సంక్రాంతి బరిలో నిలిచిన బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ కి తమన్ మ్యూజిక్ కంపోజర్ అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సాంగ్స్ బయటికొచ్చేశాయి. ఇంకా రెండు బిట్ సాంగ్స్ రాబోతున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంతవరకూ తమన్ ఒక్క ఈవెంట్ కి కూడా హాజరవ్వలేదు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా డుమ్మా కొట్టాడు. దీంతో తమన్ హై ఇచ్చే స్పీచ్ బాలయ్య ఫ్యాన్స్ మిస్ అవుతున్నారు. ఇక మాస్ మొగుడు సాంగ్ లాంచ్ లో అయిన తమన్ కనిపిస్తాడాని ఆశిస్తే అక్కడ కూడా వీర సింహా రెడ్డి టీమే కనిపించింది.
సాంగ్ లాంచ్ ఈవెంట్ లో మా బావ తమన్ ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నాడు. చిన్న కరెక్షన్ చెప్పాను ఆ వర్క్ మీదే ఉన్నాడు అంటూ గోపీచంద్ చెప్పుకొచ్చాడు. దీంతో తమన్ ‘వీర సింహా రెడ్డి’ ఫైనల్ వర్క్ తో ఇంకా బిజీగా ఉన్నాడని బాలయ్య ఫ్యాన్స్ అర్థం చేసుకున్నారు.
ఏదేమైనా తమన్ కి ఈ సంక్రాంతి చాలా టఫ్ ఇచ్చింది. ఇటు ‘వీర సింహా రెడ్డి’ అటు ‘వారిసు’ మ్యూజిక్ వర్క్స్ రెండు బ్యాలెన్స్ చేస్తూ మధ్యలో మిగిలిన సినిమాలకి మ్యూజిక్ ఇస్తూ మేనేజ్ చేశాడు.
తాజాగా ఒకే స్టూడియోలో ‘వారిసు’ , ‘వీర సింహా రెడ్డి’ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తూ రెండు పోస్టులు కూడా పెట్టాడు. సో డబుల్ ఒత్తిడితో వీర సింహా రెడ్డి ఈవెంట్స్ కి డుమ్మా కొట్టిన తమన్ రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్ లో బాలయ్య గురించి గోపీచంద్ వర్క్ గురించి గట్టిగా చెప్పే ఛాన్స్ ఉంది.
రాధే శ్యామ్ సినిమా టైమ్ లో కూడా తన బిజీ షెడ్యూల్ లో రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ లో కనిపించకుండా పోస్ట్ రిలీజ్ కి మీడియా ముందుకొచ్చి తన వంతుగా ప్రమోట్ చేసే ప్రయత్నం చేశాడు తమన్. వీర సింహా రెడ్డి విషయంలో అదే రిపీట్ చేసే ఛాన్స్ ఉంది.
This post was last modified on January 10, 2023 10:18 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…