ప‌దేళ్ల‌కు పిల్ల‌లు.. చ‌ర‌ణ్‌, ఉపాస‌న ముందే ఫిక్స్

Ram Charan & Upasana

ప‌దేళ్ల కింద‌ట పెళ్లి చేసుకున్న రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న జంట.. ఎంత‌కీ త‌ల్లిదండ్రులు కాక‌పోవ‌డంపై సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చే జ‌రిగింది. దీని మీద ట్విట్ట‌ర్లో స్పేస్‌లు పెట్టి మ‌రీ చ‌ర్చించుకున్నారు జ‌నాలు. ఈ విష‌యం మీద చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌ల‌ను దారుణంగా ట్రోల్ చేసిన వాళ్లు కూడా ఉన్నారు. ఏదో స‌మ‌స్య ఉండ‌టం వ‌ల్ల ఈ జంట‌కు పిల్ల‌లు పుట్టే అవ‌కాశం లేద‌ని తేల్చేసిన వాళ్లూ లేక‌పోలేదు.

ఐతే ఈ ఊహాగానాల‌న్నింటికీ తెర‌దించుతూ గ‌త ఏడాది చ‌ర‌ణ్‌, ఉపాస‌న త‌ల్లిదండ్రులు కాబోతున్న విష‌యాన్ని వెల్ల‌డించారు. దీంతో అంద‌రి నోళ్ల‌కు తాళాలు ప‌డ్డాయి. ఐతే ఇంత ఆల‌స్యంగా బిడ్డ‌ను క‌నాల‌న్న నిర్ణ‌యం పెళ్లి స‌మ‌యంలోనే తీసుకున్నారట చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌. బ‌య‌టి వ్య‌క్తుల‌తో పాటు కుటుంబ స‌భ్యుల ఒత్తిడిని కూడా త‌ట్ట‌కుని తాము ప‌దేళ్ల పాటు పిల్ల‌ల్ని క‌న‌కుండా ఉన్న‌ట్లు ఉపాస‌న వెల్ల‌డించ‌డం విశేషం.

“స‌మాజం కోరుకున్న‌పుడు కాకుండా నేను త‌ల్లిని కావాల‌నుకున్న‌పుడు గ‌ర్భం దాల్చ‌డం ప‌ట్ల‌ నాకెంతో ఉత్సాహంగా, గ‌ర్వంగా ఉంది. పెళ్ల‌యిన ప‌దేళ్ల త‌ర్వాత మేం బిడ్డ‌ల‌ను కనాల‌ని అనుకున్నాం. ఎందుకంటే ఇదే సరైన స‌మ‌యం. మేమిద్ద‌రం మా రంగాల్లో ఎదిగాం. మాకు మేముగా ఆర్థికంగా బ‌లోపేతం అయ్యాం. మా పిల్ల‌ల‌కు కావాల్సిన‌వ‌న్నీ ఇచ్చే స్థాయికి చేరాం. ఆల‌స్యంగా పిల్ల‌ల్ని క‌న‌డం అన్న‌ది మా ఇద్ద‌రి నిర్ణ‌యం. ఈ విష‌యంలో అటు స‌మాజంతో పాటు ఇటు కుటుంబం, బంధువుల ఒత్తిడికి కూడా మేం త‌లొగ్గ‌లేదు. ఇది మా మధ్య బ‌ల‌మైన బంధంతో పాటు పిల్ల‌ల విష‌యంలో మాకున్న స్ప‌ష్ట‌త‌కు నిద‌ర్శ‌నం” అని ఉపాస‌న తెలిపింది. తాను పెళ్ల‌యిన కొత్త‌లో సోష‌ల్ మీడియా నుంచి ఎదుర్కొన్న బాడీ షేమింగ్ గురించి కూడా ఉపాస‌న ఇప్ప‌టికే ఓపెన్ అయిన సంగ‌తి తెలిసిందే.