Movie News

తమిళ డబ్బింగ్ సినిమాకు మైత్రి మద్దతు

సంక్రాంతి నుంచి స్వంతంగా డిస్ట్రిబ్యూషన్ లోకి అడుగు పెట్టిన మైత్రి మూవీ మేకర్స్ చిన్న సినిమాలను నిర్మించడమే కాదు డబ్బింగ్ చిత్రాలను కూడా తీసుకొస్తోంది. అందులో భాగంగానే కోనసీమ థగ్స్ ని ఈ నెల 24న విడుదల చేయబోతున్నారు.

ఆ రోజు చెప్పుకోదగ్గ రిలీజులేవీ లేకపోవడంతో ఆ అవకాశాన్ని వాడుకోవడానికి రంగం సిద్ధమయ్యింది. జైలు బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మూవీలో తెలుగు జనాలు గుర్తించే మొహం ఏదైనా ఉందంటే అది బాబీ సింహా ఒక్కడే. మిగిలినదంతా ఆరవ బ్యాచే. హ్రిదు హరూన్ హీరోగా నటించిన ఈ ఇంటెన్స్ డ్రామాలో క్యాస్టింగ్ ఎక్కువే ఉంది.

దీని ట్రైలర్ ఇవాళ విడుదల చేశారు. కరుడు గట్టిన రౌడీలంతా ఒకే జైలులో కలుసుకుంటారు. అక్కడి పరిస్థితులు రోజుకో మలుపు తిరుగుతూ ప్రాణాలను ప్రమాదంలో నెట్టేస్తుంటాయి.

ఊచల వెనుక ఉన్నా బయట దందా నడిపించడంతో చేయి తిరిగిన ఈ గూండాల బ్యాచ్ అంతా తప్పించుకుపోవడానికి ప్లాన్ చేస్తుంది. మృగంలా ప్రవర్తించే పోలీసుల కళ్లుగప్పి వీళ్ళేం చేశారనే పాయింట్ మీద ఈ కోనసీమ థగ్స్ రూపొందించారు. సామ్ సిఎస్ నేపధ్య సంగీతం, కారాగారం విజువల్స్ మాస్ ని ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. నృత్య దర్శకురాలు బృందకు డైరెక్షన్ డెబ్యూ ఇది.

వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సక్సెస్ లతో ఊపు మీదున్న మైత్రికి ఇటీవలే అమిగోస్ డిజాస్టర్ పెద్ద షాక్ ఇచ్చింది. కాకపోతే నష్టం చిన్నది కాబట్టి అంతగా ప్రభావం చెందలేదు కానీ ఇకపై నిర్మాణం పంపిణి రెండూ బాలన్స్ చేసేలా పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నారట.

కేవలం తమ ప్రొడక్షన్ వి మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తే లాభం లేదని గుర్తించి ఇప్పుడీ మార్కెటింగ్ కి తెర తీశారు. సినిమాను అమ్మడం వరకే కాదు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లో ట్రైలర్లు గట్రా పోస్ట్ చేస్తూ ప్రమోషన్లకే సైతం తోడ్పాటు అందిస్తున్నారు. ప్లాన్లైతే గట్టిగానే ఉన్నాయి మరి

This post was last modified on February 18, 2023 4:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

16 minutes ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

1 hour ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

2 hours ago

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కౌంట్ డౌన్?

వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…

4 hours ago

ధనుష్‌ను ఆకాశానికెత్తేసిన మృణాల్

తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…

4 hours ago

తారక్, ప్రభాస్ ఇద్దరూ పునుగుల పిచ్చోళ్లే

టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…

4 hours ago