మొత్తానికి కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతే నిజమని తేలింది. ‘రాధేశ్యామ్’ తర్వాత ప్రభాస్ నటించబోయే కొత్త చిత్రంలో దీపికా పదుకొనేనే కథానాయికగా ఖరారైంది. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది.
బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన దీపిక.. ‘బాహుబలి’తో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన ప్రభాస్ పక్కన కథానాయిక అనగానే అందరిలోనూ ఎగ్జైట్మెంట్ కనిపిస్తోంది. ఈ అప్డేట్తో సినిమా స్థాయి ఇంకా పెరిగింది.
ఐతే ఈ చిత్రంతోనే దీపిక తెలుగులోకి అడుగు పెడుతోందని అంతా అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. ఆమె టాలీవుడ్ అరంగేట్రం ఎప్పుడో జరిగిపోయింది.
ఒకప్పటి స్టార్ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ కోసం ఓ తెలుగు సినిమాకు పని చేసింది దీపిక. ఆయనకు దీపిక క్లోజ్. జయంత్ దర్శకత్వంలో ‘లవ్ ఫర్ ఎవర్’ అనే సినిమా తెరకెక్కగా.. అందులో దీపిక ఓ ఐటెం సాంగ్ చేసింది. దీనికి సంబంధించి స్టిల్స్ కూడా బయటికి వచ్చాయి. కానీ ఎందుకో ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు.
దీపిక తెలుగు పాటను చూసే అవకాశం ఎవరికీ దక్కలేదు. ఆ తర్వాత జయంత్ దర్శకత్వంలోనే తెరకెక్కిన ‘తీన్ మార్’ సినిమాలో ఓ పాటలో దీపికతో స్టెప్పులు వేయిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాలేదు. ఆ సంగతలా వదిలేస్తే ఇప్పుడు ప్రభాస్ లాంటి పెద్ద హీరో సరసన పాన్ ఇండియా మూవీ ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. దీపిక తన మాతృభాష అయిన కన్నడలో ఇప్పటికే నటించింది.
This post was last modified on July 20, 2020 7:16 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…