దక్షిణాది నుంచి బాలీవుడ్కు వెళ్లిన హీరోయిన్లు.. ఇక్కడి పరిశ్రమల గురించి తక్కువ చేసి మాట్లాడటం కొత్తేమీ కాదు. ఇలియానా, తాప్సి పన్ను లాంటి వాళ్లే ఇందుకు ఉదాహరణ. ఇక్కడ ఉన్నన్నాళ్లూ పారితోషకాల ఆశతో నో చెప్పకుండా అన్ని రకాల వేషాలూ ఒప్పుకుంటారు. తీరా బాలీవుడ్లో పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ పడితే.. టాలీవుడ్, కోలీవుడ్ తమ ప్రతిభను గుర్తించలేదని ఏడుస్తారు. అంతటితో ఆగకుండా ఇక్కడి హీరోలు అలాంటి వాళ్లు ఇలాంటి వాళ్లు అని కామెంట్లు చేయడమూ మామూలే.
తాజాగా ఇలియానా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. టాలీవుడ్లో నెపోటిజం ఛాయలు ఎక్కువ అన్న ఆమె.. ఇక్కడ అవకాశాల పేరుతో అమ్మాయిల్ని లోబరచుకోవడమూ ఎక్కువే అంది. తెలుగు పరిశ్రమలోని కొందరు అగ్ర హీరోలు, నిర్మాతలు.. హీరోయిన్ల నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకు అందరినీ కోరిక తీర్చమని.. లేకుంటే అవకాశాలు రావని అంటారని ఇలియానా కామెంట్ చేసినట్లుగా వార్తలు కనిపిస్తున్నాయి.
కొందరు అగ్ర హీరోలు సెక్స్ కావాలని నేరుగానే అడుగుతారని ఆమె అంది. ఓ కొత్త హీరోయిన్ తన దగ్గరికి వచ్చి.. అవకాశం కావాలంటే దర్శకుడు, హీరోతో పడుకోవాలట.. మరి ఏం చేయమంటారు అని తనను అడిగినట్లుగా ఇలియానా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఐతే తన వరకు అలాంటి సమస్యలు లేవని.. కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలిసి జాగ్రత్త పడ్డానని ఆమె అంది. ఈ విషయంలో ఏం చేయాలో నీదే నిర్ణయం అంటూ ఆ హీరోయిన్కు తాను చెప్పినట్లు ఇలియానా వెల్లడించింది.
బయటికి తెలిస్తే పరువు పోతుందని చాలామంది చెప్పట్లేదు కానీ.. అవకాశాల పేరుతో అగ్ర హీరోలు కూడా సెక్స్ కావాలని నేరుగా అడుగుతారని ఆమె అంది. మి టూ ఉద్యమంలో భాగంగా అత్యధిక ఆరోపణలు వచ్చిన బాలీవుడ్ గురించి ఏమీ మాట్లాడకుండా ఇలియానా టాలీవుడ్ మీద ఇలా ఆరోపణలు చేయడం ఆశ్చర్యమే. పైగా టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇవ్వబోతోందని వార్తలొస్తున్న సమయంలో ఇదేంటో?
This post was last modified on August 2, 2020 9:54 am
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…