వేణు వెల్దండి.. ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారిన పేరు. జబర్దస్త్ షోలో కామెడీ స్కిట్లు చేసుకుంటూ.. సినిమాల్లో చిన్న చిన్న కామెడీ రోల్స్ చేసిన అతడిలో ఒక మంచి అభిరుచి ఉన్న దర్శకుడు ఉన్నాడని ఇప్పుడే తెలుస్తోంది. ‘బలగం’ సినిమాతో అతను అందరినీ ఆశ్చర్యపరిచాడు. మలయాళం సినిమాలు చూసి మన దగ్గర ఇంత సహజమైన, నేటివిటీ ఫీల్ ఉన్న సినిమాలు రావని ఫీలయ్యే వారికి ‘బలగం’తో అతను సమాధానం చెప్పాడు. తెలంగాణ పల్లెటూరి కథను చాలా హృద్యంగా అతను చూపించిన విధానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
ఈ సినిమా చూసిన చాలామంది వేణులో ఇంత ప్రతిభ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. ఐతే ఇండస్ట్రీలో మాత్రం కొంతమందికి వేణు ప్రతిభ గురించి బాగానే తెలుసు. అతను ఇప్పటికే కొన్ని పేరున్న సినిమాలకు రచయితగా పని చేసిన విషయం ఇండస్ట్రీ జనాలకు మాత్రమే తెలుసు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో వేణు తాను పని చేసిన సినిమాల గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. ‘రుద్రమదేవి’ సినిమాకు హైలైట్గా నిలిచిన గోన గన్నారెడ్డి ఎపిసోడ్ చాలా వరకు వేణునే రాశాడట. అల్లు అర్జున్ చేసిన ఆ పాత్ర ఎంత బాగా పేలిందో తెలిసిందే. ఆ ట్రాక్ చాలా వరకు తానే రాశానని.. అది తెలిసి అల్లు అర్జున్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడని.. పలు సందర్భాల్లో తన గురించి చెప్పాడని వేణు తెలిపాడు. పక్కా తెలంగాణ యాసతో సాగే ఈ పాత్రకు డైలాగులు బాగా కుదిరాయి. బిత్తిరి సత్తి కూడా ఈ ట్రాక్ కోసం పని చేసినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అలాంటి ట్రాక్ రాశాడంటే వేణు ప్రతిభ గురించి ఇండస్ట్రీ జనాలకు అప్పుడే అర్థమై ఉంటుందన్నమాట.
అంతే కాక ‘జై లవకుశ’ సినిమాలో ఒక యాక్షన్ ఎపిసోడ్ కూడా తాను రాసినట్లు వెల్లడించాడు వేణు. ‘బలగం’ తర్వాత వేణు గురించి ఇండస్ట్రీలో బాగానే చర్చ జరుగుతోంది. ‘బలగం’ చిత్రాన్ని నిర్మించి దిల్ రాజే వేణుతో ఇంకో సినిమా చేయబోతుండగా.. గీతా ఆర్ట్స్ సైతం తనతో ఓ సినిమా చేసేందుకు చూస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
This post was last modified on March 10, 2023 2:54 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…