మొత్తానికి కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతే నిజమని తేలింది. ‘రాధేశ్యామ్’ తర్వాత ప్రభాస్ నటించబోయే కొత్త చిత్రంలో దీపికా పదుకొనేనే కథానాయికగా ఖరారైంది. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది.
బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన దీపిక.. ‘బాహుబలి’తో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన ప్రభాస్ పక్కన కథానాయిక అనగానే అందరిలోనూ ఎగ్జైట్మెంట్ కనిపిస్తోంది. ఈ అప్డేట్తో సినిమా స్థాయి ఇంకా పెరిగింది.
ఐతే ఈ చిత్రంతోనే దీపిక తెలుగులోకి అడుగు పెడుతోందని అంతా అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. ఆమె టాలీవుడ్ అరంగేట్రం ఎప్పుడో జరిగిపోయింది.
ఒకప్పటి స్టార్ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ కోసం ఓ తెలుగు సినిమాకు పని చేసింది దీపిక. ఆయనకు దీపిక క్లోజ్. జయంత్ దర్శకత్వంలో ‘లవ్ ఫర్ ఎవర్’ అనే సినిమా తెరకెక్కగా.. అందులో దీపిక ఓ ఐటెం సాంగ్ చేసింది. దీనికి సంబంధించి స్టిల్స్ కూడా బయటికి వచ్చాయి. కానీ ఎందుకో ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు.
దీపిక తెలుగు పాటను చూసే అవకాశం ఎవరికీ దక్కలేదు. ఆ తర్వాత జయంత్ దర్శకత్వంలోనే తెరకెక్కిన ‘తీన్ మార్’ సినిమాలో ఓ పాటలో దీపికతో స్టెప్పులు వేయిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాలేదు. ఆ సంగతలా వదిలేస్తే ఇప్పుడు ప్రభాస్ లాంటి పెద్ద హీరో సరసన పాన్ ఇండియా మూవీ ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. దీపిక తన మాతృభాష అయిన కన్నడలో ఇప్పటికే నటించింది.
This post was last modified on July 20, 2020 7:16 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…