తమిళంలో ప్రస్తుతం ఎవరు నంబర్ వన్ హీరో అనే విషయంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆ చర్చకు కారణం టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు. కోలీవుడ్లో విజయే నంబర్ వన్ హీరో అంటూ ఆయన ఒకటికి రెండు ఇంటర్వ్యూల్లో స్టేట్మెంట్ ఇచ్చాడు. అందుకు విజయ్ సినిమాలు టాక్, రిజల్ట్తో సంబంధం లేకుండా తమిళనాట రాబట్టిన వసూళ్ల వివరాలను ఉదాహరణగా చెప్పారు.
ఐతే Vijay నంబర్ వన్ హీరో అంటే అజిత్ అభిమానులు ఒప్పుకోవట్లేదు. తమ హీరోకు ఏం తక్కువ.. ఈ ఏడాది విజయ్ సినిమా ‘బీస్ట్’ తుస్సుమనిపిస్తే.. అజిత్ మూవీ ‘వలిమై’ బ్లాక్బస్టర్ అయిన విషయాన్ని ఉదహరిస్తున్నారు. ‘విశ్వాసం’ లాంటి మామూలు సినిమాతో తమిళనాట అజిత్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన విషయాన్ని కూడా ఉదాహరణగా చెబుతున్నారు. ఐతే ఇప్పటిదాకా ఏం జరిగిందన్నది పక్కన పెడితే.. సంక్రాంతికి విజయ్ సినిమా ‘వారిసు’, అజిత్ మూవీ ‘తునివు’ ఒకేసారి రిలీజవుతుండడంతో వీరిలో ఎవరిది పైచేయి అన్నది తేలిపోనుంది.
ఐతే తమిళనాట ఎవరు పైచేయి సాధిస్తారో ఏమో కానీ.. విదేశాల్లో మాత్రం విజయ్ ముందు అజిత్ అస్సలు నిలవలేకపోతున్నాడు. యుఎస్, యూకే సహా ప్రతి దేశంలోనూ విజయ్ సినిమా ఆధిపత్యమే కనిపిస్తోంది. యుఎస్లో ‘వారిసు’ దాదాపు నాలుగొందల స్క్రీన్లలో రిలీజవుతుంటే.. అజిత్ మూవీకి వంద స్క్రీన్లు కూడా ఇవ్వట్లేదు. యూకేలోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఐరోపాలో కూడా ‘వారిసు’ జోరు ముందు ‘తునివువ’ నిలబడే పరిస్థితే లేదు. ఫ్రాన్స్లో విజయ్ మూవీకి 2 వేలకు పైగా షోలు పడుతుంటే.. అజిత్ చిత్రానికి మరీ నామమాత్రంగా మూణ్నాలుగు షోలు మాత్రమే ఇచ్చారట.
తమిళనాట విజయ్కు దీటైన ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్న Ajith.. విదేశాల్లో కనీస స్థాయిలోనూ తమిళ అభిమానుల దృష్టిని ఆకర్షించలేకపోతుండడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇండియాలో కూడా తమిళనాడు అవతల విజయ్కి ఉన్న మార్కెట్, ఫాలోయింగ్ అజిత్కు లేదనే చెప్పాలి.
This post was last modified on December 30, 2022 2:16 pm
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…