నిన్నంతా సోషల్ మీడియాలో రష్మిక మందన్న మీద కన్నడ పరిశ్రమ త్వరలోనే బ్యాన్ విధించబోతోందని, ఆమె నటించిన సినిమాలేవీ కర్ణాటకలో రిలీజ్ కానివ్వకుండా కఠిన చర్యలు తీసుకునేలా నిర్ణయం తీసుకుంటుందని రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తనకు కిరాక్ పార్టీతో మొదటి అవకాశం ఇచ్చిన నిర్మాణ సంస్థ గురించి చులకనగా మాట్లాడ్డమే దీనికి కారణంగా నెటిజెన్లు చెప్పుకొచ్చారు. దెబ్బకు శ్రీవల్లి ఫ్యాన్స్ కి ఖంగారు మొదలైపోయింది. ఒకవేళ అదే కనక జరిగితే స్టార్ హీరోలు తమ జోడిగా తీసుకోరేమోనన్న ఆందోళన పలు ట్వీట్లలో కనిపించింది.
అసలు కామెడీ ఏంటంటే వాళ్ళు నిజంగా అలా చేయాలనుకున్నా ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. ఎందుకంటే పుష్ప 2 ది రూల్, వారసుడు లాంటి క్రేజీ ప్యాన్ ఇండియా సినిమాల్లో తనే మెయిన్ లీడ్. వాటిని అడ్డుకుంటే మహా అయితే ఒక రాష్ట్రానికి సంబంధించిన రెవిన్యూ తగ్గిపోతుంది. దానికి బదులుగా తమిళ తెలుగు నిర్మాతలు ఇకపై శాండల్ వుడ్ చిత్రాలను తాము కూడా రిలీజ్ చేయమని భీష్మించుకు కూర్చుంటే వ్యవహారం ఎక్కడికో వెళ్తుంది. ప్రతి నెల కెజిఎఫ్, కాంతారలు తీయరు కదా. రెగ్యులర్ మూవీస్ కూడా ఉంటాయి. వాటికి ఏకంగా నాలుగు రాష్ట్రాల మార్కెట్ పోతుంది. దీని వల్ల నష్టం ఎవరికి?
అయినా రష్మిక వ్యక్తపరిచింది ఒక ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలు. అక్కడ ఎవరినీ దారుణంగా కించపరచడం కానీ అవమానించడం కానీ జరగలేదు. వ్యంగ్యంగా కొన్ని అనిపించినా మరీ ఈ స్థాయిలో చర్యలు తీసుకునేవి కాదు. ఎలాగూ టైం లేక మందన్న కన్నడ సినిమాలు చేయడం ఎప్పుడో తగ్గించేసింది. అలాంటప్పుడు అక్కడ నిషేధించినా చేయకపోయినా ఒకటే. ప్రస్తుతానికి రష్మిక నుంచి ఎలాంటి స్పందన లేదు కానీ కన్నడ ఫ్యాన్స్ లో తన మీద బాగానే ఫైర్ అవుతున్నారు. బ్యాన్ వార్తలను పనిగట్టుకుని మరీ రీ ట్విట్లు చేస్తూ అదేదో నిజంగా జరిగిందన్న భ్రమను కలిగిస్తున్నారు.
This post was last modified on November 25, 2022 10:24 am
నిన్న కల్ట్ టీజర్ రిలీజయ్యాక దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్…
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…