మెగాస్టార్ Chiranjeeviని ఆయన వీరాభిమాని అయిన బాబీ డైరెక్ట్ చేసిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా చేసే అవకాశం దక్కినప్పటి నుంచి బాబీ ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. సందర్భం వచ్చిన ప్రతిసారీ చిరు మీద తనది ఏ స్థాయి అభిమానమో చెబుతూనే వస్తున్నాడతను. తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ టీం అంతా కలిసి పాల్గొన్న గ్రాండ్ ప్రెస్ మీట్లో బాబీ మరోసారి చిరుపై తన అభిమానాన్ని ప్రదర్శించాడు. ఈ సందర్భంగా అతను చెప్పిన ఒక ‘ఫొటో’ స్టోరీ అందరినీ ఆకట్టుకుంది. ఆ స్టోరీ సంగతులేంటో చూద్దాం పదండి.
తన అభిమాన కథానాయకుడైన చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ సినిమా బ్లాక్బస్టర్ అవడం తాను ఇండస్ట్రీలోకి రావడానికి బీజం వేసిందని.. ఆ సినిమా రిలీజ్ తర్వాత తాను హైదరాబాద్ వచ్చేశానని.. ఆ సినిమాకు కథ అందించిన చిన్నికృష్ణను కలిసి తాను ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న విషయాన్ని చెప్పానని బాబీ తెలిపాడు. తాను 20 రోజుల పాటు వదలకుండా ఆయన వెనక తిరగడంతో తన దగ్గర అసిస్టెంట్గా చేర్చుకున్నట్లు బాబీ వెల్లడించాడు.
కాగా అదే సమయంలో తాను చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో మిగతా అభిమానులతో కలిసి రక్తం ఇవ్వడానికి వెళ్లానని.. అప్పుడు తనతో పాటు ఉన్న 50 మంది అభిమానులతో చిరు ఫొటోలు దిగాడన్నారు. కాగా తాను ఒక రౌండ్ అయ్యాక రెండోసారి ఆయనతో ఫొటో కోసం వెళ్లానని.. ఐతే తాను మళ్లీ వచ్చానని గుర్తించిన చిరు తన వైపు కొంచెం కోపంగా చూస్తూ ఫొటో వైపు చూడమన్నారని.. అలా చిరుతో తాను తీయించుకున్న ఫొటోలో ఆయన చాలా కోపంగా కనిపిస్తారని బాబీ గుర్తు చేసుకున్నాడు. తాను అంతకుముందు చిరు నవ్వుతుండగా తీయించుకున్న ఫొటో మాత్రం మిస్సయిందని.. ఆయన కోపంగా ఉన్న ఫొటోనే మిగలడంతో ఈ కోపానికి కారణం ఏంటని తనను చాలామంది అడిగారని బాబీ చెప్పాడు.
కాగా తాను దర్శకుడయ్యాక Pawan kalyanతో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చేస్తుండగా.. చిరంజీవి సెట్స్కు వస్తే అప్పుడు పవన్ ప్రోత్సాహంతోనే చిరుతో ఫొటో దిగినట్లు వెల్లడించాడు. బాబీ ఇలా చెబుతుండగా.. చిరు అతడి దగ్గరికొచ్చి గట్టిగా పట్టుకుని నవ్వుతూ ఫొటోగ్రాఫర్లకు సైగ చేసి ఫొటో దిగడం, వెంటనే బాబీకి ఒక ముద్దు కూడా పెట్టడం విశేషం. ఆ తర్వాత బాబీ కొనసాగిస్తూ ఈ ఫొటోను తాను పదిలపరుచుకుంటానని చెప్పాడు.
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…
ఈ రోజు జనసేన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం' సభకు తెలంగాణ పోలీసులు, హైకోర్టు…
దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…