Movie News

ప్రాజెక్ట్ కె మాట మీద నిలబడుతుందా

ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ 2024 సంక్రాంతికి ఏ సినిమాలు వస్తాయనే ఊహాగానాలు కొనసాగుతూ ఉండగానే ఇవాళ హఠాత్తుగా ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్ ని జనవరి 12 ప్రకటించేయడం అభిమానులను సైతం షాక్ కి గురి చేసింది. ఎందుకంటే రాబోయే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ఆది పురుష్, సలార్ లు రాబోతున్న నేపథ్యంలో దాని తర్వాత కేవలం నాలుగు నెలల గ్యాప్ లో ఇంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీని షెడ్యూల్ చేశారంటే నమ్మశక్యం కాదంటున్నారు. ముందస్తు జాగ్రత్త కోసం అనౌన్స్ చేశారా లేక నిర్మాత అశ్వినిదత్ కృత నిశ్చయంతో ఉన్నారా అనేది సస్పెన్స్

ఒక్క కొత్త పోస్టర్ తో ఇవాళ అఫీషియల్ గా చెప్పేశారు. ఒకరకంగా చెప్పాలంటే ప్రభాస్ రాకను ముందుగా చెప్పడం వల్ల వైజయంతి సంస్థ చాలా తెలివైన ఎత్తుగడ వేసింది. ఎందుకంటే రామ్ చరణ్ శంకర్ ల కాంబో మూవీ అదే సీజన్ ని లక్ష్యంగా పెట్టుకుని షూటింగ్ జరుపుకుంటోంది. అయితే నిర్మాత దిల్ రాజు ఆ విషయం ఎక్కడా చెప్పడం లేదు. ట్విట్టర్ లో ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న ఊహాగానాలే తప్ప నిజంగా ఆ నెలలోనే వస్తుందా అంటే ఎవరికీ తెలియదు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సైతం కమర్షియల్ గా వర్కౌట్ కావాలంటే అదే సంక్రాంతే బెస్టని ఫీలవుతోందట.

మరి ప్రాజెక్ట్ కె ఎంత మంది ఇతను ప్రొడ్యూసర్లు సీరియస్ గా తీసుకుంటారనేది వేచి చూడాలి. ఇప్పుడు చెప్పినంత మాత్రాన ప్రాజెక్ట్ కె ఆ మాట మీదే ఉంటుందని గ్యారెంటీ లేదు. ఇది ప్రతి ప్రభాస్ సినిమాకు జరిగేదే. ఇంకా చాలా టైం పడుతుందని ఎదురు చూస్తున్న సమయంలో ఇలా సడన్ ట్విస్టు ఇవ్వడం ఎవరూ ఊహించలేదు. దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సోషియో ఫాంటసీ డ్రామాలో అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్ లాంటి బాలీవుడ్ సీనియర్లు నటిస్తున్నారు. నిజంగా ప్రాజెక్ట్ కె కనక దీనికే కట్టుబడితే మిగిలినవాళ్లు వీలైనంత త్వరగా అలెర్ట్ అవ్వడం అవసరం. లేదంటే లేనిపోని ఇబ్బందులు వచ్చేస్తాయి

Share

Recent Posts

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

1 hour ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

2 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

2 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

3 hours ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

4 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

4 hours ago