వచ్చే నెల 28న విడుదల కాబోతున్న ఏజెంట్ కోసం అభిమానుల ఎదురుచూపులు అన్ని ఇన్ని కావు. ఆ డేట్ కి ఖచ్చితంగా వస్తుందనే నమ్మకమైతే ఫ్యాన్స్ లో ఉంది కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలు, ప్రచారాలు చూస్తుంటే మేకి వాయిదా పడొచ్చన్న ప్రచారం కూడా ఊపందుకుంది. ఇదంతా ఎలా ఉన్నా నిర్మాత అనిల్ సుంకర ఇదేమీ పట్టించుకోకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లానింగ్ తో పాటు ట్రైలర్ లాంచ్ కి సంబంధించిన పనులను దర్శకుడు సురేందర్ రెడ్డితో పాటు ప్రత్యేక శ్రద్ధతో దగ్గరుండి చూసుకుంటున్నట్టు ఇన్ సైడ్ టాక్. అయితే ఇక్కడే ఒక ట్విస్టు ఉంది.
గెస్టుల బరువును మాత్రం అఖిల్ భుజాల మీదే పెట్టినట్టు వినికిడి. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను తీసుకొస్తే ప్యాన్ ఇండియా లెవెల్ లో ఏజెంట్ కి బజ్ బాగా పెరుగుతుందని తాను అడిగితే పని జరగక్కపోవచ్చు కానీ అఖిల్ కి వాళ్ళతో ఎంతో చనువు ఉంది కాబట్టి ఎలాగైనా ఒప్పించమని అడుగుతున్నారట. తారక్ చరణ్ లు కలిసి ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన ఈవెంట్లలో తప్ప బయట ఎక్కడా కనిపించలేదు. విడివిడిగా ఇతర హీరోల వేడుకలకు హాజరయ్యారు తప్పించి జాయింట్ గా సాధ్యపడలేదు. అఖిల్ తలుచుకుంటే అవుతుందనేది అనిల్ తో పాటు సూరి ఆలోచన.
ఎలాగూ భోళాశంకర్ నిర్మాత తనే కాబట్టి చిరంజీవి ద్వారా అనిల్ సుంకర రాయబారం పెట్టొచ్చు. పైగా సురేందర్ రెడ్డికి అంతకన్నా ఎక్కువ బాండింగ్ మెగా ఫ్యామిలీతో ఉంది. ఇక్కడేం ఇబ్బంది లేదు. ఎటొచ్చి జూనియర్ ని ఒప్పించడం కష్టం. ఈ నెల 23 నుంచి తను కొరటాల శివతో రెగ్యులర్ షూటింగ్ లో బిజీ అయిపోతాడు. ఈ షెడ్యూల్ ఏకధాటిగా శంషాబాద్ పరిసరాల్లో పాతిక రోజులు జరుగుతుందట. అదే జరిగితే అంత సులభంగా అందుబాటులోకి రాడు. మరి అఖిల్ నడుం బిగించి వాళ్ళతో ఎస్ అనిపిస్తాడా లేక వేరే స్టార్లతో సర్దుకుంటాడా వేచి చూడాలి.
This post was last modified on March 20, 2023 4:57 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…