు. ఆ రోజు తాను ప్లాస్టిక్ షీట్ కట్టుకొని షూట్ కు వెళ్లానన్న విషయం ఎవరికీ తెలీదన్నారు.
ఆ పాటను షూట్ చేస్తున్న వేళలో.. డ్యాన్స్ చేస్తున్నప్పుడు కవర్ శబ్ధంతో రజనీకాంత్ బాగా ఇబ్బంది పడ్డారని ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వాన పాటల్లో హీరోయిన్లు నటించటం ఎంత కష్టమైన విషయమో చెబుతూ.. ‘వాన పాటలు చేయటం అంటే.. హీరోయిన్ ను మర్డర్ చేసినట్లే’ అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించటం గమనార్హం. సినిమాల తర్వాత కళార్పణ అనే సంస్థను ఏర్పాటు చేసిన శోభన.. పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. దాదాపుగా పన్నెండేళ్ల క్రితం ఒక పాపను దత్తత తీసుకొన్నారు.
This post was last modified on April 16, 2023 9:42 am
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…
వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…