వేణు వెల్దండి.. ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారిన పేరు. జబర్దస్త్ షోలో కామెడీ స్కిట్లు చేసుకుంటూ.. సినిమాల్లో చిన్న చిన్న కామెడీ రోల్స్ చేసిన అతడిలో ఒక మంచి అభిరుచి ఉన్న దర్శకుడు ఉన్నాడని ఇప్పుడే తెలుస్తోంది. ‘బలగం’ సినిమాతో అతను అందరినీ ఆశ్చర్యపరిచాడు. మలయాళం సినిమాలు చూసి మన దగ్గర ఇంత సహజమైన, నేటివిటీ ఫీల్ ఉన్న సినిమాలు రావని ఫీలయ్యే వారికి ‘బలగం’తో అతను సమాధానం చెప్పాడు. తెలంగాణ పల్లెటూరి కథను చాలా హృద్యంగా అతను చూపించిన విధానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
ఈ సినిమా చూసిన చాలామంది వేణులో ఇంత ప్రతిభ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. ఐతే ఇండస్ట్రీలో మాత్రం కొంతమందికి వేణు ప్రతిభ గురించి బాగానే తెలుసు. అతను ఇప్పటికే కొన్ని పేరున్న సినిమాలకు రచయితగా పని చేసిన విషయం ఇండస్ట్రీ జనాలకు మాత్రమే తెలుసు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో వేణు తాను పని చేసిన సినిమాల గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. ‘రుద్రమదేవి’ సినిమాకు హైలైట్గా నిలిచిన గోన గన్నారెడ్డి ఎపిసోడ్ చాలా వరకు వేణునే రాశాడట. అల్లు అర్జున్ చేసిన ఆ పాత్ర ఎంత బాగా పేలిందో తెలిసిందే. ఆ ట్రాక్ చాలా వరకు తానే రాశానని.. అది తెలిసి అల్లు అర్జున్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడని.. పలు సందర్భాల్లో తన గురించి చెప్పాడని వేణు తెలిపాడు. పక్కా తెలంగాణ యాసతో సాగే ఈ పాత్రకు డైలాగులు బాగా కుదిరాయి. బిత్తిరి సత్తి కూడా ఈ ట్రాక్ కోసం పని చేసినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అలాంటి ట్రాక్ రాశాడంటే వేణు ప్రతిభ గురించి ఇండస్ట్రీ జనాలకు అప్పుడే అర్థమై ఉంటుందన్నమాట.
అంతే కాక ‘జై లవకుశ’ సినిమాలో ఒక యాక్షన్ ఎపిసోడ్ కూడా తాను రాసినట్లు వెల్లడించాడు వేణు. ‘బలగం’ తర్వాత వేణు గురించి ఇండస్ట్రీలో బాగానే చర్చ జరుగుతోంది. ‘బలగం’ చిత్రాన్ని నిర్మించి దిల్ రాజే వేణుతో ఇంకో సినిమా చేయబోతుండగా.. గీతా ఆర్ట్స్ సైతం తనతో ఓ సినిమా చేసేందుకు చూస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
This post was last modified on March 10, 2023 2:54 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…