Political News

తమిళనాడు పాలిటిక్స్ వద్దంటున్న లోకేష్

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 19వ రోజుకు చేరుకుంది. ప్రతీచోట జన ప్రభంజనం కనిపిస్తోంది. పంచ్ డైలాగులతో లోకేష్ జనాన్ని ఉర్రూతలూగిస్తున్నారు. సైకో ముఖ్యమంత్రిని గద్దె దించే రోజు వచ్చిందని అందరికీ చెబుతున్నారు. తాము అధికారానికి వస్తే చేయబోయేదేమిటో చెబుతున్నారు..

డైమండ్ పాప టు జబర్దస్త్ ఆంటీ

లోకేష్ ఇప్పుడు రోజాకు టైటిల్ మార్చేశారు. ఇంతకాలం డైమండ్ రాణి, డైమండ్ పాప అని పిలిచిన లోకేష్ ఇప్పుడు రూట్ మార్చారు. డైమండ్ పాప అంటే రోజా నొచ్చుకుంటున్నారట. అందుకనే అమెను ఇప్పుడు జబర్దస్త్ ఆంటీ అని అంటున్నారు. నగరి నియోజకవర్గంలో జబర్దస్త్ ఆంటీ అరాచకాలను ఆయన ఏకరవు పెట్టారు. గ్రావెల్, గ్రానైట్ వ్యాపారాలను ఎండగడుతున్నారు.

పదేళ్లు అవకాశం ఇవ్వండి

వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించడంతో పాటు పదేళ్లు అధికారంలో ఉండి ఏపీ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఇవ్వాలని లోకేష్ కోరుతున్నారు. పదేళ్లు అనడానికి ఒక కారణం ఉంది. తమిళనాడులో ఎంజీఆర్ మరణానంతరం అధికారం డీఎంకే, అన్నాడీఎంకే మధ్య దోబూచులాడింది. ఒక్క సారి మినహా ప్రతీ సారీ అధికార పార్టీ ఓడిపోతూనే ఉంది. జయలలిత, కరుణానిధి మధ్య అధికారం మారతూ ఉండేది. దీని వల్ల సంక్షేమం దెబ్బతిన్నదన్న విశ్లేషణలు వినిపించాయి. లోకేష్ చెబుతున్నది కూడా అదే. ఇప్పటికే జగన్ చేసిన డేమేజ్ నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే ఐదేళ్లు చాలవని కనీసం పదేళ్లు అధికారంలో ఉండాలని ఆయన అంటున్నారు. అమరావతి నిర్మాణం పూర్తి చేయాలంటే టైమ్ పడుతుందని ఆయన పరోక్షంగా చెబుతున్నారు…

This post was last modified on February 14, 2023 10:12 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

2 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

3 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

4 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

4 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

6 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

7 hours ago