సాయి ధరం తేజ చేసింది తక్కువ సినిమాలే అయినా యువ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ ఆరంభంలో తన నటనతో ప్రేక్షకులకు మెగా స్టార్ , పవర్ స్టార్ లను గుర్తిచేసి మెగా ఫ్యాన్స్ కి బాగా దగ్గరయ్యాడు. హిట్ ఫ్లాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న తేజ కెరీర్ కి ఊహించని ఓ సంఘటన బ్రేక్ వేసింది.
అతి పెద్ద రోడ్ ప్రమాదం నుండి తేజ్ ప్రాణాలతో బయట పడ్డాడు. ఇప్పుడు షూటింగ్ లో పాల్గొంటూ మళ్ళీ కెరీర్ పై దృష్టి పెడుతున్నాడు. విరూపాక్ష అనే సినిమాను కంప్లీట్ చేసి తాజాగా మావయ్య పవన్ తో చేస్తున్న సినిమా సెట్స్ లోకి వచ్చేశాడు. అయితే తేజ్ కి ప్రస్తుతం సక్సెస్ రేట్ తక్కువగా ఉంది. ప్రీవీయస్ మూవీస్ ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘రిపబ్లిక్’ సినిమాలు తేజ్ కి సక్సెస్ ఇవ్వలేకపోయాయి. అంతకుముందు వినాయక్ తో చేసిన ఇంటెలిజెంట్ తేజ్ కి ఓ డిజాస్టర్ అందించింది.
అందుకే ఇప్పుడు తేజ్ కెరీర్ పై పవన్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. రిపబ్లిక్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన పవన్ ఇప్పుడు విరూపాక్ష ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాడు. ఇక వినోదాయ సీతమ్ రీమేక్ కూడా తేజ్ కోసమే చేస్తున్నాడు. ఇందులో తేజ్ పాత్రే కీలకం. ఇటీవలే ఆహా షోలో తేజ్ హెల్త్ గురించి పవన్ ఎంత కేర్ తీసుకున్నాడో బాలయ్య ద్వారా తెలియకనే తెలిసింది. అసలు తేజ్ ఇండస్ట్రీకి రావడం వెనుక ఉండి ముందుకు తోసిందే పవన్.
ఏదేమైనా తేజ్ సినిమాలను ముందుకొచ్చి ప్రమోట్ చేయడం , తేజ్ కి ఓ బ్లాక్ బస్టర్ దక్కేలా ప్లాన్ చేస్తుండటం చూస్తుంటే సాయి ధరం తేజ్ కెరీర్ ను పవన్ ఘాడీలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు క్లియర్ గా తెలుస్తుంది. మరి మావయ్య సపోర్ట్ తో ఇకపై తేజ్ ఎలాంటి హిట్స్ కొడతాడో ?
This post was last modified on February 28, 2023 10:08 am
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…