వారసుడు.. సంక్రాంతి రాబోతున్న కొత్త చిత్రం. బేసిగ్గా తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులోనూ భారీ స్థాయిలోనే విడుదలవుతోంది. మామూలుగా అయితే తమిళ అనువాదాలు సంక్రాంతికి నామమాత్రంగా రిలీజవుతుంటాయి. రజినీకాంత్, సూర్య లాంటి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోలకు కూడా ఆ టైంలో ఇక్కడ కష్టమే. కానీ విజయ్కి ఇక్కడ సరైన ఫాలోయింగ్ లేకపోయినా.. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కడం వల్ల డబ్బింగ్ వెర్షన్ను పెద్ద ఎత్తున విడుదల చేయగలుగుతున్నారు.
ఈ విఫయంలో దిల్ రాజు ఎంత వ్యతిరేకత, విమర్శలు ఎదుర్కొంటున్నారో తెలిసిందే. ఈ సినిమా ఫలితం అటు ఇటు అయితే దిల్ రాజు సోషల్ మీడియాకు మామూలుగా టార్గెట్ అవ్వడు. ఈ సినిమాకా ఆయన ఇంత ప్రయారిటీ ఇచ్చాడు.. అన్ని థియేటర్లు ఇచ్చుకున్నాడు.. వంద కోట్ల పారితోషకం ఇచ్చి, భారీ బడ్జెట్ పెట్టి తీసిన సినిమా ఇదా అంటూ ఆయన్ని గట్టిగా టార్గెట్ చేయడం ఖాయం.
థియేటర్ల గొడవ పుణ్యమా అని ‘వారసుడు’ సినిమా మీద ఎక్కడ లేని ఫోకస్ ఏర్పడింది. సినిమా చూడాలన్న కుతూహలం కంటే.. ఆ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలన్న ఆత్రుత అందరిలోనూ వ్యక్తమైంది. చిరు, బాలయ్యల సినిమాలకు థియేటర్లు తక్కువ ఇచ్చి ‘వారసుడు’కు ఎక్కువ కేటాయిస్తున్నారు.. మంచి మంచి స్క్రీన్లు దానికి ఇచ్చేస్తున్నారు అన్న వార్తల్ని ఆ హీరోల అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో మొత్తంగా మెగా, నందమూరి అభిమానులు దిల్ రాజు సినిమా మీద కక్షగట్టేసే పరిస్థితి వచ్చింది.
దిల్ రాజు ఎంత సమర్థించుకున్నా సరే.. ఆయన వాదన ఎవరికీ కరెక్ట్ అనిపించడం లేదు. ఆయన తెలుగు సినిమాలకు అన్యాయం చేస్తున్నారనే భావన బలంగా జనాల్లోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ‘వారసుడు’ రిలీజ్ టైంలో సోషల్ మీడియా జనాలు ఆ సినిమా పని పట్టేందుకు చూస్తారనడంలో సందేహం లేదు. సినిమా కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే.. విపరీతమైన నెగెటివ్ ప్రచారం జరగడం.. ఈ సినిమా చూడొద్దని ట్రెండ్స్ జరగడం ఖాయం.మరి ఈ నెగెటివిటీని తట్టుకుని ‘వారసుడు’ ఎంతమాత్రం నిలబడుతుందో చూడాలి.
This post was last modified on January 3, 2023 10:49 pm
ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా విషయాల మీద వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. సింగల్ స్క్రీన్లకు పర్సెంటెజ్ ఇవ్వడం, పేరు మోసిన…
అల.. వైకుంఠపురములో.. తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిందనుకున్న టైమ్లో వరుస డిజాస్టర్లు పూజా కెరీర్ని రివర్స్లో తిప్పేశాయి. రాధేశ్యామ్,…
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…