కుర్ర హీరో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా వినరో భాగ్యము విష్ణు కథ ముందు చెప్పిన డేట్ ప్రకారమైతే ఈ నెల 17 విడుదల కావాల్సింది. ఇటీవలే జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అదే విషయం స్పష్టం చేశారు. అయితే కొన్ని పునరాలోచనల తర్వాత ఒక రోజు ఆలస్యంగా అంటే18కి పోస్ట్ పోన్ చేసినట్టుగా తెలిసింది. ఇది మంచి నిర్ణయమే. ఎందుకంటే ధనుష్ సార్ ని సితార సంస్థ గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంది. న్యూట్రల్ గా ఉండే మూవీ లవర్స్ ఒక్కదానికే ఓటు వేసే పక్షంలో ఓపెనింగ్స్ పరంగా రెండింటికీ ఇబ్బందే. పైగా మార్కెట్ పరంగా చూసుకున్నా క్లాష్ కావడం అనవసరమైన రిస్కు.
అఫీషియల్ గా ఇవాళో రేపో చెప్పేస్తారని సమాచారం. కిరణ్ అబ్బవరం దీని మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ఇది చావో రేవో అనే పరిస్థితి. గత ఏడాది మూడు ఫ్లాపులు పలకరించేసరికి దాని ప్రభావం కుర్రాడి మీద గట్టిగా పడింది. సోషల్ మీడియా ట్రోల్స్ సంగతి పక్కనపెడితే కెరీర్ ఎదుగుతున్న దశలో వరస పరాజయాలు పెద్ద స్థాయికి చేరుకోకుండా అడ్డు పడతాయి. అసలే ఆది సాయికుమార్ లాంటి వాళ్ళు కౌంట్ పరంగా ఎన్ని సినిమాలు చేస్తున్నా దాని వల్ల ప్రయోజనం కలగడం లేదు. అందుకే కంటెంట్ కనిపిస్తున్న విష్ణు కథ రిస్క్ తీసుకోకపోవడమే మంచిది.
ఇంతే కాదు గీతా ఆర్ట్స్ నిర్మాణ భాగస్వామ్యంలో రూపొందిన అల వైకుంఠపురములో హిందీ రీమేక్ షెహజాదా 17నే వస్తోంది. అదేమీ తెలుగు రాష్ట్రాల్లో కాంపిటీషన్ కాదు కానీ బిజినెస్ వ్యవహారాలైతే చూసుకోవాల్సి ఉంటుంది. త్వరలో వినరో భాగ్యము విష్ణు కథ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ ని లేదా పవన్ కళ్యాణ్ ని తీసుకొచ్చేందుకు నిర్మాత బన్నీ వాస్ ప్లానింగ్ లో ఉన్నారు. అటుపక్క సార్ ప్రొడ్యూసర్లకు సైతం పవర్ స్టార్ అత్యంత సన్నిహితుడు కావడంతో ఒకరికే వచ్చే ఛాన్స్ ఉంది. ఒక రోజు వాయిదా కిరణ్ కు ఎలాంటి లక్కు తీసుకొస్తుందో చూడాలి.
This post was last modified on February 11, 2023 3:52 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…