ఇండస్ట్రీకి ఎప్పుడో వచ్చి సినిమాలు తీస్తున్నా రిషబ్ శెట్టి అనే పేరు మ్రోగిపోయింది మాత్రం కాంతారతోనే. ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం పదహారు కోట్ల బడ్జెట్ తో రూపొంది ప్రపంచవ్యాప్తంగా మూడు వందల కోట్ల దాకా వసూలు చేయడం ఎప్పటికి మర్చిపోలేని సంచలనం. కర్ణాటకలో కెజిఎఫ్ ని మించిన థియేటర్ ఫుట్ ఫాల్స్ దీనికే వచ్చాయంటే నమ్మశక్యం కాదేమో అనిపిస్తుంది కానీ ఇది నిజం. అందుకే రిషబ్ శెట్టి ఫేమ్ బాలీవుడ్ దాకా వెళ్ళిపోయి అక్కడి సెలబ్రిటీలతో పాటు కూర్చుని నేషనల్ ఇంటర్వ్యూలలో పాల్గొనే అవకాశం దక్కింది.
ఇదంతా బాగానే ఉంది కానీ రిషబ్ రాజకీయ ప్రవేశం గురించి కొన్నాళ్లుగా బెంగళూరు మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఏదో పార్టీకి మద్దతుగా ఉన్నాడని అందుకే ఢిల్లీ వెళ్ళినప్పుడు పలువురిని కలిశాడని ఇలా ఏవేవో ప్రచారాలు జరిగాయి. ఫ్యాన్స్ నిజమనే అనుకున్నారు. కానీ ఇతను మాత్రం అవన్నీ కొట్టి పారేస్తున్నాడు. ప్రస్తుతం తన ధ్యాస సినిమాల మీద తప్ప దేని మీద లేదని కుండబద్దలు కొట్టేస్తున్నాడు. ఒక జర్నలిస్ట్ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా టికెట్లు కొని మంచి చిత్రాలను ఆదరించడం తప్ప ఇంకేం కోరుకోవడం లేదని తేల్చేశాడు.
సో ప్రచారమంతా ఉత్తుత్తిదే. రిషబ్ ప్రస్తుతం కాంతారకు ప్రీక్వెల్ తీసే పనిలో ఉన్నాడు. అంటే అసలైన మొదటిభాగం కథ ఇప్పుడు చెప్పబోతున్నాడన్న మాట. ఇటీవలే లొకేషన్ల వేటతో పాటు స్క్రిప్ట్ తాలూకు పనులు శరవేగంగా జరుగుతున్నాయని టాక్. కెజిఎఫ్, బాహుబలి తరహాలోనే దీని మీద విపరీతమైన క్రేజ్ నెలకొంది. అంచనాలు మించేలా బడ్జెట్ కు సంబంధించి ఎలాంటి పరిమితులు పెట్టుకోకుండా హోంబాలే ఫిలింస్ ఈ ఏడాదిలోనే షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. తెలుగు తమిళ రంగాలకు సంబంధించిన పలువురు ప్రముఖ నటీనటులు ఇందులో భాగం కానున్నారు
This post was last modified on April 2, 2023 2:08 pm
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కేరళకు కూడా విస్తరించింది. తాజాగా ఆ పార్టీ విస్తరణపై…
చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు తమ సోషల్ మీడియా అకౌంట్లను సబ్స్క్రిప్షన్ మోడ్లోకి మార్చి, వాటి ద్వారా హాట్…
టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా…