యాక్షన్ హీరో గోపీచంద్ కెరీర్లో అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన సినిమా ‘గౌతమ్ నంద’. మూడేళ్ల కిందట వచ్చిన ఈ చిత్రం దాదాపు 30 కోట్ల బడ్జెట్లో తెరకెక్కింది. సంపత్ నంది డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి విడుదలకు ముందు మంచి హైపే వచ్చింది కానీ.. సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. కంటెంట్ పరంగా తీసి పడేయదగ్గ సినిమా కాదు కానీ.. పెట్టుబడి-రాబడి కోణంలో చూ చివరికి దీన్ని డిజాస్టర్గా తేల్చారు ట్రేడ్ పండిట్లు.
ఈ చిత్రం విడుదలై మంగళవారానికి మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో దర్శకుడు సంపత్ నంది ఒక ఎమోషనల్ ట్వీట్ వేశాడు. ఒక ఫిలిం మేకర్గా ఇదే తన బెస్ట్ మూవీ అని అతను తీర్మానించాడు.
కొందరు ఈ చిత్రాన్ని కొందరు మోస్ట్ అండర్ రేటెడ్ అన్నారని.. కొందరు కరెక్ట్ రేటెడ్ అన్నారని.. కొందరు టెక్నికల్గా సుపీరియర్ అన్నారని.. కొందరు రైటింగ్ చాలా పూర్ అన్నారని.. ఐతే తాను ప్రతి అభిప్రాయాన్నీ గౌరవిస్తానని.. తన దృష్టిలో మాత్రం ఇది ఫిలిం మేకర్గా తన బెస్ట్ మూవీ అని.. ఆ విషయంలో తన నమ్మకం ఎప్పుడూ మారలేదని అన్నాడు సంపత్.
సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. సంపత్ అభిప్రాయంతో చాలామంది ఏకీభవిస్తారు. గోపీని రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో చాలా బాగా ప్రెజెంట్ చేశాడు సంపత్. ముఖ్యంగా ఇందులోని నెగెటివ్ క్యారెక్టర్ సినిమాకు హైలైల్. మూవీ కాన్సెప్ట్ కూడా ఆకట్టుకునేదే. కాకపోతే ఎగ్జిక్యూషన్ తేడా కొట్టింది.
సంపత్ కెరీర్లో ‘రచ్చ’ రూపంలో పెద్ద హిట్ ఉంది కానీ.. అది రొటీన్ ఫార్ములాటిక్ మసాలా మూవీ. సినిమా బాగా ఆడి ఉండొచ్చు కానీ.. దర్శకత్వ పరంగా దాంతో పోలిస్తే సంపత్కు ‘గౌతమ్ నంద’కే ఎక్కువ మార్కులు పడతాయి. ఆ సినిమా ఫెయిలైనప్పటికీ సంపత్, గోపీ కలిసి ‘సీటీమార్’తో మళ్లీ జత కట్టిన సంగతి తెలిసిందే.
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…