ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. నెలలో రెండు మూడు బడా సినిమాలు రీ రిలీజ్ ల రూపంలో ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. అయితే వీటిలో స్టార్ హీరోల సినిమాలకు థియేటర్స్ లో భారీ రెస్పాన్స్ వస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా ఎవరూ ఊహించని విధంగా మొదటి రోజు మూడున్నర కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, పోకిరి , జల్సా రికార్డ్ ను అలవోకగా క్రాస్ చేసి న్యూ రికార్డ్ క్రియేట్ చేసింది.
దీంతో ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ కి పవన్ ఫ్యాన్స్ ఓ టార్గెట్ ఫిక్స్ చేసినట్టైంది. ఖుషి కేవలం పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు మూవీ లవర్స్ అంతా గట్టిగా చూశారు. ఇంకా చూస్తూనే ఉన్నారు. ఈ సినిమాను చూసేందుకు సాధారణ ప్రేక్షకుడు కూడా ఆసక్తి కనబరిచాడు. ఇప్పుడు ఒక్కడు, ఖుషి డే వన్ రికార్డ్ ని కొట్టాలంటే మాత్రం మహేష్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా థియేటర్స్ కి రావాల్సి ఉంది. ఇంతకు ముందు మహేష్ బర్త్ డే కి ‘ ఒక్కడు’ షోలు పడ్డాయి. కానీ లిమిటెడ్ షోస్ వేశారు. మహేష్ ఫ్యాన్స్ ఆ టైమ్ లో పోకిరి మీద ఫోకస్ పెట్టడంతో ఒక్కడు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది.
ఇప్పుడు జనవరి 7న ఒక్కడు మళ్ళీ థియేటర్స్ లోకి రాబోతుంది. ఈసారి భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. వారం రోజుల పాటు అంటే సంక్రాంతి వరకు సినిమా ఆడనుంది. మరి ఈ ఒక్కడు నీ సైన్యమై అంటూ పవన్ దిమ్మ తిరిగే రికార్డ్ ను మహేష్ క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాడా? చూడాలి.
This post was last modified on January 3, 2023 1:01 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…