టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో పర్ఫెక్షన్ కోసం గట్టిగా ప్రయత్నించి.. సినిమాల మేకింగ్ను బాగా ఆలస్యం చేసే దర్శకుల్లో సుకుమార్ ఒకడు. స్క్రిప్టు తయారీ.. ప్రి ప్రొడక్షన్.. ప్రొడక్షన్.. అన్నింటి విషయంలోనూ సుక్కు బాగా టైం తీసుకుంటాడని పేరుంది. పుష్ప సినిమా విషయంలోనూ ఇదే జరిగి ఈ సినిమా పట్టాలెక్కడంలో.. షూటింగ్ పూర్తి చేసుకోవడంలో.. అలాగే రిలీజ్ విషయంలో ఆలస్యం జరిగింది. ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో పెద్ద హిట్ కావడంతో సుక్కు మీద మరింత బాధ్యత పెరిగిపోయి… పుష్ప 2 స్క్రిప్టు మీద మళ్లీ కూర్చున్నాడు.
పుష్ప రిలీజైన ఏడాది తర్వాత కానీ ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లలేదు. ఈ సినిమా మేకింగ్ చాలా శ్రమతో కూడుకున్నది కావడం.. రెండో భాగం మీద ఉన్న అంచనాల దృష్ట్యా ప్రి ప్రొడక్షన్.. ప్రమోషన్ జాగ్రత్తగా చేయాల్సి రావడం.. ఈ చిత్రం రిలీజయ్యే భాషలు కూడా ఎక్కువైపోవడంతో 2023 రిలీజ్ మీద దాదాపుగా ఆశలు వదులుకున్నారు అభిమానులు. 2024 వేసవికి కానీ సినిమా రిలీజ్ కాకపోవచ్చని షూటింగ్ మొదలవుతున్నపుడు యూనిట్ సభ్యులు ఒక అంచనాకు వచ్చేశారు. కానీ ఈ సినిమా షూటింగ్ మొదలయ్యాక కథ మారిపోయినట్లు సమాచారం. బాగా కసరత్తు చేయడం వల్ల సుకుమార్ ఈసారి కొంచెం వేగంగానే షూటింగ్ లాగిస్తున్నాడట. అంతే కాక బన్నీ సుక్కుకు ఒక డెడ్ లైన్ కూడా పెట్టేసినట్లు సమాచారం.
పుష్ప రిలీజైన డిసెంబరు 17వ తేదీకే దీన్ని తీసుకొద్దామని.. అందుకోసం తాను ఎంత కష్టపడ్డానికైనా, ఏం చేయడానికైనా రెడీ అని బన్నీ చెప్పాడట. దీంతో సుక్కు కూడా ఈ దెబ్బతో అలెర్ట్ అయిపోయాడట. ఇప్పటికే రెండు చిన్న షెడ్యూళ్లలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో ఒక లెంగ్తీ షెడ్యూల్ పెట్టుకున్నారు. దాదాపు నెల రోజులు సాగే ఈ షెడ్యూల్తో 40 శాతం సినిమా పూర్తయిపోతుందట. తర్వాత ఇంకో నాలుగు నెలలు ఇదే ఫ్లోతో కష్టపడితే షూట్ మొత్తం అయిపోతుంది. డిసెంబరు 17 టార్గెట్ పెట్టుకుంటే ప్రి ప్రొడక్షన్, ప్రమోషన్కు దాదాపు మూడు నెలల సమయం ఉంటుంది. గట్టిగా ప్రయత్నిస్తే ఆ డేట్ అందుకోవడం కష్టమేమీ కాదని టీం భావిస్తోంది. ఆ డేట్ మిస్సయితే 2024 సంక్రాంతి లేదా వేసవికి సినిమా రావచ్చు.
This post was last modified on February 14, 2023 2:44 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…