దిల్ రాజు క‌ల‌ల ప్రాజెక్టు.. జటాయు

నైజాం ఏరియాలో చిన్న‌ డిస్ట్రిబ్యూట‌ర్‌గా ప్ర‌యాణం మొద‌లుపెట్టి ఇప్పుడు టాలీవుడ్లోనే నంబ‌ర్ వ‌న్ నిర్మాత‌గా ఎదిగారు దిల్ రాజు. ప్ర‌స్తుతం కొత్త ఏడాదిలో నిర్మాత‌గా వారిసు, బ‌ల‌గం లాంటి విజ‌యాల‌కు తోడు డిస్ట్రిబ్యూట‌ర్‌గా కూడా వ‌రుస స‌క్సెస్‌లు అందుకుంటున్న రాజు.. ప‌రిశ్ర‌మ‌లో నిర్మాత‌గా 20 ఏళ్ల ప్ర‌స్థానాన్ని పూర్తి చేసుకోవ‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తొలిసారిగా ట్విట్ట‌ర్లో అభిమానుల‌తో చిట్ చాట్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా త‌న క‌ల‌ల ప్రాజెక్టు గురించి అడిగిన ప్ర‌శ్న‌కు రాజు ఇచ్చిన స‌మాధానం అభిమానుల‌ను ఎగ్జైట్ చేసింది. జటాయు పేరుతో ఒక మెగా సినిమా తీయ‌బోతున్నాన‌ని.. అందులో టాప్ టెక్నీషియ‌న్లు, ఎగ్జైటింగ్ స్టార్ కాస్ట్ ప‌ని చేస్తార‌ని రాజు తెలిపాడు. అంత‌కుమించి ఈ ప్రాజెక్టు గురించి ఆయ‌న వివ‌రాలు వెల్ల‌డించ‌లేదు.

ఒక ప్ర‌శ్న‌కు స‌మాధానంగా తాను ఇప్ప‌టిదాకా తీసిన సినిమాల్లో 70 శాతం విజ‌య‌వంతం అయ్యాయ‌ని.. భ‌విష్య‌త్తులో స‌క్సెస్ ప‌ర్సంటేజ్ ఇంకా పెంచాల‌ని చూస్తున్నాన‌ని రాజు తెలిపాడు. చిరంజీవి, ర‌వితేజ‌ల‌తో సినిమాల గురించి నెటిజ‌న్లు అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తూ.. పూన‌కాలు లోడింగ్ అని, వారితో వేర్వేరుగా సినిమాలు ఉంటాయిన రాజు తెలిపాడు.

మ‌హేష్ బాబుతో ఒక స్పెష‌ల్ మూవీ తీసే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్లు కూడా రాజు వెల్ల‌డించాడు. త‌మిళంలో వారిసు త‌ర్వాత మ‌రో సినిమాకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని.. విజ‌య్‌తో కూడా ఇంకో సినిమా ఉండొచ్చ‌ని రాజు తెలిపాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తోనూ మ‌రో సినిమా చేయాల‌ని చూస్తున్న‌ట్లు చెప్పిన రాజు.. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌తోనూ ఓ సినిమా చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలిపాడు. స‌మంత కెరీర్లో శాకుంత‌లం చాలా స్పెష‌ల్ మూవీ అవుతుంద‌ని.. ఇదొక క్లాసీమూవీ అని రాజు పేర్కొన్నాడు.