తమిళనాట ఫ్యాన్ వార్స్ అనే మాటెత్తగానే గుర్తుకొచ్చేది విజయ్, అజిత్ అభిమానులే. ఆఫ్ లైన్లో, ఆన్ లైన్లో వీళ్ల గొడవలు మామూలుగా ఉండవు. ఒకప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ది తమిళనాడు బాక్సాఫీస్లో ఏకఛత్రాధిపత్యంగా ఉన్నంత వరకు పరిస్థితి బాగానే ఉండేది.
కానీ ఆయన జోరు తగ్గిపోయి నంబర్ వన్ స్థానానికి విజయ్, అజిత్ అభిమానుల మధ్య పోటీ మొదలయ్యాక కథ మారిపోయింది. మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప అంటూ ఎవరికి వాళ్లు ఎలివేషన్లు ఇచ్చుకోవడం.. రికార్డుల కోసం కొట్టేసుకోవడం.. ఫేక్ కలెక్షన్లు వేయడం.. అవతలి హీరోను డీగ్రేడ్ చేయడం లాంటివి శ్రుతి మించిపోయాయి.
వేర్వేరు సమయాల్లో ఈ ఇద్దరు హీరోలు రిలీజైనా సరే.. తమ హీరోదే ఆధిపత్యం అని ప్రూవ్ చేయడానికి అభిమానులు వెయ్యాల్సిన ఎత్తులన్నీ వేస్తుంటారు. అలాంటిది ఇద్దరు హీరోల సినిమాలు ఒకేసారి రిలీజైతే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సంక్రాంతి కానుకగా ఒకే రోజు విజయ్ సినిమా ‘వారిసు’, అజిత్ మూవీ ‘తునివు’ రిలీజైన సంగతి తెలిసిందే.
విడుదలకు కొన్ని నెలల ముందే కొట్టేసుకుంటూ వచ్చిన విజయ్, అజిత్ ఫ్యాన్స్.. రిలీజ్ రోజు ఇంకా రెచ్చిపోయారు. తమ హీరో సినిమా సూపర్ అని చెప్పడం ఒకెత్తయితే.. అవతలి హీరో సినిమా వేస్ట్ అని డీగ్రేడ్ చేయడం మరో ఎత్తు.
ఇక కలెక్షన్ల విషయంలోనూ ఎవ్వరూ తగ్గట్లేదు. కింగ్ ఆఫ్ ఓపెనింగ్ అని అజిత్కు ఒకరు ఎలివేషన్ ఇస్తే.. కింగ్ ఆఫ్ కోలీవుడ్ అంటూ అవతలి వాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్రెండ్ చేస్తున్నారు. కలెక్షన్ల విషయంలో ఎవ్వరూ తగ్గట్లేదు. తొలి రోజు తమిళనాడులో అజిత్ మూవీని నంబర్ వన్ అని అతడి ఫ్యాన్స్ క్లెయిమ్ చేసుకుంటుంటే.. ఓవరాల్ రికార్డు తమ హీరోదే అని విజయ్ ఫ్యాన్స్ అంటున్నారు.
మొత్తంగా మా హీరోది రికార్డంటే మా హీరోది రికార్డు అంటూ సోషల్ మీడియాలో తెగ కొట్టేసుకుంటున్నారు. వీరి గొడవలకు ఆజ్యం పోస్తూ పీఆర్వోలు కూడా రెండుగా విడిపోయి ఆయా హీరోలకు ఎలివేషన్లు ఇస్తూ.. రికార్డుల ముచ్చట్లు చెబుతున్నారు. మొత్తంగా నెవర్ బిఫోర్ అన్న స్థాయిలో కోలీవుడ్లో ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి ఈ సంక్రాంతికి.
This post was last modified on January 12, 2023 9:48 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…