సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న వ్యక్తుల్లో రియా చక్రవర్తి ఒకరు. ఈ అమ్మాయి సుశాంత్ ప్రేయసి కావడం గమనార్హం. ఆమెను మరి కొన్ని నెలల్లో సుశాంత్ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతోనూ ఉన్నాడట. కానీ ఏం జరిగిందో ఏమో.. ఇప్పుడిలా అర్ధంతరంగా జీవితాన్ని ముగించాడు.
సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడటానికి రియా కూడా ఓ కారణం అంటూ ఆమెపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. మొన్న సుశాంత్ చనిపోయి నెల రోజులు పూర్తయిన నేపథ్యంలో అతడితో సన్నిహితంగా ఉన్నప్పటి ఫొటోలు పెట్టి ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది రియా. ఐతే అందులో ఆమె బాధను పట్టించుకోకుండా సుశాంత్ మరణానికి కారణమై ఇప్పుడు డ్రామాలాడుతున్నావా అంటూ నెటిజన్లు ఆమెను తిట్టిపోశారు.
ఐతే రియా అవేమీ పట్టించుకోకుండా తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ట్యాగ్ చేస్తూ ఓ సంచలన ట్వీట్ వేసింది. తాను సుశాంత్ ప్రేయసినని చెబుతూ.. అతను చనిపోయి నెల రోజులు అవుతోందని.. ప్రభుత్వం మీద తనకు పూర్తి విశ్వాసం ఉందని.. సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడేంత ఒత్తిడికి గురి కావడానికి కారణాలేంటో తెలుసుకునేందుకు సీబీఐ విచారణ జరిపించాలని కోరింది రియా.
ఐతే రియా, మహేష్ భట్, మరికొందరు బాలీవుడ్ బడా బాబులే సుశాంత్ మృతికి కారణమని.. అలాంటిది రియానే సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ కోరడం హాస్పాస్పదమని.. అయినా సుశాంత్ చనిపోయిన నెల రోజుల తర్వాత తీరిగ్గా ఇప్పుడు సీబీఐ విచారణ కోరడం ఏంటని.. ఈ పని అతను చనిపోయిన వెంటనే ఎందుకు చేయలేదని రియాను ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మొత్తంగా రియా ఏం చేసినా తప్పే అన్నట్లుగా ఉంది వ్యవహారం.
This post was last modified on July 16, 2020 4:47 pm
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…