ఏపీలో రాజకీయాల వేడి తగ్గడం లేదు. ముఖ్యంగా అధికార పార్టీలో నేతల అసంతృప్తి.. ఎక్కడా చల్లారడం లేదు. ఒకరు తర్వాత ఒకరుగా సెగలు కక్కుతూనే ఉన్నారు. నెల్లూరు వివాదం ముగిసిందిలే అనుకునే లోపు మైలవరం వివాదం తెరమీదికి వచ్చింది. దీనిని చక్కదిద్దారో లేదో.. తెల్లారేసరికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పొలిటికల్ మంటలు ఓ రేంజ్లో రాజుకున్నాయి. ప్రకాశం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం చీరాల.
ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆమంచి కృష్ణమోహన్ , ఆయన సోదరుడు స్వాములు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. అయితే.. ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ఆమంచికి టికెట్ లేదని.. వైసీపీ తేల్చి చెప్పింది. అయితే.. ఆయనకు అన్యాయం చేయకుండా.. పరుచూరు నియోజకవర్గానికి పంపించింది. అయితే.. ఇది తమకు కలిసి వచ్చే నియోజకవర్గం కాదని.. తాము గెలిచే పరిస్థితి లేదని .. ఆమంచి సోదరులు చెబుతున్నారు. అయినా.. వైసీపీ అధినేత పట్టించుకోలేదు.
పైగా.. ఆమంచి ప్రత్యర్థి.. ప్రస్తుత ఎమ్మెల్యే కరణం బలరాంకు వైసీపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉండడాన్ని ఈ సోదరులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రాజకీయం వేడెక్కించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో స్వాములు ఉన్న అతి భారీ ఫ్లెక్సీ ఒకటి చీరాల సెంటర్లో దర్శన మిచ్చింది. రాత్రికి రాత్రి ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీపై.. మూడో విడత సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని.. యువత పెద్ద ఎత్తున తరలిరావాలని.. కూడా రాసి ఉండడం గమనార్హం.
ఈ పరిణామంతో వైసీపీ నాయకులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అసలు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి కాపు సామాజిక వర్గానికి చెందిన ఆమంచి బ్రదర్స్కు స్థానికంగా మంచి పట్టుంది. 2014 ఎన్నికల్లో ఆమంచి ఇండిపెండెంట్గానే పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. అదేవిధంగా.. గత ఏడాది జరిగిన నగర పాలక సంస్థ ఎన్నికల్లో నూ వైసీపీ తన వారికి మద్దతు ఇవ్వకపోయినా ఇండిపెండెంట్లుగా నిలబెట్టి కృష్ణమోహన్ గెలిపించుకున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు జనసేన ఫ్లెక్సీ వెలవడం.. దీనిలో స్వాములు పవన్ పక్కనే నిలబడి ఉండడం వంటి పరిణామాలను గమనిస్తే.. అన్నదమ్ములు రూటు మార్చుకుంటున్నారేమో.. అనే సందేహాలకు అవకాశం ఇచ్చినట్టు అయింది. మరి దీనిపై వైసీపీ ఏం చేస్తుందో చూడాలి. మొత్తానికి ఈ ఫ్లెక్సీ.. రాజకీయంగా వైసీపీని ఒక్కసారిగా కుదిపేసింది.
గొడవలు కానీ మనస్పర్థలతో కానీ భార్యతో భర్త మాట్లాడకపోవటం గృహ హింస కిందకు వస్తుందా? మాట్లాడకుండా ఉండటం వేధింపులకు గురి…
‘బాహుబలి’కి ముందు ప్రభాస్ కెరీర్లో అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘రెబల్’ ఒకటి. కింగ్ నాగార్జునతో ‘మాస్’ లాంటి బ్లాక్…
అదేంటి లెనిన్ మీద మెగా ఫ్యాన్స్ కి కోపం ఎందుకు వస్తుందనుకుంటున్నారా. మ్యాటర్ ఉంది లెండి. కొంచెం ఫ్లాష్ బ్యాక్…
రెండో సినిమా మగధీరతోనే తాను తండ్రికి తగ్గ తనయుడిని అని చాటుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక…
ఏపీ ప్రభుత్వానికి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు కూడా ఓ కేసు సవాల్గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…
ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…