మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో ఇప్పటిదాకా ఐదు సినిమాల్లో నటిస్తే అందులో రెండు రీమేక్లు. అసలాయన రీఎంట్రీనే రీమేక్ మూవీ అయిన ‘ఖైదీ నంబర్ 150’తో జరిగింది. దాని తర్వాత రెండు స్ట్రెయిట్ మూవీస్ చేసి.. మళ్లీ రీమేక్లో నటించాడు. అదే ‘గాడ్ ఫాదర్’. తాజాగా ‘వాల్తేరు వీరయ్య’తో పెద్ద హిట్ కొట్టిన చిరు.. దీని తర్వాత చేస్తున్న ‘భోళా శంకర్’ రీమేకే అన్న సంగతి తెలిసిందే.
ఓటీటీల హవా పెరిగిపోయి అన్ని భాషల చిత్రాలనూ అందరూ చూసేస్తున్న ఈ రోజుల్లో రీమేక్ల పట్ల ఆసక్తి అంతకంతకూ తగ్గిపోతోంది. స్వయంగా ఆయా హీరోల అభిమానులే రీమేక్లు వద్దు మొర్రో అనేస్తున్నారు. అందులోనూ ‘వేదాళం’ లాంటి రొటీన్ మాస్ మూవీని.. మెహర్ రమేష్ లాంటి లైమ్ లైట్లో లేని దర్శకుడితో రీమేక్ చేస్తుండడంతో చిరు అభిమానులు కూడా ఈ సినిమా పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. ఈ సినిమాను ఆపేస్తే బావుండన్న ఫీలింగ్ చాలామందిలో ఉంది.
‘భోళా శంకర్’ పరిస్థితి ఇలా ఉంటే.. చిరు కొత్తగా ఇంకో రీమేక్ను లైన్లో పెడుతున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ‘వేదాళం’ హీరో అజిత్, దాని దర్శకుడు శివ కలిసి చేసిన మరో చిత్రం ‘విశ్వాసం’ను కూడా చిరు రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు జోరుగా వార్తలొస్తున్నాయి. కానీ తెలుగులో అనువాదం అయి తరచుగా టీవీలో ప్రసారం అవుతున్న సినిమాను రీమేక్ చేయడం ఏంటనే చర్చ మొదలైంది. ఎప్పట్లాగే అభిమానులే ఈ సినిమా వద్దంటూ అభ్యంతరాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. కానీ ఎవరు ఈ వార్త పుట్టించారో ఏమో కానీ.. అందులో ఏమాత్రం వాస్తవం లేదన్నది మెగా కాంపౌండ్ సమాచారం. పీఆర్వోలు ఈ వార్తను ఖండించారు. చిరుకు ఈ సినిమాను రీమేక్ చేసే ఉద్దేశం ఎంతమాత్రం లేదని తేల్చేశారు.
‘గాడ్ ఫాదర్’ నిరాశ పరిచాక స్ట్రెయిట్ మూవీ అయిన ‘వాల్తేరు వీరయ్య’తో అంత పెద్ద హిట్ కొట్టిన చిరు.. ఈ రోజుల్లో రీమేక్లు చేయడం అంత సబబు కాదని బాగానే అర్థం చేసుకున్నారని.. ఆల్రెడీ కమిటై ఉండడం వల్ల ‘భోళా శంకర్’ పూర్తి చేయక తప్పదని.. దీని తర్వాత చిరు సమీప భవిష్యత్తులో రీమేక్లు చేయదల్చుకోలేదని.. అందులోనూ రొటీన్ మాస్ సినిమాల రీమేక్లు అసలే వద్దని ఆయన భావిస్తున్నారని సమాచారం.
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…