కుర్ర హీరో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా వినరో భాగ్యము విష్ణు కథ ముందు చెప్పిన డేట్ ప్రకారమైతే ఈ నెల 17 విడుదల కావాల్సింది. ఇటీవలే జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అదే విషయం స్పష్టం చేశారు. అయితే కొన్ని పునరాలోచనల తర్వాత ఒక రోజు ఆలస్యంగా అంటే18కి పోస్ట్ పోన్ చేసినట్టుగా తెలిసింది. ఇది మంచి నిర్ణయమే. ఎందుకంటే ధనుష్ సార్ ని సితార సంస్థ గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంది. న్యూట్రల్ గా ఉండే మూవీ లవర్స్ ఒక్కదానికే ఓటు వేసే పక్షంలో ఓపెనింగ్స్ పరంగా రెండింటికీ ఇబ్బందే. పైగా మార్కెట్ పరంగా చూసుకున్నా క్లాష్ కావడం అనవసరమైన రిస్కు.
అఫీషియల్ గా ఇవాళో రేపో చెప్పేస్తారని సమాచారం. కిరణ్ అబ్బవరం దీని మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ఇది చావో రేవో అనే పరిస్థితి. గత ఏడాది మూడు ఫ్లాపులు పలకరించేసరికి దాని ప్రభావం కుర్రాడి మీద గట్టిగా పడింది. సోషల్ మీడియా ట్రోల్స్ సంగతి పక్కనపెడితే కెరీర్ ఎదుగుతున్న దశలో వరస పరాజయాలు పెద్ద స్థాయికి చేరుకోకుండా అడ్డు పడతాయి. అసలే ఆది సాయికుమార్ లాంటి వాళ్ళు కౌంట్ పరంగా ఎన్ని సినిమాలు చేస్తున్నా దాని వల్ల ప్రయోజనం కలగడం లేదు. అందుకే కంటెంట్ కనిపిస్తున్న విష్ణు కథ రిస్క్ తీసుకోకపోవడమే మంచిది.
ఇంతే కాదు గీతా ఆర్ట్స్ నిర్మాణ భాగస్వామ్యంలో రూపొందిన అల వైకుంఠపురములో హిందీ రీమేక్ షెహజాదా 17నే వస్తోంది. అదేమీ తెలుగు రాష్ట్రాల్లో కాంపిటీషన్ కాదు కానీ బిజినెస్ వ్యవహారాలైతే చూసుకోవాల్సి ఉంటుంది. త్వరలో వినరో భాగ్యము విష్ణు కథ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ ని లేదా పవన్ కళ్యాణ్ ని తీసుకొచ్చేందుకు నిర్మాత బన్నీ వాస్ ప్లానింగ్ లో ఉన్నారు. అటుపక్క సార్ ప్రొడ్యూసర్లకు సైతం పవర్ స్టార్ అత్యంత సన్నిహితుడు కావడంతో ఒకరికే వచ్చే ఛాన్స్ ఉంది. ఒక రోజు వాయిదా కిరణ్ కు ఎలాంటి లక్కు తీసుకొస్తుందో చూడాలి.
This post was last modified on February 11, 2023 3:52 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…