దేశంలో వివాహం చేసుకోకుండా ఒక స్త్రీ, ఒక పురుషుడు కలిసి జీవించడాన్ని చట్ట బద్ధం చేసిన విషయం తెలిసిందే. దీనినే సహజీవనం అంటూ.. సుప్రీం కోర్టు కూడా గతంలో సమర్థించింది. అయితే.. ఇలాంటి సహజీవనం చేసే దంపతుల వివరాలను నమోదు చేయాలని, వీరికి కూడా చట్టబద్ధత కల్పించాలని.. సహజీవనాన్ని రిజిస్ట్రేషన్ చేయాలని కోరడంపై మాత్రం నిప్పులు చెరిగింది. “సహజీవన్ రిజిస్ట్రేషన్..? నాన్సెన్స్” అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
అదేవిధంగా.. సహజీవనాల రిజిస్ట్రేషన్కు నిబంధనలను రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరడాన్ని మూర్ఖపు ఆలోచనగా అభివర్ణించింది. ఇందుకు సంబంధించిన వ్యాజ్యంపై విచారణకు నిరాకరించింది. ఈ పిటిషన్ను నాన్సెన్స్గా అబివర్ణించింది. సహజీవనం రిజిస్ట్రేషన్కు నిబంధనలను రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశాలించాలంటూ న్యాయవాది మమతా రాణి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే.. ఈ వ్యాజ్యంపై విచారణకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఇది ఒక మూర్ఖపు ఆలోచన అని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు.. ‘సహజీవనం రిజిస్ట్రేషన్కు, కేంద్రానికి సంబంధం ఏంటి? ఇదొక మూర్ఖపు ఆలోచన. ఈ రకమైన వ్యాజ్యాలు దాఖలు చేసే పిటిషనర్లను కోర్టు ఖర్చులు చెల్లించమనే సమయం ఆసన్నమైంది. ఈ పిటిషన్ను కొట్టివేస్తున్నాం.’ అని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.
అసలు ఈ పిటిషన్ ఎందుకంటే?
గతేడాది ఢిల్లీకి చెందిన యువతి శ్రద్ధావాకర్ను ఆమె ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆమె శరీరభాగాలను వేర్వేరు చోట్ల విసిరేశాడు. అయితే.. సహజీవనం రిజిస్ట్రేషన్ వల్ల ఇలాంటి వారి విషయంలో భాగస్వాముల గురించి ప్రభుత్వం దగ్గర కచ్చితమైన సమాచారం ఉంటుంది. అలాగే సహజీవనంలో ఉన్నవారికి నేర చరిత్ర ఉంటే అది కూడా ప్రభుత్వానికి తెలుస్తుంది.. అనేది న్యాయవాది మమతా రాణి ఉద్దేశం.
This post was last modified on March 20, 2023 7:43 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…