Political News

ఏపీలో న‌వ‌ర‌త్నాల గుడి.. ప‌థ‌కం కాదు..నిజ‌మే!!

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం 2019 ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన‌ మేనిఫెస్టోలో న‌వ‌ర‌త్నాలు అనే కాన్సెప్టును తీసుకువ‌చ్చింది. అంటే..తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. కీల‌క‌మైన 9 అంశాల‌ను అమ‌లు చేస్తామ‌ని ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చింది. వీటిలో అమ్మ ఒడి, రైత భరోసా, ఆరోగ్య‌శ్రీ, జ‌గ‌న‌న్న ఇళ్లు, విద్యాకానుక ఇలా.. 9 కార్య‌క్ర‌మాలు ఉన్నాయి. వీటిని అమ‌లు కూడా చేస్తున్నారు. ఇవి పాత‌వా. కొత్త‌వా.. అనే శ‌ష‌భిష‌లు ప‌క్క‌న పెట్టి.. అమ‌లు చేస్తున్నారు.

అంతేకాదు.. త‌ర‌చుగా..న‌వ‌ర‌త్నాల‌ పై ప్ర‌చారం కూడా జోరుగా చేస్తున్నారు. సంక్షేమ ప్ర‌భుత్వంలో న‌వ‌ రత్నాలు.. అమ‌లు చేస్తున్నామ‌ని నాయ‌కులు.. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్ర‌చారం దంచి కొడుతున్నారు. అయితే.. ఇక్క‌డి తో క‌థ అయిపోలేదు. ఇప్పుడు శ్రీకాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే, సీఎం జ‌గ‌న్ అంటే.. భారీ ఎత్తున అభిమానించే బియ్య‌పు మ‌ధుసూద‌న రెడ్డి మ‌రో కొత్త ప్ర‌యోగం కూడా చేశారు.

త‌మిళ‌నాడును ఆనుకుని ఉన్న త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని ఓ గ్రామంలో రెండు సెంట్ల స్థ‌లం కొని.. దానిలో ఏకంగా, న‌వ‌ర‌త్నాల గుడిని నిర్మించేశారు. జ‌గ‌న్‌ పై భ‌క్తిని ఇలా ప్ర‌ద‌ర్శించార‌న్న‌మాట‌. త‌మిళ‌నాడులో ఒక సంప్ర‌దాయం ఉంది. తమ‌కు న‌చ్చిన‌, తాము మెచ్చిన నాయ‌కుల‌కు గుడులు క‌డ‌తారు. ఇదే కాన్సెప్టును మ‌ధు కూడా తీసుకున్న‌ట్టుగా ఉన్నారు.

వెంట‌నే ఆయ‌న భారీ ఎత్తున ఇక్క‌డ ఆల‌యాన్ని క‌ట్టించి.. దీనికి న‌వ‌ర‌త్నాల గుడి అని పేరు కూడా పెట్టారు. ఏదేమైనా..ఏదో ఒక ర‌కంగా.. అధినేత‌ను మ‌చ్చిక చేసుకోవాలి క‌దా!! అందుకే ఈ ప్ర‌య‌త్నాలు అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ గుడిలో న‌వ‌ర‌త్న ప‌థ‌కాల‌ను అన్నింటినీ.. చిత్రీక‌రించి.. ప్ర‌చారం చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

https://www.facebook.com/reel/1383187025767797/

This post was last modified on February 28, 2023 12:34 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

3 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

4 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

5 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

5 hours ago