వారసుడు.. సంక్రాంతి రాబోతున్న కొత్త చిత్రం. బేసిగ్గా తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులోనూ భారీ స్థాయిలోనే విడుదలవుతోంది. మామూలుగా అయితే తమిళ అనువాదాలు సంక్రాంతికి నామమాత్రంగా రిలీజవుతుంటాయి. రజినీకాంత్, సూర్య లాంటి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోలకు కూడా ఆ టైంలో ఇక్కడ కష్టమే. కానీ విజయ్కి ఇక్కడ సరైన ఫాలోయింగ్ లేకపోయినా.. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కడం వల్ల డబ్బింగ్ వెర్షన్ను పెద్ద ఎత్తున విడుదల చేయగలుగుతున్నారు.
ఈ విఫయంలో దిల్ రాజు ఎంత వ్యతిరేకత, విమర్శలు ఎదుర్కొంటున్నారో తెలిసిందే. ఈ సినిమా ఫలితం అటు ఇటు అయితే దిల్ రాజు సోషల్ మీడియాకు మామూలుగా టార్గెట్ అవ్వడు. ఈ సినిమాకా ఆయన ఇంత ప్రయారిటీ ఇచ్చాడు.. అన్ని థియేటర్లు ఇచ్చుకున్నాడు.. వంద కోట్ల పారితోషకం ఇచ్చి, భారీ బడ్జెట్ పెట్టి తీసిన సినిమా ఇదా అంటూ ఆయన్ని గట్టిగా టార్గెట్ చేయడం ఖాయం.
థియేటర్ల గొడవ పుణ్యమా అని ‘వారసుడు’ సినిమా మీద ఎక్కడ లేని ఫోకస్ ఏర్పడింది. సినిమా చూడాలన్న కుతూహలం కంటే.. ఆ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలన్న ఆత్రుత అందరిలోనూ వ్యక్తమైంది. చిరు, బాలయ్యల సినిమాలకు థియేటర్లు తక్కువ ఇచ్చి ‘వారసుడు’కు ఎక్కువ కేటాయిస్తున్నారు.. మంచి మంచి స్క్రీన్లు దానికి ఇచ్చేస్తున్నారు అన్న వార్తల్ని ఆ హీరోల అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో మొత్తంగా మెగా, నందమూరి అభిమానులు దిల్ రాజు సినిమా మీద కక్షగట్టేసే పరిస్థితి వచ్చింది.
దిల్ రాజు ఎంత సమర్థించుకున్నా సరే.. ఆయన వాదన ఎవరికీ కరెక్ట్ అనిపించడం లేదు. ఆయన తెలుగు సినిమాలకు అన్యాయం చేస్తున్నారనే భావన బలంగా జనాల్లోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ‘వారసుడు’ రిలీజ్ టైంలో సోషల్ మీడియా జనాలు ఆ సినిమా పని పట్టేందుకు చూస్తారనడంలో సందేహం లేదు. సినిమా కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే.. విపరీతమైన నెగెటివ్ ప్రచారం జరగడం.. ఈ సినిమా చూడొద్దని ట్రెండ్స్ జరగడం ఖాయం.మరి ఈ నెగెటివిటీని తట్టుకుని ‘వారసుడు’ ఎంతమాత్రం నిలబడుతుందో చూడాలి.
This post was last modified on January 3, 2023 10:49 pm
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కేరళకు కూడా విస్తరించింది. తాజాగా ఆ పార్టీ విస్తరణపై…
చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు తమ సోషల్ మీడియా అకౌంట్లను సబ్స్క్రిప్షన్ మోడ్లోకి మార్చి, వాటి ద్వారా హాట్…
టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా…
రాకా.. ప్రస్తుతం ఇండియాలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటి. పుష్ప-2 లాంటి సెన్సేషనల్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్…
పదహారు సంవత్సరాల క్రితం 2010లో విడుదలైన డార్లింగ్ అంటే ప్రభాస్ అభిమానులకు ఒక స్పెషల్ ఎమోషన్. మాస్ ఫార్ములాకు దూరంగా…