యశోదకి చిక్కు వీడింది

సమంత లేటెస్ట్ మూవీ యశోదకి ఓటీటీ చిక్కు ఎదురైన సంగతి తెలిసిందే. సినిమా ఓటీటీ రిలీజ్ పై కోర్టు స్టే ఇచ్చింది. విషయంలోకి వెళితే సినిమాలో సరోగశి ఫెసిలిటీ హాస్పిటల్ చూపించారు. దానికి ఈవా అనే పేరు పెట్టారు.

ఇదే పేరుతో హైదరాబాద్ లో ఓ హాస్పిటల్ ఉంది. దీంతో హాస్పిటల్ ఎండీ మోహన్ రావు కోర్టులో కేసు వేశారు. తమ హాస్పిటల్ రిపిటేషన్ దెబ్బ తీసేలా సినిమాలో ఈవా పేరు పెట్టారని కేసు ఫైల్ చేశారాయన. దీంతో తీర్పు వచ్చే వరకు ఓటీటీ రిలీజ్ చేయకూడదని కోర్టు ఆదేశించింది. ఈ విషయంపై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ పై డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిన ఓటీటీ సంస్థ తీవ్ర ఒత్తిడి చేసింది. దీంతో నిర్మాత ఈవా ఎండీ తో మీటింగ్ పెట్టుకొని సమస్యను క్లియర్ చేసుకున్నారు.

ఓటీటీ వర్షన్ లో ఈవా పేరు తొలగించేందుకు అంగీకరించారు నిర్మాత. అలాగే థియేటర్ వర్షన్ లో మార్పు కి కాస్త సమయం కోరారు. థియేటర్ లో పేరు తీయడం ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు మోహన్ రావు ను నిర్మాత టైం అడిగారు. ఈ లోపు ఓటీటీలో సినిమా వచ్చేసే అవకాశం ఉంది. సో యశోద కి చుట్టుకున్న ఇష్యూ క్లియర్ అయిపోయింది. అతి త్వరలోనే సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది.