జిగర్ తండ.. తమిళంలో వచ్చిన బెస్ట్ డ్రామా థ్రిల్లర్లలో ఒకటిగా దీన్ని చెప్పొచ్చు. ‘పిజ్జా’ లాంటి సెన్సేషనల్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్తో ‘జిగర్ తండ’తో మహా మహులను మెప్పించారు. తమిళంలో ఉన్న లెజెండరీ ఫిలిం మేకర్స్, యాక్టర్స్ ఈ సినిమా చూసి ఫిదా అయిపోయారు. అతను ఎంచుకున్న కథ.. అనుసరించిన స్క్రీన్ ప్లే.. తీర్చిదిద్దిన పాత్రలు కల్ట్ స్టేటస్ అందుకున్నాయి. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర కూడా ఘనవిజయం దక్కింది.
తమిళ వెర్షన్ను ఇతర భాషల వాళ్లు కూడా చూసి ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ఈ చిత్రం తెలుగులో ‘గద్దలకొండ గణేష్’గా.. హిందీలో ‘బచ్చన్ పాండే’గా రీమేక్ అయింది. ఆయా భాషల్లో మార్పులు చేర్పులు చేసి కొంచెం భిన్నంగా తీర్చిదిద్దగా.. ఒరిజినల్ చూసిన వాళ్లకు ఇవి చూస్తే అంత కిక్కు రాలేదు.
‘జిగర్ తండ’ సినిమాతో కార్తీక్ మీద అంచనాలు అమాంతం పెరిగిపోగా.. వాటిని అందుకునేలా తర్వాత ఏ సినిమా తీయలేకపోయాడు.ఇరైవి, పేట, జగమేతంత్రం, మహాన్.. ఇవేవీ కూడా ‘జిగర్ తండ’కు దరిదాపుల్లో నిలవలేకపోయాయి. ఐతే ఇప్పుడు కార్తీక్ ‘జిగర్ తండ’కు సీక్వెల్ అనౌన్స్ చేసి అందరిలోనూ ఎగ్జైట్మెంట్ పెంచాడు. ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ అనే టైటిల్ పెట్టి.. రెండు గన్నులతో డిఫరెంట్ ప్రి లుక్ పోస్టర్ రిలీజ్ చేశాడు కార్తీక్. దీనికి ఒక వైరైటీ టీజర్ కూడా రెడీ చేశాడు. అది కూడా రిలీజ్ కాబోతోంది. దాంతోనే ఇందులో నటించే లీడ్ ఆర్టిస్టుల వివరాలు వెల్లడించబోతున్నాడు.
‘జిగర్ తండ’లో హీరో, విలన్ పాత్రలు చేసిన సిద్దార్థ్, బాబీ సింహా ఇందులో భాగం అవుతారా లేదా అన్నది సస్పెన్సే. బాబీ సింహా ఆ సినిమాలో లైఫ్ టైం పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఆ పాత్ర ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే చాలా ప్రత్యేకంగా నిలిచిపోయేది అనడంలో సందేహం లేదు. ఆ పాత్రకు గాను అతను నేషనల్ అవార్డు కూడా తీసుకున్నాడు. ‘జిగర్ తండ-2’లో ప్రధాన పాత్రలు ఎలా ఉంటాయి.. వాటిని ఎవరు పోషిస్తారు అన్నది ఆసక్తికరం.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…