సీతారామమ్ సినిమాతో తెలుగులో పాపులర్ అయిపోయింది బాలీవుడ్ టివి సీరియల్స్ భామ మృణాల్ థాకూర్. అప్పటికే హిందీలో చాలా సినిమాల్లో సైడ్ క్యారక్టర్స్ అలాగే మెయిన్ లీడ్స్లో చేసింది కాని, అమ్మడికి ఎందుకో బ్రేక్ రాలేదు. కాని సీతారామమ్ సినిమాతో తెలుగులో ఒక్కసారిగా బాగా పేరొచ్చింది. అయితే ఇప్పటివరకు ఇక్కడ మరో సినిమానే సైన్ చేయలేదు. దానికి కారణం ఆమె కోటి రూపాయలు డిమాండ్ చేస్తోందని టాక్ వినిపిస్తుంటే.. అసలు మరో రీజన్ ఉందని ఫీలైందట ఈ మహారాష్ట్ర బ్యూటి.
హను రాఘవపూడి రూపొందించిన సినిమాలో ప్రిన్సెస్ నూర్జహాన్ పాత్రలో చాలా హుందాగా కనిపించింది మృణాల్. ఎక్కువగా చీరల్లో దర్శనమిచ్చి.. ఒక సొగసైన లేడీగా అలరించింది. కాని ఆమె బాలీవుడ్లో ఆరబోసినట్లు అందాల ఆరబోతకు ఛాన్సు దొరకలేదు. అయితే మృణాల్ కూడా.. తెలుగులో ఇలాంటి హుందాగా ఉండే రోల్స్ చేస్తాను కాని, గ్లామరస్ రోల్స్ చేయనంటూ ఎక్కడో చిన్న కామెంట్ చేయడంతో.. తెలుగు నుండి ఆఫర్లు రావట్లేదని అనిపించిందట. ఈ మధ్యన బాలీవుడ్లో కూడా నాన్-గ్లామర్ లుక్లోనే ఎక్కువగా దర్శనమిస్తున్న మృణాల్.. ఇప్పుడు టోటల్గా పందా మార్చాలని డిసైడైయ్యి.. ఒక ఫ్యాషన్ షోలో.. ఈజిప్షియన్ ప్రిన్సెస్ తరహాలో సందడి చేసింది.
మొన్నటివరకు కేవలం డీప్ నెక్ దస్తుల్లో సందడి చేసిన మృణాల్.. సడన్గా ఇలా పొట్టి దుస్తుల్లో అందాలన ఆరబోయడంతో చూపరులు కూడా ఆశర్చర్యపోయారు. ఇక మీదట కొన్ని రోజులు ఇదే తరహాలో హాట్ లుక్స్లో సందడి చేస్తూ.. టాలీవుడ్కు ఒక పెద్ద మెసేజ్ ఇస్తుందట. ఆ విధంగానైనా పెద్ద సినిమాల ఆఫర్లు తనకు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరి గేర్ మార్చిన ప్రిన్సెస్కు తెలుగు ఇండస్ట్రీ ఎలాంటి ఛాన్సులిస్తుందో చూద్దాం.
This post was last modified on November 25, 2022 10:17 am
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…