Movie News

సత్తిగానితో మైత్రి డిజిటల్ స్నేహం

పెద్ద నిర్మాణ సంస్థలు కేవలం సినిమాల నిర్మాణానికే పరిమితం కావాలని చూడటం లేదు. ఎంటర్ టైన్మెంట్ రంగంలో అవకాశమున్న ప్రతి చోట తమ ప్రొడక్షన్ వెంచర్లు మొదలుపెడుతున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత ఒక విప్లవంగా దూసుకొచ్చిన ఓటిటి రంగంలో కూడా తమ జెండా పాతే ప్రయత్నాలు చేస్తున్నారు. వందల కోట్ల పెట్టుబడులతో ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ బ్యానర్ దిశగా దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ ఇటీవలే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి రూపంలో రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్న సంగతి తెలిసిందే. అమిగోస్ పోయినా పెద్దగా నష్టపోలేదు.

తాజాగా మైత్రి డిజిటల్ లో అడుగు పెట్టింది. సత్తిగాని రెండెకరాలు పేరుతో రూపొందిన ఓటిటి మూవీని ఈ నెల 17న విడుదల చేయబోతున్నారు. పుష్పలో అల్లు అర్జున్ స్నేహితుడిగా నటించి మంచి మార్కులు కొట్టేసిన జగదీశ్ ఇందులో హీరో. బన్నీతో చేస్తున్న టైంలోనే సుకుమార్ రికమండేషన్ మీద తనకీ ఆఫర్ వచ్చిందని ఇన్ సైడ్ టాక్. ఏదో తక్కువ బడ్జెటని క్యాస్టింగ్ లో రాజీ పడలేదు. వెన్నెల కిషోర్, బిత్తిరి సత్తి, మోహనశ్రీ లాంటి తారాగణం గట్టిగానే ఉంది. ఉన్న రెండెకరాల పొలం అమ్మాలా చావాలా అనే పాయింట్ మీద డార్క్ కామెడీతో రూపొందించారు.

ఇక్కడ బిజినెస్ కోణంలో చూడాల్సిన అంశం ఒకటుంది. సినిమాలా కాకుండా ఓటిటి మూవీలో రిస్క్ తక్కువగా ఉంటుంది. థియేటర్ల వ్యవహారాలు, విడుదల తేదీ తలనెప్పులు ఉండవు. ఒకేసారి వందల దేశాల్లో ప్రింట్ ఖర్చు లేకుండా నేరుగా ఆడియన్స్ కి స్ట్రీమింగ్ చేసేయొచ్చు. మంచి టాక్ వచ్చిందా వ్యూస్ మిలియన్లలో వర్షంలా కురుస్తాయి. యావరేజ్ అనిపించుకున్నా సరే ఓసారి చూద్దాంలే అనుకునే ప్రేక్షకులు కోట్లలో ఉంటారు. దీనివల్ల తీసినవాళ్లకు కొన్నవాళ్లకు ఇద్దరికీ లాభమే. సత్తిగాని రెండెకరాల తర్వాత మైత్రి యాక్టివ్ గా మరిన్ని డిజిటల్ సినిమాలు తీయించే పనిలో ఉందట.

This post was last modified on March 5, 2023 3:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

5 minutes ago

మోదీ స్కిన్ టోన్… అక్కడ తెలుపు.. ఇక్కడ నలుపా?

ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…

8 minutes ago

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

38 minutes ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

60 minutes ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

2 hours ago

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…

4 hours ago