దక్షిణాది నుంచి బాలీవుడ్కు వెళ్లిన హీరోయిన్లు.. ఇక్కడి పరిశ్రమల గురించి తక్కువ చేసి మాట్లాడటం కొత్తేమీ కాదు. ఇలియానా, తాప్సి పన్ను లాంటి వాళ్లే ఇందుకు ఉదాహరణ. ఇక్కడ ఉన్నన్నాళ్లూ పారితోషకాల ఆశతో నో చెప్పకుండా అన్ని రకాల వేషాలూ ఒప్పుకుంటారు. తీరా బాలీవుడ్లో పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ పడితే.. టాలీవుడ్, కోలీవుడ్ తమ ప్రతిభను గుర్తించలేదని ఏడుస్తారు. అంతటితో ఆగకుండా ఇక్కడి హీరోలు అలాంటి వాళ్లు ఇలాంటి వాళ్లు అని కామెంట్లు చేయడమూ మామూలే.
తాజాగా ఇలియానా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. టాలీవుడ్లో నెపోటిజం ఛాయలు ఎక్కువ అన్న ఆమె.. ఇక్కడ అవకాశాల పేరుతో అమ్మాయిల్ని లోబరచుకోవడమూ ఎక్కువే అంది. తెలుగు పరిశ్రమలోని కొందరు అగ్ర హీరోలు, నిర్మాతలు.. హీరోయిన్ల నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకు అందరినీ కోరిక తీర్చమని.. లేకుంటే అవకాశాలు రావని అంటారని ఇలియానా కామెంట్ చేసినట్లుగా వార్తలు కనిపిస్తున్నాయి.
కొందరు అగ్ర హీరోలు సెక్స్ కావాలని నేరుగానే అడుగుతారని ఆమె అంది. ఓ కొత్త హీరోయిన్ తన దగ్గరికి వచ్చి.. అవకాశం కావాలంటే దర్శకుడు, హీరోతో పడుకోవాలట.. మరి ఏం చేయమంటారు అని తనను అడిగినట్లుగా ఇలియానా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఐతే తన వరకు అలాంటి సమస్యలు లేవని.. కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలిసి జాగ్రత్త పడ్డానని ఆమె అంది. ఈ విషయంలో ఏం చేయాలో నీదే నిర్ణయం అంటూ ఆ హీరోయిన్కు తాను చెప్పినట్లు ఇలియానా వెల్లడించింది.
బయటికి తెలిస్తే పరువు పోతుందని చాలామంది చెప్పట్లేదు కానీ.. అవకాశాల పేరుతో అగ్ర హీరోలు కూడా సెక్స్ కావాలని నేరుగా అడుగుతారని ఆమె అంది. మి టూ ఉద్యమంలో భాగంగా అత్యధిక ఆరోపణలు వచ్చిన బాలీవుడ్ గురించి ఏమీ మాట్లాడకుండా ఇలియానా టాలీవుడ్ మీద ఇలా ఆరోపణలు చేయడం ఆశ్చర్యమే. పైగా టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇవ్వబోతోందని వార్తలొస్తున్న సమయంలో ఇదేంటో?
This post was last modified on August 2, 2020 9:54 am
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…