మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో ఇప్పటిదాకా ఐదు సినిమాల్లో నటిస్తే అందులో రెండు రీమేక్లు. అసలాయన రీఎంట్రీనే రీమేక్ మూవీ అయిన ‘ఖైదీ నంబర్ 150’తో జరిగింది. దాని తర్వాత రెండు స్ట్రెయిట్ మూవీస్ చేసి.. మళ్లీ రీమేక్లో నటించాడు. అదే ‘గాడ్ ఫాదర్’. తాజాగా ‘వాల్తేరు వీరయ్య’తో పెద్ద హిట్ కొట్టిన చిరు.. దీని తర్వాత చేస్తున్న ‘భోళా శంకర్’ రీమేకే అన్న సంగతి తెలిసిందే.
ఓటీటీల హవా పెరిగిపోయి అన్ని భాషల చిత్రాలనూ అందరూ చూసేస్తున్న ఈ రోజుల్లో రీమేక్ల పట్ల ఆసక్తి అంతకంతకూ తగ్గిపోతోంది. స్వయంగా ఆయా హీరోల అభిమానులే రీమేక్లు వద్దు మొర్రో అనేస్తున్నారు. అందులోనూ ‘వేదాళం’ లాంటి రొటీన్ మాస్ మూవీని.. మెహర్ రమేష్ లాంటి లైమ్ లైట్లో లేని దర్శకుడితో రీమేక్ చేస్తుండడంతో చిరు అభిమానులు కూడా ఈ సినిమా పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. ఈ సినిమాను ఆపేస్తే బావుండన్న ఫీలింగ్ చాలామందిలో ఉంది.
‘భోళా శంకర్’ పరిస్థితి ఇలా ఉంటే.. చిరు కొత్తగా ఇంకో రీమేక్ను లైన్లో పెడుతున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ‘వేదాళం’ హీరో అజిత్, దాని దర్శకుడు శివ కలిసి చేసిన మరో చిత్రం ‘విశ్వాసం’ను కూడా చిరు రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు జోరుగా వార్తలొస్తున్నాయి. కానీ తెలుగులో అనువాదం అయి తరచుగా టీవీలో ప్రసారం అవుతున్న సినిమాను రీమేక్ చేయడం ఏంటనే చర్చ మొదలైంది. ఎప్పట్లాగే అభిమానులే ఈ సినిమా వద్దంటూ అభ్యంతరాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. కానీ ఎవరు ఈ వార్త పుట్టించారో ఏమో కానీ.. అందులో ఏమాత్రం వాస్తవం లేదన్నది మెగా కాంపౌండ్ సమాచారం. పీఆర్వోలు ఈ వార్తను ఖండించారు. చిరుకు ఈ సినిమాను రీమేక్ చేసే ఉద్దేశం ఎంతమాత్రం లేదని తేల్చేశారు.
‘గాడ్ ఫాదర్’ నిరాశ పరిచాక స్ట్రెయిట్ మూవీ అయిన ‘వాల్తేరు వీరయ్య’తో అంత పెద్ద హిట్ కొట్టిన చిరు.. ఈ రోజుల్లో రీమేక్లు చేయడం అంత సబబు కాదని బాగానే అర్థం చేసుకున్నారని.. ఆల్రెడీ కమిటై ఉండడం వల్ల ‘భోళా శంకర్’ పూర్తి చేయక తప్పదని.. దీని తర్వాత చిరు సమీప భవిష్యత్తులో రీమేక్లు చేయదల్చుకోలేదని.. అందులోనూ రొటీన్ మాస్ సినిమాల రీమేక్లు అసలే వద్దని ఆయన భావిస్తున్నారని సమాచారం.
This post was last modified on January 20, 2023 6:49 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…