రష్మిక మందన్నా ఒక మామూలు కాలేజీ అమ్మాయి నుంచి కొన్నేళ్లు తిరిగేసరికి ఇండియాలోనే టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగిపోయింది. సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ఆమెకు తొలి అవకాశం ఇచ్చింది కన్నడ ఫిలిం ఇండస్ట్రీ. ఏదో చిన్న మోడలింగ్ ప్రోగ్రాంలో పాల్గొంటే దానికి సంబంధించిన ఫొటోలు ఒక న్యూస్ పేపర్లో పబ్లిష్ అయితే.. వాటిని చూసి దర్శకుడు రిషబ్ శెట్టి, హీరో కమ్ ప్రొడ్యూసర్ రక్షిత్ శెట్టి కలిసి ఆమెకు ‘కిరిక్ పార్టీ’లో ఛాన్స్ ఇవ్వడం.. ఆ సినిమా బ్లాక్బస్టర్ అయి ఆమెను బిజీ హీరోయిన్గా మార్చడం.. ఇంతలో తెలుగులో అవకాశాలు రావడంతో ఆమె ఇటు వైపు వచ్చేయడం.. ఆపై తమిళం, హిందీలోనూ అవకాశాలు అందుకుని పాన్ ఇండియా హీరోయిన్గా ఎదగడం జరిగింది.
ఐతే కన్నడలో పాపులారిటీ సంపాదించాక కన్నడ ఇండస్ట్రీని రష్మిక పట్టించుకోలేదని, తెలుగు సినిమాలకు ప్రయారిటీ ఇచ్చిందని.. కన్నడ సినిమాల గురించి తక్కువగా చూసిందనే విమర్శలు ఎప్పట్నుంచో ఉన్నాయి. ఆమెను తరచుగా కన్నడ ఫ్యాన్స్ ఏదో ఒక కారణం చూపించి ట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు రష్మిక చేసిన ఒక కామెంట్తో వారికి మరింత మండింది.
ఒక ఇంటర్వ్యూలో భాగంగా తనకు తొలి అవకాశం ఎలా వచ్చిందో ఆమె వివరిస్తూ.. తనను ఇంట్రడ్యూస్ చేసిన బేనర్, నిర్మాతల గురించి ప్రస్తావించడానికి ఇష్టపడలేదు. సోసో ప్రొడక్షన్ హౌస్ అన్నట్లుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి రిషబ్, రక్షిత్ల పేర్లే చెప్పకుండా ముందుకెళ్లిపోయింది. ఐతే రిషబ్, రక్షిత్ మామూలు వాళ్లు కాదు. వాళ్ల పేర్లను రష్మిక మరిచిపోయే సీన్ లేదు. ఉద్దేశపూర్వకంగానే వారి పేర్లను ఆమె పరిహరించిందంటూ ఆ వీడియో పెట్టి రష్మికను ట్రోల్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. రిషబ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సమంత, సాయిపల్లవి, రష్మిక లాంటి హీరోయిన్లలో ఎవరితో పని చేయడానికి ఇష్టపడతారని అడగ్గా.. అతను కావాలనే రష్మిక పేరు మినహాయించి మాట్లాడిన వీడియో కూడా రష్మిక వీడియోతో పాటు కలిపి ట్రెండ్ అవుతోంది. రష్మిక యాటిట్యూడ్ చూపిస్తే.. రిషబ్ ఆమెకు సరిగ్గానే పంచ్ ఇచ్చాడంటూ ఆమెను మరింతగా ట్రోల్ చేస్తున్నారు కన్నడిగులు.
This post was last modified on November 23, 2022 9:30 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…