Movie News

రంగమార్తాండ లాభనష్టాల లెక్కలు

చాలా గ్యాప్ తర్వాత కృష్ణవంశీ సినిమా బాగుందని చూడొచ్చనే మాట వినిపించింది రంగమార్తాండ విషయంలోనే. సోషల్ మీడియాని వేదికగా చేసుకుని టీమ్ చేసిన విస్తృత ప్రమోషన్లు ఓపెనింగ్స్ విషయంలో బాగానే పనికొచ్చాయి. అయితే థియేటర్ల దగ్గర జనాల సందడి మరీ ఎక్కువ లేకపోవడం కొంత ఆందోళన కలిగించినా స్టార్ క్యాస్టింగ్ లేని ఇలాంటి ఎమోషనల్ డ్రామాకు కుటుంబాలు ఈ మాత్రం కదిలి రావడం పాజిటివ్ కోణంలోనే చూడాలి. ఆదివారం రాత్రి వరకు ఈ చిత్రానికి రన్ అయ్యే షోలు చాలా కీలకంగా మారనున్నాయి. వీలైనంత రాబట్టుకుని గట్టెక్కాలి.

ఇక లెక్కల సంగతికొస్తే రంగమార్తాండను సుమారు రెండున్నర కోట్ల దాక బిజినెస్ చేశారట. మూడు రోజులకు గాను కోటి పది లక్షల దాకా షేర్ వచ్చింది. ఇంకో కోటి యాభై లక్షలు పెద్ద మొత్తం కాకపోయినా ఆక్యుపెన్సీలు పెరగాల్సిన అవసరం చాలా ఉంది. కాసేపు ఇది పక్కన పెడితే ప్రొడక్షన్ వరకు ఎనిమిది కోట్లకు పైగానే ఖర్చయ్యిందట. ఓటిటి హక్కులకు అమెజాన్ ప్రైమ్ ఆరు కోట్ల దాకా చెల్లించిందని ఇన్ సైడ్ టాక్. మైత్రి డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నందుకుగాను మరో రెండు కోట్లు ముట్టాయి. సో పెట్టుబడి కోణంలో చూస్తే నష్టమేమీ రాలేదు. థియేటర్ రెవిన్యూ లాభనష్టాలు తేలాల్సి ఉంది.

మొత్తానికి చిన్న సినిమా ఈ మాత్రం స్పందన తెచ్చుకోవడం అనూహ్యమే. విపరీతమైన బడ్జెట్ పరిమితులతో పాటు మూడేళ్ళ పాటు జరిగిన నిర్మాణం రంగమార్తాండ మీద ఆర్థిక భారాన్ని పెంచుకుంటూ పోయింది. ఒకదశలో ఆగిపోయినంత పని చేసినప్పటికీ కృష్ణవంశీ గట్టి పట్టుదలతో బయటికి వచ్చేలా చేశారు. ఇప్పుడిది హిట్టా ఫ్లాపా అనేది దసరా రిలీజయ్యేలోపు తేలిపోవాలి. మార్చి 30నాటికి మెయిన్ సెంటర్స్ అన్నింటిలోనూ తీసేస్తారు కాబట్టి ఒకవేళ రంగమార్తాండకు జనాలు పెరగడం మొదలైతే బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలు అందుకోవచ్చు. ఇంకో నాలుగైదు రోజులు వెయిట్ చేయాలి.

This post was last modified on March 25, 2023 6:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

49 minutes ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

2 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

2 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

2 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

2 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

3 hours ago