Political News

జ‌న‌సేన గూటికి వైసీపీ కీల‌క నాయ‌కుడు?

ఏపీలో రాజ‌కీయాల వేడి త‌గ్గ‌డం లేదు. ముఖ్యంగా అధికార పార్టీలో నేత‌ల అసంతృప్తి.. ఎక్క‌డా చ‌ల్లార‌డం లేదు. ఒక‌రు త‌ర్వాత ఒక‌రుగా సెగ‌లు క‌క్కుతూనే ఉన్నారు. నెల్లూరు వివాదం ముగిసిందిలే అనుకునే లోపు మైల‌వ‌రం వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. దీనిని చ‌క్క‌దిద్దారో లేదో.. తెల్లారేస‌రికి ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో పొలిటిక‌ల్ మంట‌లు ఓ రేంజ్‌లో రాజుకున్నాయి. ప్ర‌కాశం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం చీరాల‌.

ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆమంచి కృష్ణ‌మోహ‌న్ , ఆయ‌న సోద‌రుడు స్వాములు ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్నారు. అయితే.. ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమంచికి టికెట్ లేద‌ని.. వైసీపీ తేల్చి చెప్పింది. అయితే.. ఆయ‌న‌కు అన్యాయం చేయ‌కుండా.. ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గానికి పంపించింది. అయితే.. ఇది త‌మ‌కు క‌లిసి వ‌చ్చే నియోజ‌క‌వ‌ర్గం కాద‌ని.. తాము గెలిచే ప‌రిస్థితి లేద‌ని .. ఆమంచి సోద‌రులు చెబుతున్నారు. అయినా.. వైసీపీ అధినేత ప‌ట్టించుకోలేదు.

పైగా.. ఆమంచి ప్ర‌త్య‌ర్థి.. ప్ర‌స్తుత ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాంకు వైసీపీ టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉండ‌డాన్ని ఈ సోద‌రులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా రాజ‌కీయం వేడెక్కించారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో స్వాములు ఉన్న అతి భారీ ఫ్లెక్సీ ఒక‌టి చీరాల సెంట‌ర్‌లో ద‌ర్శ‌న మిచ్చింది. రాత్రికి రాత్రి ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీపై.. మూడో విడ‌త స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం ప్రారంభ‌మ‌వుతుంద‌ని.. యువ‌త పెద్ద ఎత్తున త‌ర‌లిరావాల‌ని.. కూడా రాసి ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఈ ప‌రిణామంతో వైసీపీ నాయ‌కులు ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డ్డారు. అస‌లు ఏం జ‌రుగుతోందో తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. వాస్త‌వానికి కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ఆమంచి బ్ర‌ద‌ర్స్‌కు స్థానికంగా మంచి ప‌ట్టుంది. 2014 ఎన్నిక‌ల్లో ఆమంచి ఇండిపెండెంట్‌గానే పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. అదేవిధంగా.. గ‌త ఏడాది జ‌రిగిన న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల్లో నూ వైసీపీ త‌న వారికి మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోయినా ఇండిపెండెంట్లుగా నిల‌బెట్టి కృష్ణ‌మోహ‌న్ గెలిపించుకున్నారు.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు జ‌న‌సేన ఫ్లెక్సీ వెల‌వ‌డం.. దీనిలో స్వాములు ప‌వ‌న్ ప‌క్క‌నే నిల‌బ‌డి ఉండ‌డం వంటి ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. అన్న‌ద‌మ్ములు రూటు మార్చుకుంటున్నారేమో.. అనే సందేహాల‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్టు అయింది. మ‌రి దీనిపై వైసీపీ ఏం చేస్తుందో చూడాలి. మొత్తానికి ఈ ఫ్లెక్సీ.. రాజ‌కీయంగా వైసీపీని ఒక్కసారిగా కుదిపేసింది.

This post was last modified on February 11, 2023 3:40 pm

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

4 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

5 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

5 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

5 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

7 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

10 hours ago