సీతారామమ్ సినిమాతో తెలుగులో పాపులర్ అయిపోయింది బాలీవుడ్ టివి సీరియల్స్ భామ మృణాల్ థాకూర్. అప్పటికే హిందీలో చాలా సినిమాల్లో సైడ్ క్యారక్టర్స్ అలాగే మెయిన్ లీడ్స్లో చేసింది కాని, అమ్మడికి ఎందుకో బ్రేక్ రాలేదు. కాని సీతారామమ్ సినిమాతో తెలుగులో ఒక్కసారిగా బాగా పేరొచ్చింది. అయితే ఇప్పటివరకు ఇక్కడ మరో సినిమానే సైన్ చేయలేదు. దానికి కారణం ఆమె కోటి రూపాయలు డిమాండ్ చేస్తోందని టాక్ వినిపిస్తుంటే.. అసలు మరో రీజన్ ఉందని ఫీలైందట ఈ మహారాష్ట్ర బ్యూటి.
హను రాఘవపూడి రూపొందించిన సినిమాలో ప్రిన్సెస్ నూర్జహాన్ పాత్రలో చాలా హుందాగా కనిపించింది మృణాల్. ఎక్కువగా చీరల్లో దర్శనమిచ్చి.. ఒక సొగసైన లేడీగా అలరించింది. కాని ఆమె బాలీవుడ్లో ఆరబోసినట్లు అందాల ఆరబోతకు ఛాన్సు దొరకలేదు. అయితే మృణాల్ కూడా.. తెలుగులో ఇలాంటి హుందాగా ఉండే రోల్స్ చేస్తాను కాని, గ్లామరస్ రోల్స్ చేయనంటూ ఎక్కడో చిన్న కామెంట్ చేయడంతో.. తెలుగు నుండి ఆఫర్లు రావట్లేదని అనిపించిందట. ఈ మధ్యన బాలీవుడ్లో కూడా నాన్-గ్లామర్ లుక్లోనే ఎక్కువగా దర్శనమిస్తున్న మృణాల్.. ఇప్పుడు టోటల్గా పందా మార్చాలని డిసైడైయ్యి.. ఒక ఫ్యాషన్ షోలో.. ఈజిప్షియన్ ప్రిన్సెస్ తరహాలో సందడి చేసింది.
మొన్నటివరకు కేవలం డీప్ నెక్ దస్తుల్లో సందడి చేసిన మృణాల్.. సడన్గా ఇలా పొట్టి దుస్తుల్లో అందాలన ఆరబోయడంతో చూపరులు కూడా ఆశర్చర్యపోయారు. ఇక మీదట కొన్ని రోజులు ఇదే తరహాలో హాట్ లుక్స్లో సందడి చేస్తూ.. టాలీవుడ్కు ఒక పెద్ద మెసేజ్ ఇస్తుందట. ఆ విధంగానైనా పెద్ద సినిమాల ఆఫర్లు తనకు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరి గేర్ మార్చిన ప్రిన్సెస్కు తెలుగు ఇండస్ట్రీ ఎలాంటి ఛాన్సులిస్తుందో చూద్దాం.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…