తెలుగు సినిమాలు తీయడం ఎప్పుడో ఆపేసిన అగ్ర నిర్మాత ఏఎం రత్నం ఏ ముహూర్తంలో హరిహర వీరమల్లు మొదలుపెట్టారో కానీ అప్పటి నుంచి దీనికి పడుతున్న బ్రేకులు అన్నీ ఇన్ని కావు. కరోనా, లాక్ డౌన్, సెట్లు ప్రమాదానికి గురి కావడం, జనసేన వల్ల పవన్ వరసగా డేట్లు ఇవ్వలేకపోవడం ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే కర్ణుడి చావుకు వెయ్యి కారణాలన్నట్టుగా ఫైనల్ గా ఎప్పుడు ముగుస్తుందో అంతు చిక్కడం లేదు.
ఆ మధ్య బాలీవుడ్ సీనియర్ హీరో బాబీ డియోల్ వచ్చాక వేగం పెరుగుతుందేమో అనుకుంటే కీలకమైన ఎపిసోడ్లు షూట్ చేశాక మళ్ళీ ఆపారు. డెబ్భై శాతం పైగా పూర్తయ్యిందని ఇన్ సైడ్ టాక్ ఉంది కానీ దర్శకుడు క్రిష్ మాత్రమే దీనికి సంబంధించిన క్లారిటీ ఇవ్వగలరు. ఇక విడుదల తేదీకి సంబంధించిన సందిగ్దత మెల్లగా దారులు మూసుకునేలా వేస్తోంది. వేసవికి పవన్ సాయి ధరమ్ తేజ్ ల డేట్ ఇచ్చేశారు.
సో సమ్మర్ మిస్ అయినట్టే. ఇండిపెండెన్స్ డేని లక్ష్యంగా పెట్టుకుని ఆగస్ట్ 11 భోళా శంకర్ ని లాక్ చేశారు. పోనీ దసరా అనుకుందామా అంటే రామ్ బోయపాటి, టైగర్ నాగేశ్వరరావు, లియోలు కర్చీఫ్ వేసుకున్నాయి. వీరమల్లు లాంటి ప్యాన్ ఇండియాకి దీపావళి, డిసెంబర్ లు పెద్ద స్థాయిలో వర్కౌట్ కావు. నెక్స్ట్ ఉన్న ఆప్షన్ సంక్రాంతి ఒకటే. ఆల్రెడీ ప్రాజెక్ట్ కె, మహేష్ బాబు 28 రిజర్వ్ చేసుకున్నాయి.
ఇండియన్ 2 లేదా గేమ్ చేంజర్ వీటిలో ఒకటి పక్కా తోడవుతుంది. మరి వీరమల్లు రావాలంటే వీటిలో ఒకటి తప్పుకోవాలి. అదంత సులభం కాదు. ఒకవేళ అదీ వదిలేస్తే 2024 సమ్మర్ దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అసలు విడుదల విషయంలో టీమ్ ప్లానింగ్ ఏంటో అంతు చిక్కడం లేదు. పోస్ట్ ప్రొడక్షన్ పనులైతే జరుగుతున్నాయి కానీ ఫలానా టైం అని టార్గెట్ పెట్టుకోకపోవడం వల్ల సమస్య వస్తోంది. పవన్ మొదటి ప్యాన్ ఇండియా మూవీకి ఇన్ని ట్విస్టులైతే ఎవరూ ఊహించలేదు.
This post was last modified on March 29, 2023 10:20 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…