ఇండస్ట్రీకి ఎప్పుడో వచ్చి సినిమాలు తీస్తున్నా రిషబ్ శెట్టి అనే పేరు మ్రోగిపోయింది మాత్రం కాంతారతోనే. ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం పదహారు కోట్ల బడ్జెట్ తో రూపొంది ప్రపంచవ్యాప్తంగా మూడు వందల కోట్ల దాకా వసూలు చేయడం ఎప్పటికి మర్చిపోలేని సంచలనం. కర్ణాటకలో కెజిఎఫ్ ని మించిన థియేటర్ ఫుట్ ఫాల్స్ దీనికే వచ్చాయంటే నమ్మశక్యం కాదేమో అనిపిస్తుంది కానీ ఇది నిజం. అందుకే రిషబ్ శెట్టి ఫేమ్ బాలీవుడ్ దాకా వెళ్ళిపోయి అక్కడి సెలబ్రిటీలతో పాటు కూర్చుని నేషనల్ ఇంటర్వ్యూలలో పాల్గొనే అవకాశం దక్కింది.
ఇదంతా బాగానే ఉంది కానీ రిషబ్ రాజకీయ ప్రవేశం గురించి కొన్నాళ్లుగా బెంగళూరు మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఏదో పార్టీకి మద్దతుగా ఉన్నాడని అందుకే ఢిల్లీ వెళ్ళినప్పుడు పలువురిని కలిశాడని ఇలా ఏవేవో ప్రచారాలు జరిగాయి. ఫ్యాన్స్ నిజమనే అనుకున్నారు. కానీ ఇతను మాత్రం అవన్నీ కొట్టి పారేస్తున్నాడు. ప్రస్తుతం తన ధ్యాస సినిమాల మీద తప్ప దేని మీద లేదని కుండబద్దలు కొట్టేస్తున్నాడు. ఒక జర్నలిస్ట్ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా టికెట్లు కొని మంచి చిత్రాలను ఆదరించడం తప్ప ఇంకేం కోరుకోవడం లేదని తేల్చేశాడు.
సో ప్రచారమంతా ఉత్తుత్తిదే. రిషబ్ ప్రస్తుతం కాంతారకు ప్రీక్వెల్ తీసే పనిలో ఉన్నాడు. అంటే అసలైన మొదటిభాగం కథ ఇప్పుడు చెప్పబోతున్నాడన్న మాట. ఇటీవలే లొకేషన్ల వేటతో పాటు స్క్రిప్ట్ తాలూకు పనులు శరవేగంగా జరుగుతున్నాయని టాక్. కెజిఎఫ్, బాహుబలి తరహాలోనే దీని మీద విపరీతమైన క్రేజ్ నెలకొంది. అంచనాలు మించేలా బడ్జెట్ కు సంబంధించి ఎలాంటి పరిమితులు పెట్టుకోకుండా హోంబాలే ఫిలింస్ ఈ ఏడాదిలోనే షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. తెలుగు తమిళ రంగాలకు సంబంధించిన పలువురు ప్రముఖ నటీనటులు ఇందులో భాగం కానున్నారు
This post was last modified on April 2, 2023 2:08 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…