తెలుగులో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. గ్రహణం చిత్రంతో అరంగేట్రంలోనే జాతీయ అవార్డు అందుకున్న ఆయన.. ఆ తర్వాత అష్టాచెమ్మా, జెంటిల్మ్యాన్, సమ్మోహనం లాంటి చిత్రాలతో మెప్పించారు. ఇటీవలే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఇంద్రగంటి ఆలీ నిర్వహించే ఆలీతో సరదాగా కార్యక్రమంలో తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
కెరీర్ ఆరంభంలో రామ్ గోపాల్ వర్మ తనకు ఒక కథ ఇచ్చి సినిమా తీయించినట్లు ఇంద్రగంటి వెల్లడించడం విశేషం. తనను అత్యంత ప్రభావితం చేసిన సినిమాల్లో శివ ఒకటని.. వర్మ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన మాటలు కఠినంగా ఉన్నా అన్నీ వాస్తవాలే అని ఇంద్రగంటి వ్యాఖ్యానించడం విశేషం.
ఇక తాను దర్శకుడు కావడానికి ముందు చలి అనే షార్ట్ ఫిలిం తీశానని.. అది చూసి వర్మ చాలా మెచ్చుకున్నారని.. అప్పుడే తన దగ్గర ఉన్న ఒక కథను ఇచ్చి… సినిమాగా తీయమన్నాడని ఇంద్రగంటి తెలిపాడు. ఐతే తాను ఆయన చెప్పినట్లే సినిమా తీశానని.. కానీ అది ఆయనకు నచ్చలేదని, తాను సరిగా తీయలేదని ఫీలై దాన్ని పక్కన పెట్టేశాడని ఇంద్రగంటి వెల్లడించాడు.
ఇక చలి షార్ట్ ఫిలింను తాను అప్పట్లో కేవలం 3500తో తీశానని.. దాన్ని సారథి స్టూడియోస్ ఫిలిం క్లబ్లో చూసేందుకు వచ్చిన తనికెళ్ల భరణికి కూడా బాగా నచ్చిందని, ఆయనే తనను దర్శకుడిగా మారమని సలహా ఇచ్చారని ఇంద్రగంటి వెల్లడించాడు. అప్పుడు తాను గ్రహణం స్క్రిప్టును చూపించగా, ఆయనకు నచ్చి అందులో ముఖ్య పాత్రలు ఎవరెవరు చేయాలో కూడా చెప్పారని.. ఆరు లక్షల ఖర్చుతో ఆ సినిమా తీశానని.. డిజిటల్లో తీసిన ఆ సినిమాను ఫిలింగా మార్చడానికి 11 లక్షలు అయిందని.. దాన్ని నేషనల్ అవార్డులకు పంపితే పురస్కారం దక్కడం పెద్ద షాక్ అని ఇంద్రగంటి తెలిపాడు.
This post was last modified on December 14, 2022 11:45 am
విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియాకు చిక్కెదురైంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న భారత్కు న్యూజిలాండ్ షాక్…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇవాళ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక…
తెలంగాణలో మరో కుంభకోణం జరుగుతోందని బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. దీని…
జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేయడం కలకలం…
సినీ పరిశ్రమను దశాబ్దాల నుంచి పీడిస్తున్న అతి పెద్ద సమస్య.. పైరసీ. గతంలో వీడియో క్యాసెట్లు, సీడీల రూపంలో ఉండే పైరసీ..…
తాను మరో పాదయాత్ర చేయబోతున్నానని ఏపీ మాజీ సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి…