Political News

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అభయారణ్యం పేరుతో అభివృద్ధి పనులకు అటవీ శాఖ అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని, వారిని కిడ్నాప్ చేసి అక్కడకు పంపిస్తే కరెక్ట్ అవుతారని షాకింగ్ కామెంట్స్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక సౌకర్యాలకు అడ్డంకులు సృష్టించవద్దని సూచించారు.

గిరిజనుల ఇళ్లకు క్లియరెన్స్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నాలుగోసారి ముఖ్యమంత్రిని అయ్యానని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అటవీ శాఖపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. పోలీస్ శాఖ ఇప్పటికే పీపుల్స్ ఫ్రెండ్లీగా మారిందని, అటవీ శాఖ మారాల్సిన అవసరముందని అన్నారు. గ్రీన్ కవర్ పెంపు, బయోడైవర్సిటీ పరిరక్షణతో పాటు ప్రజలు ఆహ్లాదంగా పర్యటించేలా అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ల సూచనలను అటవీ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని ఫైర్ అయ్యారు. నిబంధనలకు అనుగుణంగా పర్యావరణహిత ప్రాజెక్టులకు సహకరించాలని ఆదేశించారు. కొంతమంది అటవీ అధికారుల ఇంప్రాక్టికల్ ఆలోచనల వల్ల ఈ తరహా సమస్యలు వస్తున్నాయని అన్నారు. దీనిపై డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ తో కూడా చర్చిస్తానని తెలిపారు.

శ్రీశైలం ప్రాంతంలో భక్తులను అటవీ అధికారులు అడ్డుకోవడంతో తర్వాత రోజు తొక్కిసలాట జరిగే పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

పాపికొండల వంటి గిరిజన ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం, బోర్‌వెల్స్, విద్యుత్, రహదారి సౌకర్యాల కల్పనకు అనుమతులు ఇవ్వకపోవడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. వన్యప్రాణి సంరక్షణ ముఖ్యమని, దాని సాకుతో ప్రజలకు కనీస సౌకర్యాలు నిలిపివేయడం సరికాదని స్పష్టం చేశారు. పోలీసుల మాదిరి ప్రజలకు అటవీ శాఖ అధికారులు అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.

This post was last modified on March 12, 2026 5:03 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Chandrababu

Recent Posts

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

25 minutes ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

2 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

2 hours ago

మార్కెటింగ్ అవసరం లేని కొత్త పాఠం

వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…

3 hours ago

తారకరత్న కుటుంబాన్ని పట్టించుకోవట్లేదా?

కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…

4 hours ago

వారణాసి హీరోయిన్ విదేశీ రహస్యం

ప్రియాంకా చోప్రా మన ప్రేక్షకులకు కొత్త కాదు. హిందీ సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళు, రామ్ చరణ్ జంజీర్…

4 hours ago