తెలుగు సినిమాల్లో ఎప్పుడూ తెలుగు హీరోలే నటిస్తారు. మిగతా పాత్రల్లో చాలా వాటికి తెలుగు నటుల్నే తీసుకుంటారు. కానీ హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి మాత్రం ఇతర భాషల భామల వైపు చూస్తారు. రకరకాల కారణాల వల్ల తెలుగు హీరోయిన్లు మన దగ్గర అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు.
అవకాశాలు అందుకోలేకపోతున్నారు. ఈ మధ్య తెలుగు అమ్మాయిలకు ప్రాధాన్యం మరింత తగ్గిపోతోంది. ఇలాంటి టైంలో రాజశేఖర్ కూతుళ్లయిన శివాని, శివాత్మిక హీరోయిన్లు అయ్యారు. వారి కెరీర్లు అనుకున్నంత స్థాయిలో ముందుకు కదలట్లేదు.
ఈ పరిస్థితుల్లో తన చిన్న కూతురు Shivathmika కీలక పాత్ర పోషించిన ‘Panchatantram’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో జీవిత.. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన హరీష్ శంకర్ను ఉద్దేశించి మాట్లాడుతూ.. తెలుగు హీరోయిన్లు, ఆర్టిస్టులను ప్రోత్సహించాలని కోరారు. హరీష్ శంకర్ దీనిపై ఆసక్తికర రీతిలో స్పందించాడు.
తెలుగు వారికి తన సినిమాల్లో ప్రాధాన్యం ఇవ్వడానికి సాధ్యమైనంతగా ప్రయత్నిస్తున్నానని.. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఈ విషయంలో పూర్తిగా న్యాయం చేయలేక పోతున్నందుకు క్షమించాలని హరీష్ శంకర్ వ్యాఖ్యానించాడు. “ఓ రచయితగా తెలుగు వారినే వివిధ పాత్రలకు ఎంపిక చేయడానికి నేను ఇష్టపడతా. అప్పుడప్పుడు నేను ఫస్ట్ టేక్ తర్వాత రెండో టేక్కు డైలాగ్ మారుస్తుంటా. అలా చేస్తే ముంబయి నుంచి వచ్చిన వాళ్లు మళ్లీ ప్రాక్టీస్ చేయడం కోసం టైం అడుగుతుంటారు. కానీ తెలుగు వాళ్లుంటే ఈ సమస్య ఉండదు.
సెట్లో మొత్తం తెలుగు వాళ్లే ఉండాలని నేను అనుకుంటా. కానీ కొన్ని పరిస్థితుల వల్ల మన వాళ్లకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతున్నందుకు క్షమించాలి. ‘గద్దల కొండ గణేష్’లో తెలుగ అమ్మాయి అయిన డింపుల్ హయతితో ఒక పాట చేయిస్తే ఆమె ఇప్పుడు బిజీ హీరోయిన్ అయింది” అని హరీష్ శంకర్ పేర్కొన్నాడు. హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ‘పంచతంత్రం’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on December 8, 2022 4:27 pm
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…