Political News

మోడీపై మూకుమ్మడి దాడి స్టార్ట్

ప్రతిపక్షాల నేతలు నరేంద్రమోడీపై లేఖా యుద్ధాన్ని మొదలుపెట్టారు. దర్యాప్తు సంస్ధలను దుర్వినియోగం చేయటంపై నలుగురు ముఖ్యమంత్రులు మోడీకి లేఖ రాశారు. దర్యాప్తు సంస్ధలను ప్రయోగించి విపక్షాలను వేధింపులకు గురిచేయటాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తు ముఖ్యమంత్రులు కేసీయార్, మమతాబెనర్జీ, భగవంత్ సింగ్ మాన్, అరవింద్ కేజ్రీవాల్ మోడీకి లేఖ రాశారు. ఈ లేఖలో శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్ కూడా సంతకాలు చేశారు.

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ శిసోడియా అరెస్టును వీళ్ళంతా ఖండించారు. మనీష్ అరెస్టు కేవలం కేంద్రప్రభుత్వం కక్షసాధింపులో భాగమని మండిపడ్డారు. దర్యాప్తు సంస్ధల స్వయంప్రతిపత్తిని కేంద్రప్రభుత్వం హరించేస్తోందని దుయ్యబట్టారు. దర్యాప్తు సంస్ధలకున్న ప్రతిష్టను మోడీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం పూర్తిగా దిగజార్చేసినట్లు లేఖలో రెచ్చిపోయారు. పేరుకు మాత్రమే దర్యాప్తు సంస్ధలు స్వయంప్రతిపత్తి ఉన్న సంస్ధలన్నీ ఆచరణలో మాత్రం అంతా ప్రభువులు చెప్పినట్లే నడుచుకుంటున్నాయని ఆరోపించారు.

వివిధ రాష్ట్రాల్లో విపక్షాలను దర్యాప్తు సంస్ధలను అడ్డం పెట్టుకుని కేంద్రప్రభుత్వం ఏ విధంగా వేధిస్తున్నదనే విషయాన్ని వీళ్ళు లేఖలో ప్రస్తావించారు. 2014 నుండి దర్యాప్తుసంస్ధలకు సొంత ఐడెంటి అనేది లేకుండా పోయిందని మండిపోయారు. ఝార్ఖండ్ లో హేమంత్ సోరేన్, కర్నాటకలో డీకే శివకుమార్ లాంటి నేతలతో పాటు బీహార్ నితీష్ కుమార్ మద్దతుదారులను, మహారాష్ట్రలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ లాంటి వాళ్ళని, ఎన్సీపీ నేత నవాజ్ మాలిక్ తదితరులపై దర్యాప్తు సంస్ధలు కేసులు పెట్టి అరెస్టులు చేసింది.

ఆప్ మంత్రులను, డీకే శివకుమార్ ను అయితే పదే పదే విచారణల పేరుతో రోజుల తరబడి సీబీఐ, ఈడీ ఉన్నతాధికారులు విచారణకు పిలిచింది వాస్తవమే. సోనియాగాంధీ, రాజీవ్ గాంధీలను కూడా రోజుల తరబడి సీబీఐ విచారించిన విషయం తెలిసిందే. నిజంగానే ఎవరైనా అవినీతికి పాల్పడుంటే వాళ్ళపైన కేసులు నమోదు చేసి యాక్షన్ తీసుకోవాల్సిందే అనటంలో సందేహంలేదు. అంతేకానీ రోజులు, నెలల తరబడి విచారణపేరుతో వేధింపులకు గురిచేయటం మాత్రం అభ్యంతరకరమే. ఇపుడు దర్యాప్తు సంస్ధలు చేస్తున్నది ఇదే కాబట్టే ప్రతిపక్షాల అధినేతలు మోడీకి లేఖ రాసింది.

This post was last modified on March 5, 2023 4:05 pm

Share
Show comments

Recent Posts

జగన్ ఫొటో వేయకపోతే ఇంత డ్యామేజ్ జరిగేదా?

ఫొటోల పిచ్చి అనండి.. ప్ర‌చార పిచ్చి అనండి.. ఏదేమైనా ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం చేజేతులా చేసుకున్న వ్య‌వ‌హారం ఇప్పుడు పీక‌ల…

3 hours ago

స్వయంభు కాచుకోవాల్సిన మూడు సవాళ్లు

నిఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న స్వయంభు షూటింగ్ వేగమందుకుంది. సుమరు ఎనిమిది కోట్ల బడ్జెట్…

3 hours ago

పీవీ రమేష్ ట్వీట్ తో భారీ డ్యామేజ్ ?!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ప్ర‌చారం వాడి వేడిగా సాగుతున్న స‌మ‌యంలో గ‌త ఏడాది జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌వేశ‌పెట్టిన‌ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్…

5 hours ago

పెద్దిరెడ్డికి బుల్లెట్ దిగుద్ది: చంద్ర‌బాబు మాస్ వార్నింగ్‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వైసీపీ కీల‌క నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆయ‌న బ‌రిలో ఉన్న…

7 hours ago

కూటమికి సంఘీభావం తెలుపుతూ జర్మనీలో ప్రవాసాంధ్రుల ర్యాలీ

మరో వారం రోజుల్లో (మే 13న) జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-భాజాపా కూటమికి సంఘీభావం తెలుపుతూ ఎన్నారై టీడీపీ…

9 hours ago

ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్ర‌శ్నకు రాజ‌మౌళి అస‌హ‌నం

ఆర్ఆర్ఆర్ సినిమా అద్భుత విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ.. ఆ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌తో పోలిస్తే జూనియ‌ర్ ఎన్టీఆర్ పాత్ర‌లో అంత బ‌లం…

11 hours ago