ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ.. ఘర్ వాపసీ మంత్రాన్ని పఠిస్తోంది. గత ఎన్నికల తర్వాత.. పార్టీ నుంచి దూరమైన వారిని చేర్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. సమాజంలో మంచి పలుకు బడి.. ఆర్థికంగా బలం ఉన్నవారిని తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కడప జిల్లా కు చెందిన ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్, సహా.. అనేక మంది నాయకులను తిరిగి రావాలని కోరుతు న్నట్టు తెలుస్తోంది.
అలానే.. ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా చాలా మంది నాయకులు వైసీపీ చెంతకు చేరిపోయారు. వీరిని కూడా పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోందని టీడీపీ నాయకులుచెబుతున్నారు. వచ్చే ఎన్ని కలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో టీడీపీ.. ఆ ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలంటే.. అన్ని వర్గాలను కూడా కలుపుకొని పోవాలని నిర్ణయించుకుంది. అదేవిధంగా గతంలో పార్టీకి సేవలు అందించి.. దూరమైన వారిని కూడా దరి చేర్చుకునే ప్రయత్నాలు ప్రారంభించింది.
ఇక, ఇప్పుడు టీడీపీ నుంచి బయటకు వెళ్లి.. వేరే పార్టీల్లో ఉన్నవారు కూడా అంతర్మథనంలో పడ్డారు. త మకు టికెట్లు దక్కుతాయో లేదో.. అనే బెంగ ఒకవైపు వారిని వేధిస్తోంది. తీరా చివరి నిముషం వరకు ఉంటే.. తమ పరిస్థితి ఏంటని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు కూడా టీడీపీ వైపు చూస్తున్నారు. కొందరికి మొహం మాటం అడ్డొచ్చి ఆగుతున్నవారు కూడా ఉన్నారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు ఇప్పుడు ఘర్ వాపసీ మంత్రాన్ని వినిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on February 28, 2023 10:06 am
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…
ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…
ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం…
థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఈ నగరానికి…
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…