వారసుడు.. సంక్రాంతి రాబోతున్న కొత్త చిత్రం. బేసిగ్గా తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులోనూ భారీ స్థాయిలోనే విడుదలవుతోంది. మామూలుగా అయితే తమిళ అనువాదాలు సంక్రాంతికి నామమాత్రంగా రిలీజవుతుంటాయి. రజినీకాంత్, సూర్య లాంటి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోలకు కూడా ఆ టైంలో ఇక్కడ కష్టమే. కానీ విజయ్కి ఇక్కడ సరైన ఫాలోయింగ్ లేకపోయినా.. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కడం వల్ల డబ్బింగ్ వెర్షన్ను పెద్ద ఎత్తున విడుదల చేయగలుగుతున్నారు.
ఈ విఫయంలో దిల్ రాజు ఎంత వ్యతిరేకత, విమర్శలు ఎదుర్కొంటున్నారో తెలిసిందే. ఈ సినిమా ఫలితం అటు ఇటు అయితే దిల్ రాజు సోషల్ మీడియాకు మామూలుగా టార్గెట్ అవ్వడు. ఈ సినిమాకా ఆయన ఇంత ప్రయారిటీ ఇచ్చాడు.. అన్ని థియేటర్లు ఇచ్చుకున్నాడు.. వంద కోట్ల పారితోషకం ఇచ్చి, భారీ బడ్జెట్ పెట్టి తీసిన సినిమా ఇదా అంటూ ఆయన్ని గట్టిగా టార్గెట్ చేయడం ఖాయం.
థియేటర్ల గొడవ పుణ్యమా అని ‘వారసుడు’ సినిమా మీద ఎక్కడ లేని ఫోకస్ ఏర్పడింది. సినిమా చూడాలన్న కుతూహలం కంటే.. ఆ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలన్న ఆత్రుత అందరిలోనూ వ్యక్తమైంది. చిరు, బాలయ్యల సినిమాలకు థియేటర్లు తక్కువ ఇచ్చి ‘వారసుడు’కు ఎక్కువ కేటాయిస్తున్నారు.. మంచి మంచి స్క్రీన్లు దానికి ఇచ్చేస్తున్నారు అన్న వార్తల్ని ఆ హీరోల అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో మొత్తంగా మెగా, నందమూరి అభిమానులు దిల్ రాజు సినిమా మీద కక్షగట్టేసే పరిస్థితి వచ్చింది.
దిల్ రాజు ఎంత సమర్థించుకున్నా సరే.. ఆయన వాదన ఎవరికీ కరెక్ట్ అనిపించడం లేదు. ఆయన తెలుగు సినిమాలకు అన్యాయం చేస్తున్నారనే భావన బలంగా జనాల్లోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ‘వారసుడు’ రిలీజ్ టైంలో సోషల్ మీడియా జనాలు ఆ సినిమా పని పట్టేందుకు చూస్తారనడంలో సందేహం లేదు. సినిమా కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే.. విపరీతమైన నెగెటివ్ ప్రచారం జరగడం.. ఈ సినిమా చూడొద్దని ట్రెండ్స్ జరగడం ఖాయం.మరి ఈ నెగెటివిటీని తట్టుకుని ‘వారసుడు’ ఎంతమాత్రం నిలబడుతుందో చూడాలి.
This post was last modified on January 3, 2023 10:49 pm
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…