Political News

జ‌న‌సేన గూటికి వైసీపీ కీల‌క నాయ‌కుడు?

ఏపీలో రాజ‌కీయాల వేడి త‌గ్గ‌డం లేదు. ముఖ్యంగా అధికార పార్టీలో నేత‌ల అసంతృప్తి.. ఎక్క‌డా చ‌ల్లార‌డం లేదు. ఒక‌రు త‌ర్వాత ఒక‌రుగా సెగ‌లు క‌క్కుతూనే ఉన్నారు. నెల్లూరు వివాదం ముగిసిందిలే అనుకునే లోపు మైల‌వ‌రం వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. దీనిని చ‌క్క‌దిద్దారో లేదో.. తెల్లారేస‌రికి ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో పొలిటిక‌ల్ మంట‌లు ఓ రేంజ్‌లో రాజుకున్నాయి. ప్ర‌కాశం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం చీరాల‌.

ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆమంచి కృష్ణ‌మోహ‌న్ , ఆయ‌న సోద‌రుడు స్వాములు ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్నారు. అయితే.. ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమంచికి టికెట్ లేద‌ని.. వైసీపీ తేల్చి చెప్పింది. అయితే.. ఆయ‌న‌కు అన్యాయం చేయ‌కుండా.. ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గానికి పంపించింది. అయితే.. ఇది త‌మ‌కు క‌లిసి వ‌చ్చే నియోజ‌క‌వ‌ర్గం కాద‌ని.. తాము గెలిచే ప‌రిస్థితి లేద‌ని .. ఆమంచి సోద‌రులు చెబుతున్నారు. అయినా.. వైసీపీ అధినేత ప‌ట్టించుకోలేదు.

పైగా.. ఆమంచి ప్ర‌త్య‌ర్థి.. ప్ర‌స్తుత ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాంకు వైసీపీ టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉండ‌డాన్ని ఈ సోద‌రులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా రాజ‌కీయం వేడెక్కించారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో స్వాములు ఉన్న అతి భారీ ఫ్లెక్సీ ఒక‌టి చీరాల సెంట‌ర్‌లో ద‌ర్శ‌న మిచ్చింది. రాత్రికి రాత్రి ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీపై.. మూడో విడ‌త స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం ప్రారంభ‌మ‌వుతుంద‌ని.. యువ‌త పెద్ద ఎత్తున త‌ర‌లిరావాల‌ని.. కూడా రాసి ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఈ ప‌రిణామంతో వైసీపీ నాయ‌కులు ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డ్డారు. అస‌లు ఏం జ‌రుగుతోందో తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. వాస్త‌వానికి కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ఆమంచి బ్ర‌ద‌ర్స్‌కు స్థానికంగా మంచి ప‌ట్టుంది. 2014 ఎన్నిక‌ల్లో ఆమంచి ఇండిపెండెంట్‌గానే పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. అదేవిధంగా.. గ‌త ఏడాది జ‌రిగిన న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల్లో నూ వైసీపీ త‌న వారికి మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోయినా ఇండిపెండెంట్లుగా నిల‌బెట్టి కృష్ణ‌మోహ‌న్ గెలిపించుకున్నారు.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు జ‌న‌సేన ఫ్లెక్సీ వెల‌వ‌డం.. దీనిలో స్వాములు ప‌వ‌న్ ప‌క్క‌నే నిల‌బ‌డి ఉండ‌డం వంటి ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. అన్న‌ద‌మ్ములు రూటు మార్చుకుంటున్నారేమో.. అనే సందేహాల‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్టు అయింది. మ‌రి దీనిపై వైసీపీ ఏం చేస్తుందో చూడాలి. మొత్తానికి ఈ ఫ్లెక్సీ.. రాజ‌కీయంగా వైసీపీని ఒక్కసారిగా కుదిపేసింది.

This post was last modified on February 11, 2023 3:40 pm

Share
Show comments

Recent Posts

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

47 minutes ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

49 minutes ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

2 hours ago

బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు

నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…

3 hours ago

పవన్ ను తిట్టిన ద్వారంపూడి ఇప్పుడు టార్గెట్ అయ్యారా?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయ‌న ప్రాభ‌వాన్ని.. వైభ‌వాన్ని…

3 hours ago

రైటర్ గారు… చేదుగా ఉన్నా నిజమే చెప్పారు

రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

5 hours ago