ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ.. ఘర్ వాపసీ మంత్రాన్ని పఠిస్తోంది. గత ఎన్నికల తర్వాత.. పార్టీ నుంచి దూరమైన వారిని చేర్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. సమాజంలో మంచి పలుకు బడి.. ఆర్థికంగా బలం ఉన్నవారిని తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కడప జిల్లా కు చెందిన ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్, సహా.. అనేక మంది నాయకులను తిరిగి రావాలని కోరుతు న్నట్టు తెలుస్తోంది.
అలానే.. ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా చాలా మంది నాయకులు వైసీపీ చెంతకు చేరిపోయారు. వీరిని కూడా పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోందని టీడీపీ నాయకులుచెబుతున్నారు. వచ్చే ఎన్ని కలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో టీడీపీ.. ఆ ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలంటే.. అన్ని వర్గాలను కూడా కలుపుకొని పోవాలని నిర్ణయించుకుంది. అదేవిధంగా గతంలో పార్టీకి సేవలు అందించి.. దూరమైన వారిని కూడా దరి చేర్చుకునే ప్రయత్నాలు ప్రారంభించింది.
ఇక, ఇప్పుడు టీడీపీ నుంచి బయటకు వెళ్లి.. వేరే పార్టీల్లో ఉన్నవారు కూడా అంతర్మథనంలో పడ్డారు. త మకు టికెట్లు దక్కుతాయో లేదో.. అనే బెంగ ఒకవైపు వారిని వేధిస్తోంది. తీరా చివరి నిముషం వరకు ఉంటే.. తమ పరిస్థితి ఏంటని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు కూడా టీడీపీ వైపు చూస్తున్నారు. కొందరికి మొహం మాటం అడ్డొచ్చి ఆగుతున్నవారు కూడా ఉన్నారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు ఇప్పుడు ఘర్ వాపసీ మంత్రాన్ని వినిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on February 28, 2023 10:06 am
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…