తెలుగు వారి ఓటీటీ ఆహా మూడేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ జరగనిది గురువారం రాత్రి జరిగింది. ఒక్కసారిగా ట్రాఫిక్ పెరిగిపోయి ఆహా సర్వర్ డౌన్ అయిపోయింది. కొన్ని గంటల పాటు యాప్ ఓపెన్ కాలేదు. ఉన్నట్లుండి ఈ డిమాండ్ ఏంటి.. సర్వర్ డౌన్ అయ్యేలాగా ఏం జరిగిపోయింది అంటే.. అదంతా ప్రభాస్ అభిమానుల పుణ్యమే. నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీ కోసం చేస్తున్న సూపర్ హిట్ టాక్ షో ‘అన్ స్టాపబుల్’ రెండో సీజన్ కోసం ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అయిన ప్రభాస్ వచ్చాడు.
ప్రభాస్ తెర మీద చాలా సందడి చేస్తాడు కానీ.. బయట మాట్లాడ్డం చాలా తక్కువ. సినిమా వేడుకల్లో కూడా విపరీతంగా మొహమాట పడతాడు. మొక్కుబడిగా నాలుగు ముక్కలు మాట్లాడేసి వెళ్లిపోతాడు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా తక్కువ. సోషల్ గ్యాదరింగ్స్ కూడా తక్కువే. దీంతో అతడి వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం అందరిలోనూ ఉంది.
‘అన్స్టాపబుల్’లో ప్రభాస్ ఎపిసోడ్ చూశాక ఆహా సర్వర్ డౌన్ అవడంలో ఆశ్చర్యం లేదనిపిస్తుంది. అంత ఆసక్తికరంగా, ఉత్సాహంగా సాగింది ఎపిసోడ్. ‘అన్ స్టాపబుల్’లో వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించేలా ఈ ఎపిసోడ్ను నడిపించారు బాలయ్య, ప్రభాస్.
స్వతహాగా ప్రభాస్ అంటే నో నాన్సెన్స్ పర్సన్. ఎంత ఎదిగినా ఆ అహంకారం కనిపించదు. ఎవరినీ తక్కువ చేసి మాట్లాడడు. ఎవరినీ పల్లెత్తు మాట అనడు. ఎక్కువ హంగామా, షో చేయడు. కొందరు మంచి వాళ్లలా నటిస్తున్నా.. అసలు స్వరూపం బయటికి కనిపించేస్తుంటుంది. బిల్డప్ మామూలుగా ఉండదు. ఇలాంటి టాక్ షోలకు వచ్చారన్న మాటే కానీ.. ఓపెన్గా ఉండరు. కానీ ప్రభాస్ అలా కాదు. అతడిలో ఒక నిజాయితీ కనిపిస్తుంది. ప్రభాస్ మంచోడు అనే విషయం స్పష్టంగా తెలిసిపోతుంటుంది. ఎంత పెద్ద పాన్ ఇండియా స్టార్ అయినా కూడా ఒక మామూలు వ్యక్తిలా బాలయ్యతో సరదాగా గడిపిన, మాట్లాడిన తీరు ప్రభాస్ అభిమానులకే కాదు.. మిగతా వాళ్లకు కూడా తెగ నచ్చేసింది. ఇంత పాజిటివిటీ ఉన్న హీరోలు చాలా అరుదుగా కనిపిస్తారు.
This post was last modified on December 30, 2022 9:03 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…