ఆ డైరెక్టర్ తో శర్వా .. థ్రిల్లరేనా ?

హీరో శర్వానంద్ ప్రస్తుతం శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఓ స్టైలిష్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత శర్వా లైనప్ పెద్దగానే ఉంది. అందులో ముఖ్యంగా గుహన్ పేరు ఎక్కువగా వినబడుతుంది. సినిమాటోగ్రాఫర్ గుహన్ కళ్యాణ్ రామ్ ‘118’ సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ సినిమాను తక్కువ బడ్జెట్ తో థ్రిల్లర్ గా రూపొందించి దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. శివానీ రాజశేఖర్ తో WWW అనే ఓటీటీ సినిమా చేశాడు. ఆ తర్వాత ఆనంద్ దేవరకొండతో గుహన్ ‘హై వే’ అనే సినిమా చేశాడు అది కూడా ఓటీటీలో రిలీజైంది.

ఇక 118 తర్వాత ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ కథ రాసుకున్న గుహన్ ఆ కథను ఇప్పుడు శర్వాకి చెప్పి ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడని తెలుస్తుంది. ఈ కాంబో సినిమాను దిల్ రాజు నిర్మించే అవకాశం ఉంది. ఎప్పటి నుండో గుహన్ దిల్ రాజు బేనర్ లో ఓ సినిమా చేయాలని చూస్తున్నాడు. బహుశా అన్నీ కుదిరితే శర్వా , గుహన్ సినిమా దిల్ రాజు బేనర్ లోనే ఉంటుంది.

శర్వా హీరోగా డిఫరెంట్ మూవీస్ చేయాలని భావిస్తున్నాడు. ఒకే ఒక జీవితం తర్వాత కొత్త కథలు , చేయని జానర్స్ టచ్ చేయాలని చూస్తున్నాడు. అందులో భాగంగానే గుహన్ తో ఓ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు కావచ్చు. త్వరలోనే ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. మరి కళ్యాణ్ రామ్ కి థ్రిల్లర్ జోనర్ లో హిట్ ఇచ్చిన ఈ సినిమాటోగ్రాఫర్ కం డైరెక్టర్ ఇప్పుడు శర్వానంద్ కి ఎలాంటి హిట్ ఇస్తాడో ?