సమంత మీదే పూర్తి భారం !

గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన శాకుంతలం ఏప్రిల్ 14న థియేటర్స్ లోకి రాబోతుంది. మైథాలాజికల్ డ్రామాతో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పలు ప్రమోషన్స్ లో పాల్గొంటూ వచ్చింది సమంత. అనారోగ్యం నుండి కోలుకోవడంతో మీడియా ముందు కాస్త యాక్టివ్ గా కనిపించింది.

అయితే ఈ సినిమాకు రెండ్రోజుల ముందే స్పెషల్ ప్రీమియర్ వేశారు. చూసిన అందరూ సమంత నటన గురించి చెప్తున్నారు. శకుంతల దేవిగా సామ్ ఆకట్టుకుందని అంటున్నారు. అయితే ఈ సినిమాలో హీరో లేరు. దుష్యంత్ మహారాజ్ గా నటించిన మలయాళం హీరో దేవ్ మోహన్ తెలుగు ప్రేక్షకులకు తెలియదు. దీంతో శాకుంతలం కి ఓపెనింగ్స్ తెచ్చే భారమంతా సమంత పైనే పడింది.

ఓ బేబీ , యశోద సినిమాలతో సమంత మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. మూడు, నాలుగు రోజులు ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించి మంచి కలెక్షన్స్ అందుకుంది. ఆ అనాలసిస్ తోనే ఇప్పుడు గుణ శేఖర్, దిల్ రాజు ధీమాగా ఉన్నారు. ఏదేమైనా ఈ సినిమాకి ప్రేక్షకులను తీసుకొచ్చే మొత్తం భాద్యత సమంత మీదే ఉంది. మరి సమంతను నమ్ముకొని ఈ భారీ బడ్జెట్ 3d సినిమా తీసిన గుణ శేఖర్ కి ఎలాంటి రిజల్ట్ వస్తుందో ?