Movie News

నేను సుశాంత్ గర్ల్ ఫ్రెండ్.. సీబీఐ ఎంక్వైరీ వేయండి

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న వ్యక్తుల్లో రియా చక్రవర్తి ఒకరు. ఈ అమ్మాయి సుశాంత్ ప్రేయసి కావడం గమనార్హం. ఆమెను మరి కొన్ని నెలల్లో సుశాంత్ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతోనూ ఉన్నాడట. కానీ ఏం జరిగిందో ఏమో.. ఇప్పుడిలా అర్ధంతరంగా జీవితాన్ని ముగించాడు.

సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడటానికి రియా కూడా ఓ కారణం అంటూ ఆమెపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. మొన్న సుశాంత్ చనిపోయి నెల రోజులు పూర్తయిన నేపథ్యంలో అతడితో సన్నిహితంగా ఉన్నప్పటి ఫొటోలు పెట్టి ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది రియా. ఐతే అందులో ఆమె బాధను పట్టించుకోకుండా సుశాంత్ మరణానికి కారణమై ఇప్పుడు డ్రామాలాడుతున్నావా అంటూ నెటిజన్లు ఆమెను తిట్టిపోశారు.

ఐతే రియా అవేమీ పట్టించుకోకుండా తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ట్యాగ్ చేస్తూ ఓ సంచలన ట్వీట్ వేసింది. తాను సుశాంత్ ప్రేయసినని చెబుతూ.. అతను చనిపోయి నెల రోజులు అవుతోందని.. ప్రభుత్వం మీద తనకు పూర్తి విశ్వాసం ఉందని.. సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడేంత ఒత్తిడికి గురి కావడానికి కారణాలేంటో తెలుసుకునేందుకు సీబీఐ విచారణ జరిపించాలని కోరింది రియా.

ఐతే రియా, మహేష్ భట్, మరికొందరు బాలీవుడ్ బడా బాబులే సుశాంత్ మృతికి కారణమని.. అలాంటిది రియానే సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ కోరడం హాస్పాస్పదమని.. అయినా సుశాంత్ చనిపోయిన నెల రోజుల తర్వాత తీరిగ్గా ఇప్పుడు సీబీఐ విచారణ కోరడం ఏంటని.. ఈ పని అతను చనిపోయిన వెంటనే ఎందుకు చేయలేదని రియాను ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మొత్తంగా రియా ఏం చేసినా తప్పే అన్నట్లుగా ఉంది వ్యవహారం.

This post was last modified on July 16, 2020 4:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

1 hour ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago