దక్షిణాది నుంచి బాలీవుడ్కు వెళ్లిన హీరోయిన్లు.. ఇక్కడి పరిశ్రమల గురించి తక్కువ చేసి మాట్లాడటం కొత్తేమీ కాదు. ఇలియానా, తాప్సి పన్ను లాంటి వాళ్లే ఇందుకు ఉదాహరణ. ఇక్కడ ఉన్నన్నాళ్లూ పారితోషకాల ఆశతో నో చెప్పకుండా అన్ని రకాల వేషాలూ ఒప్పుకుంటారు. తీరా బాలీవుడ్లో పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ పడితే.. టాలీవుడ్, కోలీవుడ్ తమ ప్రతిభను గుర్తించలేదని ఏడుస్తారు. అంతటితో ఆగకుండా ఇక్కడి హీరోలు అలాంటి వాళ్లు ఇలాంటి వాళ్లు అని కామెంట్లు చేయడమూ మామూలే.
తాజాగా ఇలియానా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. టాలీవుడ్లో నెపోటిజం ఛాయలు ఎక్కువ అన్న ఆమె.. ఇక్కడ అవకాశాల పేరుతో అమ్మాయిల్ని లోబరచుకోవడమూ ఎక్కువే అంది. తెలుగు పరిశ్రమలోని కొందరు అగ్ర హీరోలు, నిర్మాతలు.. హీరోయిన్ల నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకు అందరినీ కోరిక తీర్చమని.. లేకుంటే అవకాశాలు రావని అంటారని ఇలియానా కామెంట్ చేసినట్లుగా వార్తలు కనిపిస్తున్నాయి.
కొందరు అగ్ర హీరోలు సెక్స్ కావాలని నేరుగానే అడుగుతారని ఆమె అంది. ఓ కొత్త హీరోయిన్ తన దగ్గరికి వచ్చి.. అవకాశం కావాలంటే దర్శకుడు, హీరోతో పడుకోవాలట.. మరి ఏం చేయమంటారు అని తనను అడిగినట్లుగా ఇలియానా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఐతే తన వరకు అలాంటి సమస్యలు లేవని.. కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలిసి జాగ్రత్త పడ్డానని ఆమె అంది. ఈ విషయంలో ఏం చేయాలో నీదే నిర్ణయం అంటూ ఆ హీరోయిన్కు తాను చెప్పినట్లు ఇలియానా వెల్లడించింది.
బయటికి తెలిస్తే పరువు పోతుందని చాలామంది చెప్పట్లేదు కానీ.. అవకాశాల పేరుతో అగ్ర హీరోలు కూడా సెక్స్ కావాలని నేరుగా అడుగుతారని ఆమె అంది. మి టూ ఉద్యమంలో భాగంగా అత్యధిక ఆరోపణలు వచ్చిన బాలీవుడ్ గురించి ఏమీ మాట్లాడకుండా ఇలియానా టాలీవుడ్ మీద ఇలా ఆరోపణలు చేయడం ఆశ్చర్యమే. పైగా టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇవ్వబోతోందని వార్తలొస్తున్న సమయంలో ఇదేంటో?
This post was last modified on August 2, 2020 9:54 am
సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు ఎంతకు తెగిస్తున్నారన్న దానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనమని చెప్పక తప్పదు. జనసేన అధినేత, ఏపీ…
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు శుక్రవారం ఊహించని షాక్ తగిలింది. పోలీసుల అదుపులోని నిందితుడిపై…
దక్షిణాదిలో కీలక రాష్ట్రంగా కొనసాగుతున్న తమిళనాడులో శుక్రవారం రాజకీయంగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో విపక్ష పార్టీగా ఉన్న…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి శుక్రవారంతో 10 మాసాలు గడిచాయి. గత ఏడాది జూన్ 12న ఏపీలో కూటమి సర్కారుకొలువు…
హర్యానా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ రెజ్లర్, ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి రాప్తాడు పర్యటనపై సాగుతున్న మాటల యుద్ధంలో తాజాగా ఆ పార్టీ…