జిగర్ తండ.. తమిళంలో వచ్చిన బెస్ట్ డ్రామా థ్రిల్లర్లలో ఒకటిగా దీన్ని చెప్పొచ్చు. ‘పిజ్జా’ లాంటి సెన్సేషనల్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్తో ‘జిగర్ తండ’తో మహా మహులను మెప్పించారు. తమిళంలో ఉన్న లెజెండరీ ఫిలిం మేకర్స్, యాక్టర్స్ ఈ సినిమా చూసి ఫిదా అయిపోయారు. అతను ఎంచుకున్న కథ.. అనుసరించిన స్క్రీన్ ప్లే.. తీర్చిదిద్దిన పాత్రలు కల్ట్ స్టేటస్ అందుకున్నాయి. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర కూడా ఘనవిజయం దక్కింది.
తమిళ వెర్షన్ను ఇతర భాషల వాళ్లు కూడా చూసి ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ఈ చిత్రం తెలుగులో ‘గద్దలకొండ గణేష్’గా.. హిందీలో ‘బచ్చన్ పాండే’గా రీమేక్ అయింది. ఆయా భాషల్లో మార్పులు చేర్పులు చేసి కొంచెం భిన్నంగా తీర్చిదిద్దగా.. ఒరిజినల్ చూసిన వాళ్లకు ఇవి చూస్తే అంత కిక్కు రాలేదు.
‘జిగర్ తండ’ సినిమాతో కార్తీక్ మీద అంచనాలు అమాంతం పెరిగిపోగా.. వాటిని అందుకునేలా తర్వాత ఏ సినిమా తీయలేకపోయాడు.ఇరైవి, పేట, జగమేతంత్రం, మహాన్.. ఇవేవీ కూడా ‘జిగర్ తండ’కు దరిదాపుల్లో నిలవలేకపోయాయి. ఐతే ఇప్పుడు కార్తీక్ ‘జిగర్ తండ’కు సీక్వెల్ అనౌన్స్ చేసి అందరిలోనూ ఎగ్జైట్మెంట్ పెంచాడు. ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ అనే టైటిల్ పెట్టి.. రెండు గన్నులతో డిఫరెంట్ ప్రి లుక్ పోస్టర్ రిలీజ్ చేశాడు కార్తీక్. దీనికి ఒక వైరైటీ టీజర్ కూడా రెడీ చేశాడు. అది కూడా రిలీజ్ కాబోతోంది. దాంతోనే ఇందులో నటించే లీడ్ ఆర్టిస్టుల వివరాలు వెల్లడించబోతున్నాడు.
‘జిగర్ తండ’లో హీరో, విలన్ పాత్రలు చేసిన సిద్దార్థ్, బాబీ సింహా ఇందులో భాగం అవుతారా లేదా అన్నది సస్పెన్సే. బాబీ సింహా ఆ సినిమాలో లైఫ్ టైం పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఆ పాత్ర ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే చాలా ప్రత్యేకంగా నిలిచిపోయేది అనడంలో సందేహం లేదు. ఆ పాత్రకు గాను అతను నేషనల్ అవార్డు కూడా తీసుకున్నాడు. ‘జిగర్ తండ-2’లో ప్రధాన పాత్రలు ఎలా ఉంటాయి.. వాటిని ఎవరు పోషిస్తారు అన్నది ఆసక్తికరం.
This post was last modified on December 11, 2022 5:21 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…