Political News

మోడీపై మూకుమ్మడి దాడి స్టార్ట్

ప్రతిపక్షాల నేతలు నరేంద్రమోడీపై లేఖా యుద్ధాన్ని మొదలుపెట్టారు. దర్యాప్తు సంస్ధలను దుర్వినియోగం చేయటంపై నలుగురు ముఖ్యమంత్రులు మోడీకి లేఖ రాశారు. దర్యాప్తు సంస్ధలను ప్రయోగించి విపక్షాలను వేధింపులకు గురిచేయటాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తు ముఖ్యమంత్రులు కేసీయార్, మమతాబెనర్జీ, భగవంత్ సింగ్ మాన్, అరవింద్ కేజ్రీవాల్ మోడీకి లేఖ రాశారు. ఈ లేఖలో శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్ కూడా సంతకాలు చేశారు.

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ శిసోడియా అరెస్టును వీళ్ళంతా ఖండించారు. మనీష్ అరెస్టు కేవలం కేంద్రప్రభుత్వం కక్షసాధింపులో భాగమని మండిపడ్డారు. దర్యాప్తు సంస్ధల స్వయంప్రతిపత్తిని కేంద్రప్రభుత్వం హరించేస్తోందని దుయ్యబట్టారు. దర్యాప్తు సంస్ధలకున్న ప్రతిష్టను మోడీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం పూర్తిగా దిగజార్చేసినట్లు లేఖలో రెచ్చిపోయారు. పేరుకు మాత్రమే దర్యాప్తు సంస్ధలు స్వయంప్రతిపత్తి ఉన్న సంస్ధలన్నీ ఆచరణలో మాత్రం అంతా ప్రభువులు చెప్పినట్లే నడుచుకుంటున్నాయని ఆరోపించారు.

వివిధ రాష్ట్రాల్లో విపక్షాలను దర్యాప్తు సంస్ధలను అడ్డం పెట్టుకుని కేంద్రప్రభుత్వం ఏ విధంగా వేధిస్తున్నదనే విషయాన్ని వీళ్ళు లేఖలో ప్రస్తావించారు. 2014 నుండి దర్యాప్తుసంస్ధలకు సొంత ఐడెంటి అనేది లేకుండా పోయిందని మండిపోయారు. ఝార్ఖండ్ లో హేమంత్ సోరేన్, కర్నాటకలో డీకే శివకుమార్ లాంటి నేతలతో పాటు బీహార్ నితీష్ కుమార్ మద్దతుదారులను, మహారాష్ట్రలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ లాంటి వాళ్ళని, ఎన్సీపీ నేత నవాజ్ మాలిక్ తదితరులపై దర్యాప్తు సంస్ధలు కేసులు పెట్టి అరెస్టులు చేసింది.

ఆప్ మంత్రులను, డీకే శివకుమార్ ను అయితే పదే పదే విచారణల పేరుతో రోజుల తరబడి సీబీఐ, ఈడీ ఉన్నతాధికారులు విచారణకు పిలిచింది వాస్తవమే. సోనియాగాంధీ, రాజీవ్ గాంధీలను కూడా రోజుల తరబడి సీబీఐ విచారించిన విషయం తెలిసిందే. నిజంగానే ఎవరైనా అవినీతికి పాల్పడుంటే వాళ్ళపైన కేసులు నమోదు చేసి యాక్షన్ తీసుకోవాల్సిందే అనటంలో సందేహంలేదు. అంతేకానీ రోజులు, నెలల తరబడి విచారణపేరుతో వేధింపులకు గురిచేయటం మాత్రం అభ్యంతరకరమే. ఇపుడు దర్యాప్తు సంస్ధలు చేస్తున్నది ఇదే కాబట్టే ప్రతిపక్షాల అధినేతలు మోడీకి లేఖ రాసింది.

This post was last modified on March 5, 2023 4:05 pm

Share
Show comments

Recent Posts

స్టార్లు లేని లోటు… సత్య తీరుస్తాడా?

ఒకప్పుడు వేసవి సీజన్ అంటే పెద్ద హీరోల సినిమాలతో కళకళలాడిపోయేది. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితులు మారిపోయాయి. ముందు పెద్ద…

1 hour ago

హిట్టిస్తే గుడి కట్టేస్తారు

బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నది సల్మాన్ ఖానే. ఆయన నిఖార్సయిన బ్లాక్‌బస్టర్ కొట్టి దశాబ్దం…

2 hours ago

వెంకటేష్ బాకీ తమన్ తీర్చాల్సిందే

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…

4 hours ago

ప్రభాస్ వల్ల థియేటర్లకు కళొచ్చింది

మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…

7 hours ago

“తెలంగాణ వద్దురా… ఉమ్మడి ఆంధ్ర ముద్దురా”

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…

7 hours ago

80% రాజ‌కీయ నేత‌లు సెక్స్ వీడియోలు చూస్తారా?,

``రాజ‌కీయ నేత‌లు.. ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసేది త‌క్కువ‌.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ‌. కావాలంటే.. నా ఫోన్ స‌హా.. రాష్ట్రంలోని…

7 hours ago