తమిళంలో ప్రస్తుతం ఎవరు నంబర్ వన్ హీరో అనే విషయంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆ చర్చకు కారణం టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు. కోలీవుడ్లో విజయే నంబర్ వన్ హీరో అంటూ ఆయన ఒకటికి రెండు ఇంటర్వ్యూల్లో స్టేట్మెంట్ ఇచ్చాడు. అందుకు విజయ్ సినిమాలు టాక్, రిజల్ట్తో సంబంధం లేకుండా తమిళనాట రాబట్టిన వసూళ్ల వివరాలను ఉదాహరణగా చెప్పారు.
ఐతే Vijay నంబర్ వన్ హీరో అంటే అజిత్ అభిమానులు ఒప్పుకోవట్లేదు. తమ హీరోకు ఏం తక్కువ.. ఈ ఏడాది విజయ్ సినిమా ‘బీస్ట్’ తుస్సుమనిపిస్తే.. అజిత్ మూవీ ‘వలిమై’ బ్లాక్బస్టర్ అయిన విషయాన్ని ఉదహరిస్తున్నారు. ‘విశ్వాసం’ లాంటి మామూలు సినిమాతో తమిళనాట అజిత్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన విషయాన్ని కూడా ఉదాహరణగా చెబుతున్నారు. ఐతే ఇప్పటిదాకా ఏం జరిగిందన్నది పక్కన పెడితే.. సంక్రాంతికి విజయ్ సినిమా ‘వారిసు’, అజిత్ మూవీ ‘తునివు’ ఒకేసారి రిలీజవుతుండడంతో వీరిలో ఎవరిది పైచేయి అన్నది తేలిపోనుంది.
ఐతే తమిళనాట ఎవరు పైచేయి సాధిస్తారో ఏమో కానీ.. విదేశాల్లో మాత్రం విజయ్ ముందు అజిత్ అస్సలు నిలవలేకపోతున్నాడు. యుఎస్, యూకే సహా ప్రతి దేశంలోనూ విజయ్ సినిమా ఆధిపత్యమే కనిపిస్తోంది. యుఎస్లో ‘వారిసు’ దాదాపు నాలుగొందల స్క్రీన్లలో రిలీజవుతుంటే.. అజిత్ మూవీకి వంద స్క్రీన్లు కూడా ఇవ్వట్లేదు. యూకేలోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఐరోపాలో కూడా ‘వారిసు’ జోరు ముందు ‘తునివువ’ నిలబడే పరిస్థితే లేదు. ఫ్రాన్స్లో విజయ్ మూవీకి 2 వేలకు పైగా షోలు పడుతుంటే.. అజిత్ చిత్రానికి మరీ నామమాత్రంగా మూణ్నాలుగు షోలు మాత్రమే ఇచ్చారట.
తమిళనాట విజయ్కు దీటైన ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్న Ajith.. విదేశాల్లో కనీస స్థాయిలోనూ తమిళ అభిమానుల దృష్టిని ఆకర్షించలేకపోతుండడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇండియాలో కూడా తమిళనాడు అవతల విజయ్కి ఉన్న మార్కెట్, ఫాలోయింగ్ అజిత్కు లేదనే చెప్పాలి.
This post was last modified on December 30, 2022 2:16 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…