వచ్చే నెల 28న విడుదల కాబోతున్న ఏజెంట్ కోసం అభిమానుల ఎదురుచూపులు అన్ని ఇన్ని కావు. ఆ డేట్ కి ఖచ్చితంగా వస్తుందనే నమ్మకమైతే ఫ్యాన్స్ లో ఉంది కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలు, ప్రచారాలు చూస్తుంటే మేకి వాయిదా పడొచ్చన్న ప్రచారం కూడా ఊపందుకుంది. ఇదంతా ఎలా ఉన్నా నిర్మాత అనిల్ సుంకర ఇదేమీ పట్టించుకోకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లానింగ్ తో పాటు ట్రైలర్ లాంచ్ కి సంబంధించిన పనులను దర్శకుడు సురేందర్ రెడ్డితో పాటు ప్రత్యేక శ్రద్ధతో దగ్గరుండి చూసుకుంటున్నట్టు ఇన్ సైడ్ టాక్. అయితే ఇక్కడే ఒక ట్విస్టు ఉంది.
గెస్టుల బరువును మాత్రం అఖిల్ భుజాల మీదే పెట్టినట్టు వినికిడి. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను తీసుకొస్తే ప్యాన్ ఇండియా లెవెల్ లో ఏజెంట్ కి బజ్ బాగా పెరుగుతుందని తాను అడిగితే పని జరగక్కపోవచ్చు కానీ అఖిల్ కి వాళ్ళతో ఎంతో చనువు ఉంది కాబట్టి ఎలాగైనా ఒప్పించమని అడుగుతున్నారట. తారక్ చరణ్ లు కలిసి ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన ఈవెంట్లలో తప్ప బయట ఎక్కడా కనిపించలేదు. విడివిడిగా ఇతర హీరోల వేడుకలకు హాజరయ్యారు తప్పించి జాయింట్ గా సాధ్యపడలేదు. అఖిల్ తలుచుకుంటే అవుతుందనేది అనిల్ తో పాటు సూరి ఆలోచన.
ఎలాగూ భోళాశంకర్ నిర్మాత తనే కాబట్టి చిరంజీవి ద్వారా అనిల్ సుంకర రాయబారం పెట్టొచ్చు. పైగా సురేందర్ రెడ్డికి అంతకన్నా ఎక్కువ బాండింగ్ మెగా ఫ్యామిలీతో ఉంది. ఇక్కడేం ఇబ్బంది లేదు. ఎటొచ్చి జూనియర్ ని ఒప్పించడం కష్టం. ఈ నెల 23 నుంచి తను కొరటాల శివతో రెగ్యులర్ షూటింగ్ లో బిజీ అయిపోతాడు. ఈ షెడ్యూల్ ఏకధాటిగా శంషాబాద్ పరిసరాల్లో పాతిక రోజులు జరుగుతుందట. అదే జరిగితే అంత సులభంగా అందుబాటులోకి రాడు. మరి అఖిల్ నడుం బిగించి వాళ్ళతో ఎస్ అనిపిస్తాడా లేక వేరే స్టార్లతో సర్దుకుంటాడా వేచి చూడాలి.
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…