యాక్షన్ హీరో గోపీచంద్ కెరీర్లో అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన సినిమా ‘గౌతమ్ నంద’. మూడేళ్ల కిందట వచ్చిన ఈ చిత్రం దాదాపు 30 కోట్ల బడ్జెట్లో తెరకెక్కింది. సంపత్ నంది డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి విడుదలకు ముందు మంచి హైపే వచ్చింది కానీ.. సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. కంటెంట్ పరంగా తీసి పడేయదగ్గ సినిమా కాదు కానీ.. పెట్టుబడి-రాబడి కోణంలో చూ చివరికి దీన్ని డిజాస్టర్గా తేల్చారు ట్రేడ్ పండిట్లు.
ఈ చిత్రం విడుదలై మంగళవారానికి మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో దర్శకుడు సంపత్ నంది ఒక ఎమోషనల్ ట్వీట్ వేశాడు. ఒక ఫిలిం మేకర్గా ఇదే తన బెస్ట్ మూవీ అని అతను తీర్మానించాడు.
కొందరు ఈ చిత్రాన్ని కొందరు మోస్ట్ అండర్ రేటెడ్ అన్నారని.. కొందరు కరెక్ట్ రేటెడ్ అన్నారని.. కొందరు టెక్నికల్గా సుపీరియర్ అన్నారని.. కొందరు రైటింగ్ చాలా పూర్ అన్నారని.. ఐతే తాను ప్రతి అభిప్రాయాన్నీ గౌరవిస్తానని.. తన దృష్టిలో మాత్రం ఇది ఫిలిం మేకర్గా తన బెస్ట్ మూవీ అని.. ఆ విషయంలో తన నమ్మకం ఎప్పుడూ మారలేదని అన్నాడు సంపత్.
సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. సంపత్ అభిప్రాయంతో చాలామంది ఏకీభవిస్తారు. గోపీని రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో చాలా బాగా ప్రెజెంట్ చేశాడు సంపత్. ముఖ్యంగా ఇందులోని నెగెటివ్ క్యారెక్టర్ సినిమాకు హైలైల్. మూవీ కాన్సెప్ట్ కూడా ఆకట్టుకునేదే. కాకపోతే ఎగ్జిక్యూషన్ తేడా కొట్టింది.
సంపత్ కెరీర్లో ‘రచ్చ’ రూపంలో పెద్ద హిట్ ఉంది కానీ.. అది రొటీన్ ఫార్ములాటిక్ మసాలా మూవీ. సినిమా బాగా ఆడి ఉండొచ్చు కానీ.. దర్శకత్వ పరంగా దాంతో పోలిస్తే సంపత్కు ‘గౌతమ్ నంద’కే ఎక్కువ మార్కులు పడతాయి. ఆ సినిమా ఫెయిలైనప్పటికీ సంపత్, గోపీ కలిసి ‘సీటీమార్’తో మళ్లీ జత కట్టిన సంగతి తెలిసిందే.
This post was last modified on July 29, 2020 6:50 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…