తెలుగు సినిమాల్లో ఎప్పుడూ తెలుగు హీరోలే నటిస్తారు. మిగతా పాత్రల్లో చాలా వాటికి తెలుగు నటుల్నే తీసుకుంటారు. కానీ హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి మాత్రం ఇతర భాషల భామల వైపు చూస్తారు. రకరకాల కారణాల వల్ల తెలుగు హీరోయిన్లు మన దగ్గర అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు.
అవకాశాలు అందుకోలేకపోతున్నారు. ఈ మధ్య తెలుగు అమ్మాయిలకు ప్రాధాన్యం మరింత తగ్గిపోతోంది. ఇలాంటి టైంలో రాజశేఖర్ కూతుళ్లయిన శివాని, శివాత్మిక హీరోయిన్లు అయ్యారు. వారి కెరీర్లు అనుకున్నంత స్థాయిలో ముందుకు కదలట్లేదు.
ఈ పరిస్థితుల్లో తన చిన్న కూతురు Shivathmika కీలక పాత్ర పోషించిన ‘Panchatantram’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో జీవిత.. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన హరీష్ శంకర్ను ఉద్దేశించి మాట్లాడుతూ.. తెలుగు హీరోయిన్లు, ఆర్టిస్టులను ప్రోత్సహించాలని కోరారు. హరీష్ శంకర్ దీనిపై ఆసక్తికర రీతిలో స్పందించాడు.
తెలుగు వారికి తన సినిమాల్లో ప్రాధాన్యం ఇవ్వడానికి సాధ్యమైనంతగా ప్రయత్నిస్తున్నానని.. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఈ విషయంలో పూర్తిగా న్యాయం చేయలేక పోతున్నందుకు క్షమించాలని హరీష్ శంకర్ వ్యాఖ్యానించాడు. “ఓ రచయితగా తెలుగు వారినే వివిధ పాత్రలకు ఎంపిక చేయడానికి నేను ఇష్టపడతా. అప్పుడప్పుడు నేను ఫస్ట్ టేక్ తర్వాత రెండో టేక్కు డైలాగ్ మారుస్తుంటా. అలా చేస్తే ముంబయి నుంచి వచ్చిన వాళ్లు మళ్లీ ప్రాక్టీస్ చేయడం కోసం టైం అడుగుతుంటారు. కానీ తెలుగు వాళ్లుంటే ఈ సమస్య ఉండదు.
సెట్లో మొత్తం తెలుగు వాళ్లే ఉండాలని నేను అనుకుంటా. కానీ కొన్ని పరిస్థితుల వల్ల మన వాళ్లకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతున్నందుకు క్షమించాలి. ‘గద్దల కొండ గణేష్’లో తెలుగ అమ్మాయి అయిన డింపుల్ హయతితో ఒక పాట చేయిస్తే ఆమె ఇప్పుడు బిజీ హీరోయిన్ అయింది” అని హరీష్ శంకర్ పేర్కొన్నాడు. హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ‘పంచతంత్రం’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on December 8, 2022 4:27 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…