Political News

జ‌న‌సేన గూటికి వైసీపీ కీల‌క నాయ‌కుడు?

ఏపీలో రాజ‌కీయాల వేడి త‌గ్గ‌డం లేదు. ముఖ్యంగా అధికార పార్టీలో నేత‌ల అసంతృప్తి.. ఎక్క‌డా చ‌ల్లార‌డం లేదు. ఒక‌రు త‌ర్వాత ఒక‌రుగా సెగ‌లు క‌క్కుతూనే ఉన్నారు. నెల్లూరు వివాదం ముగిసిందిలే అనుకునే లోపు మైల‌వ‌రం వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. దీనిని చ‌క్క‌దిద్దారో లేదో.. తెల్లారేస‌రికి ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో పొలిటిక‌ల్ మంట‌లు ఓ రేంజ్‌లో రాజుకున్నాయి. ప్ర‌కాశం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం చీరాల‌.

ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆమంచి కృష్ణ‌మోహ‌న్ , ఆయ‌న సోద‌రుడు స్వాములు ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్నారు. అయితే.. ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమంచికి టికెట్ లేద‌ని.. వైసీపీ తేల్చి చెప్పింది. అయితే.. ఆయ‌న‌కు అన్యాయం చేయ‌కుండా.. ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గానికి పంపించింది. అయితే.. ఇది త‌మ‌కు క‌లిసి వ‌చ్చే నియోజ‌క‌వ‌ర్గం కాద‌ని.. తాము గెలిచే ప‌రిస్థితి లేద‌ని .. ఆమంచి సోద‌రులు చెబుతున్నారు. అయినా.. వైసీపీ అధినేత ప‌ట్టించుకోలేదు.

పైగా.. ఆమంచి ప్ర‌త్య‌ర్థి.. ప్ర‌స్తుత ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాంకు వైసీపీ టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉండ‌డాన్ని ఈ సోద‌రులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా రాజ‌కీయం వేడెక్కించారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో స్వాములు ఉన్న అతి భారీ ఫ్లెక్సీ ఒక‌టి చీరాల సెంట‌ర్‌లో ద‌ర్శ‌న మిచ్చింది. రాత్రికి రాత్రి ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీపై.. మూడో విడ‌త స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం ప్రారంభ‌మ‌వుతుంద‌ని.. యువ‌త పెద్ద ఎత్తున త‌ర‌లిరావాల‌ని.. కూడా రాసి ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఈ ప‌రిణామంతో వైసీపీ నాయ‌కులు ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డ్డారు. అస‌లు ఏం జ‌రుగుతోందో తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. వాస్త‌వానికి కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ఆమంచి బ్ర‌ద‌ర్స్‌కు స్థానికంగా మంచి ప‌ట్టుంది. 2014 ఎన్నిక‌ల్లో ఆమంచి ఇండిపెండెంట్‌గానే పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. అదేవిధంగా.. గ‌త ఏడాది జ‌రిగిన న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల్లో నూ వైసీపీ త‌న వారికి మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోయినా ఇండిపెండెంట్లుగా నిల‌బెట్టి కృష్ణ‌మోహ‌న్ గెలిపించుకున్నారు.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు జ‌న‌సేన ఫ్లెక్సీ వెల‌వ‌డం.. దీనిలో స్వాములు ప‌వ‌న్ ప‌క్క‌నే నిల‌బ‌డి ఉండ‌డం వంటి ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. అన్న‌ద‌మ్ములు రూటు మార్చుకుంటున్నారేమో.. అనే సందేహాల‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్టు అయింది. మ‌రి దీనిపై వైసీపీ ఏం చేస్తుందో చూడాలి. మొత్తానికి ఈ ఫ్లెక్సీ.. రాజ‌కీయంగా వైసీపీని ఒక్కసారిగా కుదిపేసింది.

This post was last modified on February 11, 2023 3:40 pm

Share
Show comments

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago